Publish Date:Jun 24, 2021
ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య వివాదాల కేసులు చాలానే తలెత్తుతున్నాయి. అటు పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో కావచ్చు, ఇటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి విషయంలో గొడవలు సహజంగా జరుగుతున్నాయి. ఏ కుటుంబంలో అయిన గొడవలు జరగడం సహజమే కానీ ఆ గొడవలు చావుల వరకు వెళ్తున్నాయి. ఇంకొందరు మాత్రం గదులలో బందించి మరి హింసిస్తున్నారు. అయితే సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది. మీరే చూడండి అసలు ఏం జరిగిందో. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా నాలుగు ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. కారణాలు తెలియలేదుగానీ మనసుకు నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపాలని ప్రయత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆశ అనే మహిళ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి సినీ పరిశ్రమలో పనిచేసేది. అక్కడ సీతానగరం మండలంలోని పెదకొండేపూడికి చెందిన కర్రి అభిరామ్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే బంధించి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడో దుర్మార్గపు భర్త. కొంతకాలం అభిరామ్ ఆమెను దూరం పెట్టడంతో ఇటీవల పెదకొండేపూడిలోని అత్తమామల ఇంటిముందు కొడుకుతో కలిసి నిరసన దీక్ష చేపట్టింది. పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ది చెప్పి వారి మధ్య రాజీ కుదర్చడంతో ఆశ అత్తింట్లోనే ఉంటోంది. అయితే ఆమెతో కాపురం చేయడం ఇష్టం లేని అభిరామ్ కొద్దిరోజులుగా భార్యను ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. పధకం వేశాడు ఆ పధకాన్ని అమలు పడ్డామని దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అతనికి సహకరించారు. వారి నుంచి తప్పించుకున్న ఆశ సీతానగర పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త అభిరామ్తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వెలుగుచూసింది. మోసాల మనుషులు మోసపు రోజులు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కానీ రోజులు ఇవి.. ప్రేమ పేరుతో కలవడం ఆ తర్వాత విడిపోవడం.. పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు ఏం అవుతుందని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-man-murder-plan-to-killed-his-wife-39-118253.html
అధికారం కోసం ఈ వైసీపీ పిశాచాలు అశుద్ధ భక్షణకు కూడా రెడీ అయ్యేట్టున్నాయి. చేజారిపోబోతున్న అధికారాన్ని మళ్ళీ ఎలాగైనా దక్కించుకుని, రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు పాతాళానికి దిగజారిపోతున్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో అశేష జనవాహిని మధ్య పెనుకొండ తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సవితమ్మ
జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని చంపిస్తాడా? అవునని అంటున్నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి.
తాను, తన భార్య ఒకే గదిలో ఉండటం లేదని చెప్పారు. కండోమ్ లేకుండానే ట్రంప్ నాతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నా వయసు 27 ఏళ్లు.. ట్రంప్ వయసు నా తండ్రి కంటే ఎక్కువ ఉంటుందేమో’’ అంటూ వివరంగా ఆ రోజు ఏం జరిగిందో 45 ఏళ్ల స్టార్మీ డేనియల్స్ చెప్పారు.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్ సభ స్థానంలో ఈ సారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా? అంటే స్థానికులు ఔననే అంటున్నారు. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారడం ఆరంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పర్వం ఈ శనివారం (మే 11) సాయంత్రంతో ముగియనుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు. అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి.
చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు. ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింతమనేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయనకు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా.. తెలుగు మీడియాతో మాట్లాడటమా అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నిత్యం కాకపోయినా తరచుగా మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తుంటారు.
కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు