Publish Date:Aug 29, 2022
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవల్ సోమవారం (ఆగస్టు 29) అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న అమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల మధ్య కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికీ బీజేపీ రూ. 20 కోట్లు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. సంతలో పశువుల్లో కొనుగోలుకు బీజేపీ సిద్ధపడినా.. తమ పార్టీ వారెవరూ అందుకు సిద్ధంగా లేరన్న కేజ్రీవాల్.. ఆ విషయాన్ని రుజువు చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న్ట్లట్లు పేర్కొన్నారు.
అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మహాత్మా గాంధీ స్మారక రాజ్ఘాట్లో ప్రార్థనలకు నాయకత్వం వహించారు, ఆ తర్వాత ఢిల్లీలోని ఆప్కి చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో 53 మంది ఆయన నివాసంలో సమావేశానికి హాజరైన సంగతి విదితమే. రాజ్ఘాట్ను సందర్శించిన అనంతరం కేజ్రీవాల్ ఆప్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు బీజేపీవారు లంచం ఇచ్చి తమ పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నరనీ, అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ దుష్టపన్నాగాలకు లొంగకుండా నిలిచినందుకు గర్వపడుతున్నాననీ పేర్కొన్నారు.
బీజేపీ ఆపరేషన్ కమలం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం కుట్ర పన్నిందని కేజీవాల్ ఆరోపించారు. తాను ఆప్ని వదిలేసి కమలం గూటికి చేరితే తనపై ఉన్న అన్ని కేసులను మూసివేస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు, అవినీతికి సంబంధించిన కేసులో సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 15 మంది నిందితుల జాబితాలో సిసోడియా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.
2024 సార్వత్రిక ఎన్నికలు మిస్టర్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య పోటీ అని ఆప్ పేర్కొంది. విద్యారంగంలో చేసిన సేవలకు గానూప్రజాదరణ పొందుతున్న ఆప్ నాయకుడిని ఆపడానికి బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆమ్ ఆద్వీ పార్టీ ఆరోపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aap-confidence-motion-in-assembly-today-39-142837.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో యూనిట్ ఇంఛార్జ్లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.