ప్రతీవారి జీవితంలో బాల్యం జీవితాంతం గుర్తుచేసుకునే అనుభూతుల భాండాగారం. వయసు పెరిగేకొద్దీ చిన్నవారిని చూసిన పుడల్లా అపుడు తాను చేసిన అల్లరో, ఆటనో, ఇంట్లో గోల.. ఏదో ఒకటి మెదడులో మెరిసి కాస్తంత చిర్నవ్వును ప్రసాదిస్తాయి. అప్పటికి మనసు భారం తగ్గించే మహా టాబ్లెట్ అవుతుంది. బడిలో నాలుగయిదు తరగతులు చదివే రోజుల్లో అమ్మమ్మదగ్గరో, తాతగారి దగ్గరో ఏదో ఒక కథో, మరేదో వింత కబురో, పాటో వింటూ గడిపేయడంలో ఆనందం తిరిగి రాదు. కాలం కదిలి పోతూం టుంది. జ్ఞాపకాల లయ జీవితంలో రవ్వంత సంతోషపు మెరుపునిస్తుంది. అది ఏ క్షణమైనా కావచ్చు.
ఉద్యోగవిరమణ తర్వాత చాలమంది మనవడితోనో, మనవరాలితోనో సరదా మాటలతో, వారిని ఆడిస్తూ గడపడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. చాలామంది పిల్లలకీ అదే కావాలి. ఎందుకంటే వారికి ఏనుగమ్మ ఏనుగు ఆటలో ఏనుగు కావాలి గదా?! ఇందులో గొప్ప సైన్స్ ఉందంటారు మానసికశాస్త్రవేత్తలు. అటు పెద్దవారికి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం పదిల పడటంతో పాటు పిల్లలకు వారికి మధ్య అంతరం తగ్గి అనేక మాటలు, సరదాల పరదాల వెనక అనుబంధం పటిష్టపడు తుందిట. నిజమే. పిల్లలు పెద్దయ్యేకొద్దీ ఇంట్లో తల్లిదండ్రులతో మాటలు కరవవుతున్నాయి.. మరీ ఈరోజుల్లో. దీనికి వారినీ తప్పుపట్టలేం. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆ విధంగా పరుగులు పెట్టిస్తున్నాయి. జీవనంలో వేగం పెరిగింది. కలిసి తినడం, కలిసి ఒకే సమయం లో కలిసి మాట్లాడుకోవడం, పోనీ టీవీ చూడటం .. అన్నీ క్రమేపీ దూరమవుతున్నాయి. పిల్లలు వారి ఉద్యోగాల హడావుడిలో రాత్రింబవళ్లూ శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు.
ఇక పసిపిల్లల్ని చూసుకునే బాద్యత మళ్లీ తల్లిదండ్రులకే పడుతోంది. ఇది తప్పని పరిస్థితి. కానీ వీరికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కారణం వీళ్లూ మళ్లీ పిల్లలు కావడానికి ఇష్టపడు తున్నారు. అదే జీవితంలో అందం, ఆనందం. శరీరానికే వయసు లెక్క.. పిల్లల్ని చేరదీయడంలో మనసుకీ వయసుకీ అంతరం తగ్గుతుంది. పెద్దవాళ్లు ఏనుగులవుతున్నారు.. పిల్లలు రాకుమారులవుతున్నారు.. హాలు, షికారు రాస్తా అవుతోంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aging-is-not-for-love-39-141248.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.