Publish Date:Aug 22, 2022
ఊళ్లో ఉన్న దొంగని పట్టుకోవడానికి విదేశాలకి వెళ్లి సమాచారం పట్టుకొచ్చాడట ఒకాయన వెనకటికి. తీరా చూస్తే పక్కవీధిలో పోలీసాయన ఆయన్ను స్టేషన్కి పిలిపించి అడ్రస్ రాసుకుని పంపించేశాట్ట. సీబీఐ అంతటి సంస్థ మనీష్ సిసోడియా దేశం విడిచి వెళ్లిందీ లేనిదీ తెలుసుకోకుండానే లుకౌట్ నోటీసు జారీ చేయడం కంటే హాస్యాస్పదం వేరొకటి ఉండదు. ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్న తనకు అలా నోటీ సులు ఇవ్వడం కేంద్రం ఓవరాక్షన్ అవుతుందని సిసోడియా ఘాటుగా స్పందించారు. సీబీఐ, ఈడీ తమ అధీ నంలో పెట్టుకుని ఎవరు ఎక్కడున్నదీ తెలుసుకోలేని స్థితిలో ఉండడం ఆశ్చర్యపరుస్తుందని ఆప్ అధి నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా విమర్శించారు.
అయితే.. అనంతరం దీనిపై సీబీఐ వివరణ ఇచ్చింది. ఇప్పటికైతే ఈ కేసులో ఎవరిపైనా లుకౌట్ నోటీసు జారీ చేయలేదని తేల్చిచెప్పింది. అందునా.. ప్రజాసేవకులు (ఈ కేసులో మంత్రి సిసోడియా) ప్రభుత్వాని కి తెలపకుండా దేశం విడిచి వెళ్లరు కాబట్టి, వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియా తో మాట్లాడుతూ, కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీబీఐని రాజకీ యంగా వాడుకోవడం ఇక నైనా ఆపాలని అన్నారు. కాగా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ-కేజ్రీ మధ్యే పోరాటం జరుగుతుందన్న భయం బీజేపీలో ఉందని, అందుకే ఈ సీబీఐ దాడులు జరుగుతు న్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీ వల చేసిన వ్యాఖ్యల పై బీజేపీ స్పందించింది.
ఎక్సైజ్ విధానం కుంభకోణానికి సంబంధించి మూలాలన్నీ కేజ్రీవాల్ వేపే వెళుతున్నాయని ఆయనతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారని ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హెచ్చరించారు. అంతేగాక, ఈ కేసుతో సంబంధం ఉన్న డజను మంది స్టాండప్ కమెడి యన్లు, సోషల్ ఇన్ఫ్లూ యెన్సర్లు, యూట్యూబర్లను సీబీఐ దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం.
అలాగే, హైదరాబాద్కు చెందిన హోల్సేల్, రిటైల్ మద్యం వ్యాపారుల ప్రమేయం, ఒకే ముంబై చిరునా మా ను కలిగి ఉండి.. అల్లిబిల్లిగా అల్లుకున్న కార్పొరేట్ సంస్థల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించి సీబీ ఐ వారిపై దృష్టి సారించింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు (ఈ డీ) సీబీఐ అప్పగించినట్టు సమాచా రం. ఈడీ ఈ ఫైళ్లను పరిశీలించి.. మనీలాండరింగ్ జరిగిన సూచ నలు కనిపిస్తే కేసు నమోదు చేస్తుందని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/am-in-delhiwhy-lookout-says-sisodia-39-142409.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.