అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

Publish Date:Jun 19, 2026

Advertisement

 

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ సోమవారం విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.

ఈ కేసులో అల్లు అర్జున్‌ను A-11 నిందితుడిగా చేర్చిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. A1 నుంచి A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరైన అనంతరం కేసు ట్రయల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

గత ఏడాది డిసెంబర్ 4న 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కూడా శ్రీతేజ్ పూర్తిగా కోలుకోలేదని సమాచారం.

ఈ ఘటనపై నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. నిందితుల వ్యక్తిగత హాజరు అనంతరం అభియోగాల నమోదు ప్రక్రియ పూర్తి చేసి కేసు ట్రయల్‌ను ప్రారంభించే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

పుష్ప-2 వివాదం: ఊహాజనిత వార్తలు, డిబేట్లపై కోర్టు మధ్యంతర ఆదేశాలు

సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ నగర సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో వాస్తవ నిర్ధారణకు ముందే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఊహాజనిత వార్తలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించరాదని కోర్టు స్పష్టం చేసింది.

సంధ్య థియేటర్‌కు సంబంధించిన O.S. No.216 of 2026లో I.A. No.369 of 2026 పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి జూన్ 4, 2026న Ad-Interim Ex Parte Injunction ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ఆదేశాల ప్రకారం కేసుకు సంబంధించిన అంశాలపై తుది విచారణ పూర్తయ్యే వరకు నిర్ధారణ కాని ఆరోపణలు, ఊహాగానాలు లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించింది. ఈ ఉత్తర్వులు కేసులో తుది తీర్పు వెలువడే వరకు అమల్లో ఉంటాయని, కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని న్యాయస్థానం పేర్కొంది.

By
en-us Political News

  
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.