Publish Date:Apr 27, 2021
ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దుర్గ మరణంతో ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర వేలేరులో కనకదుర్గ జన్మించారు. బిషప్ అజరయ్య స్కూల్లో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదువుకున్న కనకదుర్గ.. విజయవాడలోనే సిటీ పబ్లిక్ స్కూల్ టీచర్గా పనిచేశారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్లోని పలు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లలో ఆమె విధులు నిర్వర్తించారు. బంజారాహిల్స్ బ్రాంచ్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో కనకదుర్గ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 1983 జూలై 3న వేమూరి రాధాకృష్ణ- కనకదుర్గల వివాహం జరిగింది. 2002లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్గా, 2009లో ఏబీఎన్లోనూ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కనకదుర్గకు కుమారుడు ఆదిత్య, కుమార్తె అనూష ఉన్నారు.
వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్గా కనకదుర్గ.. సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారన్నారు. సేవా భావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఉద్యోగులను ఉద్యోగుల్లా కాకుండా సొంత బిడ్డల్లా ఆమె చూసుకునేవారని తెలిపారు. వేమూరి రాధాకృష్ణ సతీమణి, వేమూరి కనకదుర్గ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేమూరి కనకదుర్గ మరణం తనను కలిచివేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. వేమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కనకదుర్గ ఆత్మకు శాంతి చేకూరాలని నరసింహన్ ఆకాక్షించారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ కనకదుర్గ మృతితో దిగ్భ్రాంతికి గురయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్యాంకు అధికారిణిగా పనిచేసి, సంస్థ నిర్వహణ బాధ్యతలలో తనదైన ముద్ర వేశారన్నారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కనకదుర్గ మృతిపై తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. టీడీపీ నేతలు, మాజీ మంత్రులు తమ ప్రగాఢ సానుభుతి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/abn-md-vemuri-radhakrishna-wife-demise-25-114374.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.