అజీర్ణం...అగ్నిమాంద్యం.. 

Publish Date:Mar 19, 2019

Advertisement


   
పిల్లలకి అన్నం పెట్టినప్పుడల్లా....పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ భోజనం పెడతారు. తిన్నది జీర్ణం అయితేనే మనం ఆరోగ్యవంతంగాను ఆనందకరంగాను ఉంటాము. మనము మితముగా భుజిస్తే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. భుజించినది వెంటనే జీర్ణమైపోయి మళ్ళీ ఆకలివేసి దప్పిక,తాపము, భ్రమవంటి లక్షణాలు కలిగితే దానిని భస్మకాగ్ని అంటారు. ఈర్ష్య,భయము, క్రోధము, శోకము,లోభము, దీనత్వము, ద్వేషము వంటివుండగా వాటిని భుజించినా అన్నం సరిగా జీర్ణం కాదని ఆయుర్వేద శాస్త్రం ఎప్పుడో చెప్పింది. మానసిక కారణాల వల్ల మితంగా భుజించిన పధ్యకరమైన ఆహారం కూడా జీర్ణము కాదు. 

బడలిక, శరీరము బరువు గా ఉండుట, శరీరము స్తంభించుట, తల తిరుగుట, అపానవాతము వెడలకుండుట, మలము బంధించుట లేదా అధికముగా వెడలుట అనే లక్షణాలు అజీర్ణ వ్యాధిలో కలుగుతాయి..నోట నీరూరుట, పులి త్రేన్పులు వచ్చుట, చెమట పట్టుట, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం,  ఒళ్ళు నొప్పులు కలుగుతాయి. త్రేన్పులు, పులిత్రేన్పులు, కడుపునొప్పి,విరేచనాలు లాంటివన్నీ వస్తాయి. 

 

ఇలా వచ్చిన వారు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు:  

విలంబిక, అలసకము, దండాలసకము వ్యాధులయందు, ఆముదపాకు కాడలు మొదలైన నాళములతో గానీ ఫలవర్తులతో గానీ రేచనమును, వమనౌషధములతో వమనమును కూడా చేయించుట హితకరము. ఫలవర్తి, వమనము, స్వేదనము, ఉపవాసము,లఘు ఆహార సేవనము ఇవి ముఖ్యముగా అలసక వ్యాధియందు హితమైనవి. అగ్నిమాంద్యమునందు, అజీర్ణమునందు విరుద్ధాహార సేవనము అలవాటు లేని అన్నప్రాసనములు, గురుత్వమును, మలబంధమును చేయు పదార్ధములను వదిలేయాలి.


మందుజాగ్రత్తలు:

పగలు భోజనం చేసేముందు నిద్రపోతే సర్వాజీర్ణాలు నశిస్తాయి. కరక్కాయ వలుపును ముదములో వేయించిన ఆముదమును త్రాగవలను. దీనిలో నొప్పి మలబంధముతో కూడిన సమస్త వ్యాధులు శమిస్తాయి. ఒక చెంచాడు హింగ్వష్టక చూర్ణమును భోజన సమయములో మొదటతినే ముద్దలో నేతితో కలిపి సేవిస్తే అజీర్ణ వ్యాధి రాదు. భాస్కరలవణము కూడా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది.

అజీర్ణం వలన విరేచనాలు అవుతుంటే కనక సంజీవనీవటి లేదా శంఖవటిలను వాడుకోవాలి. లవంగాలు, కరడవలుపు వీని కషాయమందు సైంధవ లవణము కలిపి సేవిస్తే అజీర్ణము నశించి 
విరేచనమగును. 

అజీర్ణంలో విరేచనాలు, వాంతులు ఎక్కువగా అవటంవల్ల దప్పిక కనక వస్తే లవంగ కషాయం గానీ, జాజికాయ కషాయం గానీ తుంగముస్తల కషాయం గానీ కాచి చల్లార్చి తాగిస్తే వెంటనే రోగవిముక్తి లభిస్తుంది. ఏ రోగం ఎందుకొస్తుంది....దానికి తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు మందుజాగ్రత్తలు తెలుసుకున్నారు కద... మీకు తెలిసిన వారందరినీ కూడా తెలుసుకోమనండి.

By
en-us Political News

  
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.