Publish Date:Oct 19, 2024
ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెలుగులోకి రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కల్తీ నెయ్యి వినియోగం విషయంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వతంత్ర సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఆ విషయం అలా ఉండగానే.. శబరిమల ప్రసాదంలోనూ కల్తీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఇప్పుడు తాజాగా అన్నవరం సత్యన్నారాయణ స్వామి ప్రసాదంలోనూ కల్తీ జరుగుతోందని వెల్లడైంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో కొలువై ఉన్న సత్యనారాయణ మూర్తి దేవాలయంలో భక్తులకు అందజేసే ప్రసాదంలో కల్తీ జరుగుతోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్న భక్తుల పరమ పవిత్రంగా భావిస్తారు. అన్నవరం ప్రసాదం రుచి విషయంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. భక్తులు సత్యదేవుని దర్శించుకున్న తరువాత ఎంతో భక్తితో ప్రసాదాన్ని ఆరగిస్తారు. అంతే కాకుండా తిరుమల దేవుని ప్రసాదంలాగే అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్ని కూడా తమ తమ ఊర్లకు తీసుకువెళ్లి అందరికీ పంచుతారు. అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, బెల్లం, యాలకుల పొడితో తయారుచేస్తారు. ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు ఆ ప్రసాదం తయారీలో కల్తీ బెల్లం విడుతున్నట్లుగా వెలుగులోనికి వచ్చింది. సుక్రోజ్ శాతం అధికంగా ఉన్న బెల్లంతోనే సత్యదేవుని ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు కల్తీ నిరోధక శాఖ నిర్ధారించింది. బెల్లం, నెయ్యి నాణ్యతను పరిశీలించకుండానే ఆలయ అధికారులు ప్రసాదం తయారీకి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదం తయారీకి వినియోగించే బెల్లాన్ని ఒక ప్రైవేటు సంస్థ అతి తక్కువ ధరకే సరఫరా చేస్తోందని అంటున్నారు. ప్రసాదం తయారీకి వినియోగించే బెల్లంలో కల్తీ ఉందని అధికారులు పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/adultretion-in-annavaram-prasadam-39-187057.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది