అధికారంలోకి వ‌స్తే సీపీఎస్ రద్దు.. జగన్ బాటలో అఖిలేష్ హామీ..

Publish Date:Jan 21, 2022

Advertisement

ఎన్నికలు అన్నతర్వాత హామీలు ఇవ్వవలసిందే. అమలు చేయడం చేయక పోవడం తర్వాతి విషయం. అయితే ఓ వంక ఏపీలో అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిన సీపీఎస్ రద్దు, హామీని ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో వినిపించడం కొంచెం ఆసక్తిగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తమ ప్రతి అధికారంలోకి వస్తే, సీపీఎస్ రద్దు చేస్తామని హమీనిచ్చారు. ఆ హామీకి స్పందించిన  ఉద్యోగులు గంప గుత్తగా వైసీపీకి ఓటేశారు. వైసీపీ గెలిచింది. హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నర సంవత్సరాలు అయింది. అయినా, సీపీఎస్ రద్దు హామీ మాత్రం నెరవేరలేదు. అంతేకాదు, అది అయ్యేది కాదని, ముఖ్యమంత్రి చేతులు ఎత్తేశారు. ఇప్పడు ఏపీలో రోడ్డెక్కిన ఉద్యోగులు  సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి అది అమలు చేయక పోగా పీఆర్సీ, హెచ్ఆర్ఎకు ఎసరు తెచ్చారని ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. 

అదలా ఉంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అన్ని పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. అందులో భాగంగా అచ్చంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ ఉద్యగులకు హామీ ఇచ్చిన విధంగానే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరిస్తానని మాజీ సీఎం, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ హామీ ఇస్తున్నారు.

2004లో అప్పటి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సీపీఎస్‌ విధానాన్ని తీసుకురాగా.. 2005లో ఉత్తర్‌ ప్రదేశ్ దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. పాత పెన్షన్ విధానం అమల్లోకి తీసుకొస్తే 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అఖిలేశ్ అన్నారు. అలాగే, ప్రయివేట్ పాఠశాలలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయులకు ఆర్ధిక సాయం కూడా అందజేస్తామని, మూడు, నాలుగో తరగతి ఉద్యోగులకు సొంత జిల్లాల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చేలా మార్పులు చేస్తామని అఖిలేశ్ ప్రకటించారు.పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తమ పార్టీ మేనిఫేస్టోలో మరో ముఖ్యమైన హామీ అని అఖిలేశ్ వివరించారు. అయితే, యూపీ ఉద్యోగులు ఏపీ ఉద్యోగులతో పోటీ పడి బకరాలు అవుతారో లేక, స్మార్ట్’గా ఓటు చేస్తారో ..చూడవలసి వుంది.

By
en-us Political News

  
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.