ఏసీపీ జె. నర్సయ్యకు రాష్ట్రపతి పోలీసు పతకం

Publish Date:Aug 14, 2026

Advertisement

 

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు...
1991 జూలై 16న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరిన జె. నర్సయ్యకు 2026 ఆగస్టు 15 నాటికి 35 సంవత్సరాల ఒక నెల పోలీసు సేవ పూర్తవు తుంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా 2024 ఆగస్టు 8 నుంచి బాధ్య తలు నిర్వహిస్తున్నారు.


తన సుదీర్ఘ పోలీసు ప్రస్థానంలో నర్సయ్య పలు కీలక కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచారు. యాంటీ నక్సల్‌ ఆపరేష న్లలో కీలకంగా వ్యవహ రించి మిలిటెంట్లు, నక్సల్‌ సానుభూతిపరుల అరెస్టు లో ముఖ్యపాత్ర పోషిం చారు. 2010లో హైదరా బాద్‌ పాతబస్తీలో జరిగిన మతపరమైన ఉద్రిక్తతలను సమర్థవంతంగా ఎదు ర్కొని, పలు హత్య కేసు లను ఛేదించి శాంతిభద్రత లను పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు
2012లో డీఆర్‌డీఎల్‌ శాస్త్రవేత్త కుమారుడు 10 ఏళ్ల ప్రణవ్‌ హత్య కేసును ఛేదించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచే స్తున్న సమయంలో పాకిస్థాన్‌లో ముద్రించిన రూ.6.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసు కున్న కేసులో కూడా కీలకంగా వ్యవహరించారు  కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ బృందంతో కలిసి పని చేస్తూ ఒడియన్‌ థియేటర్‌ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు జియావుల్‌ హక్‌ను పట్టుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు అలాగే సంచలనం సృష్టిం చిన మద్దెల చెరువు సూరి హత్య కేసు దర్యాప్తు లోనూ ముఖ్యపాత్ర పోషించి భాను కిరణ్‌ గన్‌మ్యాన్‌ను అరెస్ట్‌ చేయ డంతో పాటు ఆయుధా లను స్వాధీనం చేసుకోవ డంలో సహకరించారు.

నర్సయ్య దర్యాప్తు నైపుణ్యాలతో అనేక కీలక కేసులను ఛేదించడంతో పాటు పలు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడేలా దర్యాప్తు సాగించినట్లు పతకానికి సంబంధించిన సిటేషన్‌లో పేర్కొన్నారు. నర్సయ్యకు గతంలో కూడా పలు పోలీసు సేవా పురస్కా రాలు లభించాయి. 2010లో ఏపీ పోలీస్‌ సేవా పతకం, 2015లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ పోలీసు సేవా పతకం, 2017లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌, 2019లో అతిఉత్కృష్ట మెడల్‌, 2021లో తెలంగాణ రాష్ట్ర మహోన్నత సేవా పతకం అందుకున్నారు.అదేవిధంగా ఆయనకు 16 నగదు రివార్డులు, 261 GSEలు, 32 MSEలు, 20 కమెండే షన్లు, 18 ప్రశంసలు లభించినట్లు అధికారిక రికార్డుల్లో 
పేర్కొన్నారు. 

రాష్ట్రపతి పోలీసు పతకా నికి సంబంధించిన సమ గ్రత ధ్రువీకరణ పత్రంలో నర్సయ్యపై ఎలాంటి న్యాయ, శాఖాపరమైన లేదా విజిలెన్స్‌ కేసులు పెండింగ్‌లో లేవని, ఎలాంటి విచారణలు ప్రతిపాదించబడలేదని పేర్కొన్నారు. 2015-16 నుంచి 2024-25 వరకు సమీక్షా కాలంలో ఆయన కు ఎలాంటి ప్రధాన శిక్ష విధించలేదని కూడా ధ్రువీ కరించారు.అసాధారణమైన సేవ, కర్తవ్యనిబద్ధత, దర్యాప్తు ప్రతిభను గుర్తిస్తూ 2026స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జె. నర్సయ్యకు రాష్ట్రపతి పోలీసు పతకం అందించాలని సిఫార్సు చేశారు.

ACP J. Narsaiah awarded Presidents Police Medal, CM Revanth reddy, Telangana police, Hyderabad police

By
en-us Political News

  
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నినాదించిన మన సభ.. జన సభ ఇప్పుడు మా అసెంబ్లీ ప్రజల అసెంబ్లీ అన్నఆయన ఆశయానికి సజీవ రూపంగా నిలవనుంది.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీలకు తావులేకుండా, దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లతో డిజైన్ చేశారు. కార్డు ముందరి భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్  ఆధారిత హోలోగ్రామ్ వంటి రక్షణ అంశాలను పొందుపరిచారు.
పుష్కరాల సందర్భంగా రాష్ట్ర  సాంస్కృతిక విశిష్టత, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమౌతోంది.  ఇందులో భాగంగా  సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమవేశమై ఏర్పాట్లపై సమీక్ష జరిపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.