మహా రాజకీయ దురంధరుడు.. అజిత్ దాదా..

Publish Date:Jan 28, 2026

Advertisement

మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ దాదాగా సుపరిచితులైన అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరంగా, వ్యూహాత్మకంగా సాగింది. తన బాబాయి, మరాఠా దిగ్గజం శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, ప్రస్తుతం సొంత కుంపటి పెట్టుకుని మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానంలోని ప్రధాన మైలురాళ్లు ఏంటో చూస్తే.. 

1982లో ఒక సహకార చక్కెర కర్మాగారం బోర్డు సభ్యునిగా తన మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం 1991లో పుణే జిల్లా సహకార బ్యాంకు  చైర్మన్‌గా ఎన్నిక అవ్వడం, అదే ఏడాది బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందడం ద్వారా క్రీయాశీలం అయ్యింది.  శరద్ పవార్ కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అక్కడ నుంచి  రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పట్టు పెరిగింది.  1991 నుంచి బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. 

మంత్రిగా ఆయన వ్యవసాయం, విద్యుత్, నీటి వనరులు వంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేశారు.  మహారాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు ఆయన సొంతం. పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే, ఏకనాథ్ షిండే వంటి భిన్నమైన నేతల క్యాబినెట్‌లలో ఈ బాధ్యతలు నిర్వహించడం ఆయన రాజకీయ సమర్ధతకు నిదర్శనం.

2019 ఎన్నికల తర్వాత రాత్రికి రాత్రే బీజేపీకి మద్దతు ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజిత్. అయితే ఆ ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే నిలవడం గమనార్హం.

2023 జూలైలో తన బాబాయి శరద్ పవార్‌కు షాక్ ఇస్తూ, మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు అజిత్ పవార్. కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)గా గుర్తించి, గడియారం  గుర్తును  కేటాయించింది.

ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2024 నుండి ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నారు. టీవలి  మునిసిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, పవార్ కుటుంబంలోని రెండు వర్గాలు అజిత్, శరద్ పవార్..  తిరిగి కలిసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో  నడుస్తోంది. అజిత్ పవార్   దూకుడు స్వభావానికి, పరిపాలనా దక్షతకు పెట్టింది పేరు. ముఖ్యంగా పుణే, బారామతి ప్రాంతాల్లో సహకార సంఘాలపై ఆయనకు తిరుగులేని పట్టు ఉంది.

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొంటున్నారు. 

By
en-us Political News

  
పోలీసులు అంబటి రాంబాబును ఆయన నివాసంలో శనివారం (జనవరి 31) అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోనికి తీసుకుని పోలీసు వాహనంలో నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు. ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు. అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా?
వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు. కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నంబర్ 11 తో నెటిజనులు మరో సారి వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. 11 నుంచి ప్రారంభయమ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆ 11 మందీ హాజరౌతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతు పురాణం విప్పారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
దేశ ఆర్థిక రంగాన్ని ఇన్నేళ్లపాటు సమర్థవంతంగా నడిపించడం, స్థిరమైన, నిలకడైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించడం ఆమె పరిణితికి నిదర్శనంగా ప్రధాని అభివర్ణించారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.
అజిత్ పవార్ మృతితో విలీనానికి బ్రేక్ పడిందన్నారు. ఇక పోతే అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శనివారం (జనవరి 31) ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న సంగతి తనకు తెలియదన్న శరద్ పవార్, అసలు ఎన్సీపీ (అజిత్ పవార్)లో ఏం జరుగుతోందన్న విషయం తనకు తెలియదన్నారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్ ఆరు నెలలలోగా రాజీనామా చేసి బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆమె స్థానంలో అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యసభ సభ్యురాలైన సుచిత్రా పవార్ నియమకాన్ని ఖరారు చేసేందుకు ఎన్సీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. శనివారం మధ్యాహ్నం ముంబైలోని విధాన్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో సునేత్రాపవార్ ను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
దేశంలోనే అతి పెద్ద అవినీతి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించగా, ప్రజల ధనం, ఆరోగ్యంతో ఆటలాడిన ఈ కుంభకోణంలో నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవ్వడం కంటే దారుణం మరొకటి ఉండదని, అధిక ధరలకు చౌకబారు మద్యం అమ్మారనీ కంఠంనేని రవిశంకర్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.