Publish Date:Mar 28, 2026
అమరావతి రాజధానిగా ఏకగ్రీవ తీర్మానం సంగతి సరే.. రేపు జగన్ వచ్చినా? ఈ ప్రాంతాన్ని రాజధానిగా హోదా మార్చడానికి వీల్లేదా? అంతగా ఈ చట్టంలో, ఈ తీర్మానంలో ఏముంది? అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ తీర్మానం కాదు. ఇది ఒక చట్టబద్ధమైన రక్షణ కవచం అంటూ లీగల్ షీల్డ్. సపోజ్.. ఫర్ సపోజ్ వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, మరెవరైనా అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేనంతగా ఈ తీర్మానం ఒక మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇంతకీ అదేంటి?
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్రస్తావించిన సెక్షన్ 5 సవరణ అత్యంత కీలకం. 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం.. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఉండాలని ఉంది. కానీ, దాని పేరు అమరావతి అని ఎక్కడా స్పష్టంగా లేదు. ఈ చట్టానికి సవరణ చేసి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే దగ్గర అమరావతి అనే పదాన్ని చేర్చాలని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం (మార్చి 28) తీర్మానం చేసింది. ఒక్కసారి పార్లమెంటు ఈ సవరణను ఆమోదిస్తే, అమరావతి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకునే నిర్ణయం కాబోదు.. ఇది కేంద్ర చట్టంలో ఒక భాగం అవుతుంది.
సాధారణంగా రాజధాని ఎక్కడా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. గతంలో జగన్ మూడు రాజధానుల బిల్లు తెచ్చినట్టు..అయితే ఒక సారి అమరావతి రాజథాని అని కేంద్ర ప్రభుత్వం రికగ్నైజేషన్ యాక్ట్ లోకి వెళ్తే.. దాన్ని మార్చాలంటే మళ్లీ పార్లమెంటు ఆమోదం కావల్సిందే. ఒక వేళ జగన్ వచ్చి మళ్లీ మూడు రాజధాని బిల్లు తెచ్చినా అది కేంద్ర చట్టానికి విరుద్ధం అవుతుంది. మళ్లీ కేసులు గట్రా అయ్యి కాలయాపన జరిగి.. ఎటూ గాకుండా పోతుంది. అచ్చెన్నాయుడు అన్నట్టు 2019లో జరిగినట్టు 2029లో గానీ జగన్ వస్తే.. ఇక ఆంధ్రప్రజల అవస్థ మళ్లీ మొదటికే వస్తుందన్నది గుర్తుంచుకోవాలి.
ఇంతకీ అమరావతి అంటే ఏమిటి? ఆ నిర్వచనం ఎలాంటిదని గమనిస్తే.. ఇది ఒక ఊరు కాదు.. రాజధాని అభివృద్ధి సాకార సంస్థ.. పరిధిలో నోటిఫై చేసిన ప్రాంతం. దీన్నే అమరావతిగా గుర్తించాలని ఈ తీర్మానంలో కోరారు. ఇందువల్ల రాజధాని విస్తీర్ణంపై కూడా చట్టబద్ధమైన క్లారిటీ వచ్చే అవకాశముంది. గతంలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకి లేదని చెప్పింది. ఇప్పుడీ తీర్మానం ద్వారా కేంద్రం చట్టం చేస్తే.. ఆ తీర్పునకు మరింత బలం చేకూరుతుంది. ఇందువల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని అంగుళం కూడా కదిలించలేదు. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు ధీమా.
ఈ తీర్మానం లక్ష్యం ఒక్కటే. రాజకీయ అస్తిరత నుంచి రాజధానిని కాపాడడం. ఒక వేళ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల పాట మొదలెట్టినా ఫలితం ఉండదు. అందుకే అసెంబ్లీలో అమరావతిని ఏపీ ఏకైక శాశ్వత రాజధానిగా చేసిన తీర్మానానికి అంత ప్రాముఖ్యత.మంత్రి లోకేష్ చెప్పినట్లు ఈ బిల్లును పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదానికి ప్రవేశ పెట్టి ఆమోదిస్తే.. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది. రాజథాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగానికి సార్థకత చేకూరుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaravati---permanent-capital-of-andhra-pradesh-25-216344.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.