Publish Date:Jul 26, 2021
ఆల్ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్-AIMIM. పాతబస్తీకే పరిమితమైన పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉనికి చాటుకుంటోంది. బీజేపీని గెలిపించడానికే అన్నట్టు.. ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. తాను ఒకటో రెండే సీట్లు గెలుస్తూ.. బీజేపీకి మాత్రం గంపగుత్తగా ఆధిక్యం కట్టబెడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం నడుస్తోందనే అనుమానం. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్తో ఎమ్ఐఎమ్కి జిగ్రీ దోస్తానా ఉంది. బాయీ బాయీ అంటూ కేసీఆర్ ఓవైసీలు ఒక్కతాటిపైన నడుస్తుంటారు. కారు స్టీరింగు తమ చేతుల్లోనే ఉందంటూ మజ్లిస్ కవ్వించినా.. కొన్నిచోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసినా.. ఆ రెండూ దొందు దొందేనని అందరికీ తెలుసు.
అధికార పార్టీతో అంటకాగకుండా మజ్లిస్ రాజకీయం చేయదు. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీకి మిత్రపక్షం. కాంగ్రెస్ పవర్లో ఉంటే కాంగ్రెస్కు స్నేహ హస్తం. టీఆర్ఎస్ గెలిస్తే.. కారులో షికారు. పాతబస్తీలో తమ సామాజ్యం పదిలంగా ఉంచుకోడానికి.. అటువైపు ప్రభుత్వం, అధికారులు కన్నెత్తి కూడా చూడకుండా చేసుకోవడానికి దశాబ్దాలుగా ఎమ్ఐఎస్ అనుసరిస్తున్న వ్యూహం ఇది. ఇదే పాయింట్ మీద టీఆర్ఎస్తో మజ్లిస్ స్నేహం చేస్తోందని అంతా అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్ మీద.. అదే మజ్లిస్ పార్టీ.. టీఆర్ఎస్కు హ్యాండ్ ఇవ్వబోతోందని చెబుతున్నారు. అందుకు కారణం.. రేవంత్రెడ్డి.
అవును, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డే వారిద్దరి దోస్తానాకు పరోక్షంగా కారణం అవుతున్నారు. గాలి వీచే వైపునకే పతంగి ఎగురుతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ హవా మొదలైంది. రేవంత్రెడ్డి క్రేజ్ యమ జోరుగా సాగుతోంది. గట్టిగా ట్రై చేస్తే.. ఈసారి కాంగ్రెస్దే అధికారమనే ప్రచారం నడుస్తోంది. ఇదే ఓవైసీని పునరాలోచనలో పడేసిందని అంటున్నారు. ఎలాగూ కాంగ్రెస్తో పాత స్నేహం ఉండనే ఉంది. పాత దోస్తుతో కొత్తగా దోస్తీ చేయడానికి ఓవైసీ ఆసక్తిగా ఉన్నారట. ఆ మేరకు ఇప్పటికే రేవంత్రెడ్డికి మెసేజ్ పంపించడం.. అటునుంచి సైతం ఓకే అంటూ రిప్లై రావడం జరిగిపోయిందట. ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చాక.. ఇక మజ్లిస్ పార్టీ కేసీఆర్ను మెలిపెట్టే పని మొదలుపెట్టిందని అంటున్నారు.
ఎన్నాళ్లైనా మీరు మాత్రమే పవర్లో ఉంటారా? మాకు ఏ మాత్రం షేర్ చేయరా? అనేది ఓవైసీ లేటెస్ట్ డిమాండ్. ఇన్నాళ్లూ మీకు సపోర్ట్ చేసింది చాలు.. ఇక మాకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వండంటూ అడుగుతోందట మజ్లిస్ పార్టీ. ఏదో చిన్నా చితకా పదవి ఇస్తే ఊరుకోబోమని.. తమ వాడిని డిప్యూటీ సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతోందని తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి ప్రపోజల్నే యూపీలో సమాజ్వాదీ పార్టీ ముందు ఉంచిందని ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇకపై ఎమ్ఐఎమ్ ఇలాంటి స్ట్రాటజీనే అప్లై చేయబోతోందని.. ముందుగా తెలంగాణ నుంచే ప్రారంభమని అంటున్నారు. రేపోమాపో కేటీఆర్ను సీఎం చేసేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు. ఆ అధికార బదిలీ సవ్యంగా సాగాలంటే.. తమకు డిప్యూటీ సీఎం పోస్ట్ తప్పకుండా ఇవ్వాల్సిందేనంటూ కొర్రీ పెడుతున్నారట ఓవైసీ.
మజ్లిస్ అంత దూకుడుగా ఉండటానికి కారణం రేవంత్రెడ్డే అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ కొత్త రెక్కలు తొడగడం.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేలా అడుగులు వేస్తుండటంతో.. అవసరమైతే రేవంత్రెడ్డికి జై కొట్టేందుకు ఓవైసీ రెడీ అవుతున్నారట. ఈలోగా కేసీఆర్తో కుదిరిన కాడికి బేరసారాలు ఆడైనా.. బ్లాక్మెయిల్ చేసైనా.. డిప్యూటీ సీఎం పదవి పట్టేయాలనేది మజ్లిస్ ఎత్తుగడ. కేసీఆర్ హర్ట్ అయి తమను కాదు పొమ్మంటే.. కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవ్వొచ్చని.. లేదంటే, ఎన్నికల నాటికి హస్తం పార్టీ హవా పెరిగితే.. తమంతట తామే రేవంత్కు షేక్ హ్యాండ్ ఇవ్వొచ్చనేది.. ఎమ్ఐఎమ్ మైండ్గేమ్గా తెలుస్తోంది. మరి, ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి...
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aimim-steps-towards-revanth-reddy-25-120362.html
రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న
ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ తన దైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూటమికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ సర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు.
రాజకీయంగా సీనియర్ కూడా అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ ఆయన నేర్పుగా ముందుకు సాగుతారనే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.