రియల్ స్టార్ శ్రీహరి మరణం...కేవలం ఇండస్ట్రీ వర్గాలకే కాక అనేక మంది జనాలను శోక సంద్రంలోకి ముంచిన విషయం అది. ఆయన లాంటి మంచి మనసున్న వ్యక్తి దూరం అవడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అంతటి నిండైన రూపమున్న మనిషి ప్రాణం లేకుండా పడి ఉన్నాడంటే ఎవరూ నమ్మలేదు. అయితే అసలు శ్రీహరి ఎలా చనిపోయాడు ? అప్పటి వరకు బానే ఉన్న ఆయన ముంబైకి వెళ్లి ఎలా చనిపోయాడనే ప్రశ్నలు దాదాపు అందరినీ వెంటాడుతూ ఉంటాయి.
అయితే ఈ విషయం మీద రాజ్ దూత్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆయన భార్య డిస్కో శాంతి స్పందించారు. ఆయన చనిపోయిన రోజు రాజ్ కుమార్ సినిమా షూట్ కోసం ముంబై వెళ్లి హోటల్ లో దిగామని కాస్త ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో డాక్టర్కు ఫోన్ చేసి చెప్పామని ఆమె చెప్పింది. అయితే వచ్చిన డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడని తాను ఫ్యామిలీ డాక్టర్ను అడిగి ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పేలోపే ఇంజెక్షన్ ఇచ్చేశారని ఆమె చెప్పుకొచ్చింది.
తాను నైటీలో ఉండటంతో లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చేలోపే శ్రీహరిని లీలావతి హాస్పిటల్ తీసుకెళ్లారని, వెంటనే తాను కూడా ఆస్పత్రికి వెళ్లానని అయితే తను వెళ్ళే లోపలే ఆయన్ని ఐసీయూలో పెట్టారని, తనను కనీసం లోపలికి కూడా వెళ్లనివ్వలేదని చెబుతూ ఆమె భావోద్వేగానికి గుర్యయింది. అయితే తాను దొంగతనంగా లోపలికి వెళ్లానని అయితే అప్పటికే శ్రేహరి రక్తంలో తడిసిపోయి ఉన్నాడని అది చూసి తాను గట్టిగా ఏడ్చేసానని దాంతో డాక్టర్లు తనను బలవంతంగా బయటికి పంపేశారని చెప్పుకొచ్చిందీమె.
ఇక ఆరోజు రాత్రి 9.30 ప్రాంతంలో మరోసారి లోపలికి వెళ్లి చూసేసరికి డాక్టర్లు ఏదో తప్పు చేసారని అర్థమయిందని, తప్పు జరిగిందని బతిమాలుకుంటున్నట్లు అర్ధంయ్యిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే శ్రీ హరికి లివర్ సమస్య ఉందని అది తెలియక వీరు పైప్ నేరుగా పెట్టడంతో అది వెళ్లి లివర్ కి గుచ్చుకుని రక్తస్రావం అయ్యిందని ఆరోజున డాక్టర్లు చేసిన తప్పుకు శ్రీ హరి తనకే కాక ప్రపంచానికి కూడా దూరం అయ్యాడని ఆమె మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే డాక్టర్ లు చేసిన పొరపాటుకి ఆయన తనువు చాలించాడన్న మాట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/actual-reason-behind-srihari-death--39-87847.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.