Publish Date:Jun 24, 2021
ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య వివాదాల కేసులు చాలానే తలెత్తుతున్నాయి. అటు పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో కావచ్చు, ఇటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి విషయంలో గొడవలు సహజంగా జరుగుతున్నాయి. ఏ కుటుంబంలో అయిన గొడవలు జరగడం సహజమే కానీ ఆ గొడవలు చావుల వరకు వెళ్తున్నాయి. ఇంకొందరు మాత్రం గదులలో బందించి మరి హింసిస్తున్నారు. అయితే సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది. మీరే చూడండి అసలు ఏం జరిగిందో. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా నాలుగు ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. కారణాలు తెలియలేదుగానీ మనసుకు నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపాలని ప్రయత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆశ అనే మహిళ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి సినీ పరిశ్రమలో పనిచేసేది. అక్కడ సీతానగరం మండలంలోని పెదకొండేపూడికి చెందిన కర్రి అభిరామ్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే బంధించి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడో దుర్మార్గపు భర్త. కొంతకాలం అభిరామ్ ఆమెను దూరం పెట్టడంతో ఇటీవల పెదకొండేపూడిలోని అత్తమామల ఇంటిముందు కొడుకుతో కలిసి నిరసన దీక్ష చేపట్టింది. పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ది చెప్పి వారి మధ్య రాజీ కుదర్చడంతో ఆశ అత్తింట్లోనే ఉంటోంది. అయితే ఆమెతో కాపురం చేయడం ఇష్టం లేని అభిరామ్ కొద్దిరోజులుగా భార్యను ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. పధకం వేశాడు ఆ పధకాన్ని అమలు పడ్డామని దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అతనికి సహకరించారు. వారి నుంచి తప్పించుకున్న ఆశ సీతానగర పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త అభిరామ్తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వెలుగుచూసింది. మోసాల మనుషులు మోసపు రోజులు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కానీ రోజులు ఇవి.. ప్రేమ పేరుతో కలవడం ఆ తర్వాత విడిపోవడం.. పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు ఏం అవుతుందని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-man-murder-plan-to-killed-his-wife-25-118254.html
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి