టి20లలో తనకు తిరుగే లేదని టీమ్ ఇండియా మరోసారి రుజువు చేసుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ ను 4-1తో కైవశం చేసుకుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమ్ ఇండియా ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా పరుగుల సునామీ సృష్టించింది.
ముఖ్యంగా అభిషేక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సిక్సర్లతో ఓ ఆటాడుకున్నాడు. ఇంగ్లాండ్ పై టి20ల్లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు సృష్టించాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ వర్మ తన బ్యాటింగ్ లో ఐదు ఫోర్టు కొట్టాడు. ఏకంగా 13 సిక్సర్లు బాదేశాడు. బౌండరీ లైన్ ఆవల పడిన బంతిని తీసుకురావడమే ఇంగ్లాండ్ ఫీల్డర్ల పని అన్నట్లుగా అభిషేక్ వర్మ బ్యాటింగ్ జోరు కొనసాగింది. అభిషేక్ వర్మ బ్యాటింగ్ ధాటికి ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ కకావికలమైపోయింది. గల్లీ బౌలర్లను ఎదుర్కొంటున్నామా అన్నట్లుగా అభిషేక్ వర్మ బ్యాటింగ్ విధ్వంసం కొనసాగింది. తొలి ఏడు ఓవర్లలో టీమ్ ఇండియా ఏకంగా 111 పరుగులు చేసిందంటేనే ఏ స్థాయిలో ఇంగ్లాండ్ బౌలర్లు ఊచకోతకు గురయ్యారో అర్ధం అవుతుంది.
ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్ గా మలిచిన శాంసన్ త్వరగానే ఔటైపోయాడు. అయితే అభిషేక్ వర్మ తనకు అసలు అడ్డే లేదన్నట్లుగా చెలరేగి పోయాడు. సిక్సర్ల్ మోత మోగించాడు. ఒక దశలో నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోరు అలవోకగా 300 పరుగులు దాటేస్తుందా అనిపించింది. ఆ స్థాయిలో అభిషేక్ వర్మ బ్యాటింగ్ దాడి ఉంది. అయితే తిలక్ వర్మ , సూర్య కుమార్ యాదవ్ ఫెయిల్ అవ్వడంతో భారత్ పరుగుల వేగం ఒకింత మందగించింది. 10 ఓటర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 143 పరుగుల స్కోరు వద్ద నిలిచింది.
ఆ తరువాత వచ్చిన శివం దూబె, ఒక సిక్స్ ఒక ఫోర్ తో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసిన శివం దూబె ఔటైన తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా సిక్సర్ తో పరుగుల వేట మొదలెట్టినా కుదురుకోలేదు. రింకూ సింగ్ కూడా పెద్దగా రాణించలేదు. 54 బంతుల్లో 13 సిక్సర్లు 7 ఫోర్ లతో 135 పరుగులు చేసిన అభిషేక్ శర్మ చివరకు అవుట్ అయ్యాడు నిర్ణీత 20 ఒవర్లు పూర్తయ్యే సరికి టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.
248 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ వినా మరెవరూ భారత్ బౌలింగ్ మందు నిలవ లేకపోయారు. సాల్ట్ 55 పరుగులు చేశాడు. అతడి తరువాత ఇంగ్లాండ్ బ్యటర్లలో జాకెబ్ బెతల్ ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. బెతల్ పది పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, శివం దుబె, అభిషేక్ వర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్ కి ఒక వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ వర్మకు దక్కింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/abishek-verma-score-century-39-192244.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.