Publish Date:Nov 21, 2024
అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక రాజకీయ అండదం డలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమౌతూనే ఉంది. ఇప్పుడే కాదు గతంలోనూ అదానీ అవినీతి వ్యవహారాలపై పలు ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ అనే పరిశోధనా సంస్థ గతంలో పలు మార్లు అదానీ వ్యాపార సామ్రాజ్యం అతి వేగంగా విస్తరించడం వెనుక మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికలు వెలువరించింది. తన నివేదికలకు ఆధారంగా స్విట్జర్ ల్యాండ్ విచారణ నిగ్గు తేల్చిన అంశాలను ప్రస్తావించింది. స్విట్జర్ ల్యాండ్ ఆ దేశంలో అదానీ గ్రూపునకు చెందిన పలు బ్యాంక్ అక్కౌంట్లను సీజ్ చేసిందని పేర్కొంది. అలా స్విట్జర్ ల్యాండ్ లో సీజ్ అయిన అదానీ అక్కౌంట్లలో 2600 కోట్ల రూపాయలు ఉన్నాయని హిడెన్ బర్గ్ గతంలో పేర్కొంది. అందుకు ఆధారంగా అక్కడి అంటే స్విట్జన్ ల్యాండ్ క్రిమినల్ కోర్డు రికార్డుల నుంచి సేకరించిన సమాచారాన్ని పేర్కొంది. అంతే కాకుండా వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో కూడా అదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయనీ, అవన్నీ కూడా మనీల్యాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీల ద్వారా జమ చేసినవేనని ఆరోపించింది.
అయితే సహజంగానే అదానీ గ్రూపు ఆ ఆరోపణలను ఖండించింది. అయితే అప్పట్లో హిడెన్ బర్గ్ నివేదిక వెలువడిన తరువాత మార్కెట్ లో అదానీ షేర్ల విలువ భారీగా పతనమైంది. అప్పట్లోనే.. అంటే హిడెన్ బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు వరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అదాని, ఆ నివేదిక వెలువడిన స్వల్ప వ్యవధిలోనే 26వ స్థానానికి పడిపోయారు. అలాగే అదానీ గ్రూప్ షేర్ల విలువ కూడా భారీగా పతనమైంది. నివేదిక వెలువడిన నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద 11లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అప్పట్లో అదానీపై హిడెన్ బర్గ్ అక్కౌంటింగ్ ఫ్రాడ్, షేర్ల విలువ కృత్రిమంగా పెంచడం, మనీ ల్యాండరింగ్, అవినీతి వంటి ఆరోపణలు చేసింది.
ఇప్పుడు అమెరికాలో అదానీపై నమోదైన కేసులో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. లాభాల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి ముడుపులు చెల్లించారనీ, చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న అభియోగాలపై అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. సహజంగానే ఇప్పుడు కూడా అదానీ గ్రూప్ ఆ ఆరోపణలను ఖండించింది. అభియోగాలు, ఖండనల సంగతి ఎలా ఉన్నా.. ఒకే వ్యాపారిపై తరచుగా అవినీతి ఆరోపణలు రావడాన్ని బట్టి అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరణ వెనుక మతలబు ఉందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదు. ఎంత మంది, ఎన్ని శక్తులు అండగా, దండగా నిలబడినా నిజం నికలకడ మీద తేలక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/adani-business-expanssion-full-of-corruption-39-188773.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.