తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరి ణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగ రావు నివాసంలో ఎసీబీ అధికారులు బుధవారం (జూన్ 3) సోదాలు నిర్వహించారు. ఆయన నివాసం
తో పాటు పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం (జూన్ 3)ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నహితు లకు చెందిన ఇళ్ళు ల్లో ఏసీబీ బృందాలు ఏకకా లంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భూములు, భవనాలు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబ డులు, వ్యాపార లావాదేవీ లకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తు న్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు మాజీ పోలీసు అధికారులు విచారణను ఎదుర్కొంటుండగా, భుజంగ రావు పాత్రపై కూడా దర్యాప్తు సంస్థలు ప్రత్యేకం గా దృష్టి సారించాయి. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై ఏసీబీ రంగంలోకి దిగడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల అనంతరం స్వాధీనం చేసు కున్న పత్రాలు, డిజిటల్ ఆధారాల పరిశీలన తర్వాత భుజంగరావుపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకా శాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-raids-former-additional-sp-bhujanga-raos-house-36-221602.html
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్స్పెక్టర్ బి. మహేందర్కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.