Publish Date:Oct 29, 2024
నందమూరి బాల కృష్ణ తాను హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ద్వారా అల్లు అర్జున్ నంద్యాల పర్యటన రేపిన రచ్చకు ఫుల్ స్టాప్ పేట్టేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షో ద్వారా బాలకృష్ణ ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ గత సీజన్లకు మించి అన్నట్లుగా సాగుతోంది. ప్రతి శుక్రవారం ఆహా లో ప్రసారమౌతున్న ఈ అన్ స్టాపబుల్ షో సీజన్ ఫోర్ తొలి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షో అంచనాలకు మించి విజయవంతమైంది.
ఇప్పుడు నాలుగో సీజన్ తరువాతి ఎపిసోడ్లకు గెస్ట్ లుగా ఎవరు వస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ షోలో పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ పాల్గొననున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అంతకు ముంది అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షోలో అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. ఇటీవలే అన్ స్టాపబుల్ ఫోలో అల్లు అర్జున్ తో ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా జరిగింది.
దీంతో ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ కచ్చితంగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై ముప్పిరిగొన్న వివాదంపై ప్రశ్నలు సంధించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్రకిషోర్ కు ఓటు వేయాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఒక వైపు పవన్ కల్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా కూటమి తరఫున బరిలో ఉన్నారు. అటువంటి సమయంలో వైసీపీ అభ్యర్థిగా మద్దతుగా అల్లు అర్జున్ మాట్లాడటంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య రిలేషన్స్ బాగా లేవా అన్న ప్రచారం కూడా జరిగింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. బాలయ్య తన అన్ స్టాపబుల్ షో ద్వారా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటు అల్లు అర్జున్ కూడా తాను నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, తన ఉద్దేశమేంటో అల్లు అర్జున్ క్లారిటీ చెప్పే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ ప్రసారం తరువాత అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అటు బన్నీ అభిమానులు, ఇటు మెగా అభిమానులూ కూడా భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-as-guest-in-balayya-unstopable-show-39-187620.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.