రాష్ట్ర విభజనపై మళ్ళీ అఖిలపక్షం త్వరలో

Publish Date:Oct 30, 2013

Advertisement

 

అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిలో చచ్చిందన్నట్లు, “రాష్ట్ర విభజనలో చాలా లోతుగా అధ్యయనం చేసి, అందరినీ సంప్రదించి, అందరి ఆమోదంతో, అందరికీ ఆమోద యోగ్యంగా, చాలా రాజ్యంగబద్దంగా, ఎంతో నీతి నిజాయితీలతో, పూర్తి పారదర్శకతతో రాష్ట్ర విభజన చేస్తున్నామే తప్ప, ఇందులో మా రాజకీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం చూసుకోలేదని” ఇంతకాలం గొప్పగా కబుర్లు చెపుతూ వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్ర విభజనపై మళ్ళీ అఖిలపక్షం అంటూ కొత్త రాగం అందుకొంది. వచ్చేనెల 7న మంత్రుల బృందం సమావేశం జరిగిన తరువాత, 9న ఈ సమావేశం ఉంటుందని హోం మంత్రి షిండే ప్రకటించారు.

 

సీమాంద్రాలో అన్ని లక్షలమంది ప్రజలు, ఉద్యోగులు రోడ్లమీధకు వచ్చి రెండు నెలల పాటు ఏకధాటిగా తమ నిరసనలను తెలియజేసినా వారి ఆందోళనలని పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు వీసమెత్తు విలువీయకుండా మొండిగా ముందుకు సాగిన కాంగ్రెస్ అధిష్టానం, మళ్ళీ అఖిలపక్ష రాగం ఆలపించడం ఎలా ఉందంటే, శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళేటప్పుడు మధ్యలో ‘నారాయణ నారాయణ గోవింద గోవింద’ అంటూ మూడు సార్లు క్రిందకు దించి లేపుతారు, పోయిన మనిషి తిరిగొస్తాడనే చిన్న ఆశతో కావచ్చు లేదా వేరే కారణం వల్ల కావచ్చును, ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాష్ట్ర విభజన విషయంలో అలాగే చేస్తోంది.

 

ఒకవైపు కేంద్రంలో రాష్ట్ర విభజనతో సంబంధం ఉన్నఅన్నిమంత్రిత్వ శాఖలు పంపకాల ప్రక్రియ పూర్తి చేస్తుంటే, మరో వైపు హోంశాఖ నియమించిన టాస్క్ ఫోర్సు రెండు రాష్ట్రాలలో శాంతి భద్రతల కోసం చకచకా ఏర్పాట్లు చేస్తుంటే, వచ్చే నెల 5ని డెడ్ లైన్ గా పెట్టుకొని అన్ని పనులు పూర్తి చేస్తూ, 7న మంత్రుల బృందం సమావేశం కూడా పూర్తయిన తరువాత, అప్పుడు తీరికగా అఖిలపక్షం అనడం కేవలం వెటకారమే. ఏనుగు నమిలి తినే తన దంతాలను దాచిపెట్టి, పైకి అందమయిన పెద్ద దంతాలు చూపుతునట్లే, కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్ర విభజన విషయంలో వ్యవహరిస్తోంది.

 

అఖిలపక్షం ఐడియాతో రాష్ట్ర విభజనను జాప్యం చేయాలనుకొంటోందని తెలంగాణా వాదులు భావిస్తే, తమను మరో మారు మభ్యపెట్టేందుకే ఈ కొత్త నాటకమని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ రెండు ప్రాంతాలలో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయే అవకాశం ఉంది. అసలు మొదటి నుండి తన రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే చూసుకొంటూ మొండిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అదే మొండి తనంతో ముందుకు సాగి ఉంటే, కనీసం తెలంగాణాలో అయినా ఆ పార్టీకి నాలుగు ఓట్లు రాలేవేమో!

 

కానీ ఇప్పుడు అఖిలపక్షం అనడం వలన మేమే తెలంగాణా సాధించామని భుజాలు చరుచుకొంటూ జైత్రయాత్రలు చేస్తున్న టీ-కాంగ్రెస్ నేతలు కూడా మళ్ళీ మారోమారు ఆ సాహసం చేయలేరు. అసలు ముందు చేయవలసిన పనిని ఆఖరున, ఆఖరున చేయవలసిన పనిని ముందు చేస్తూ, కాంగ్రెస్ అభాసుపాలవుతోంది. దీనినే వ్రతం చెడ్డా ఫలం దక్కక పోవడం అంటారేమో.

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.