కళ కోసం ఓ సినిమా !!

Publish Date:Dec 14, 2021

Advertisement

భర్తృహరి అద్భుత పద్యం కళాతపస్వి అద్భుత దృశ్యకావ్యం!!

【శ్లోకం:- జయంతి తే సుకృతినో |

రససిద్ధాః కవీశ్వరాః ||

నాస్తి తేషాం యశః కాయే |

జరామరణజం భయమ్ ||

సిద్ధౌషధ సేవవల్ల ముసలితనాన్ని – మరణాన్ని సైతం అతిక్రమించవచ్చు ! అయితే – అది ఇట్టి ఔషధం యోగులకు మాత్రమే అందుబాటులో ఉండి, వారే సేవించగలుగుతారు. విద్వాంసులైన వారికి ‘ కీర్తి ‘ రూపంలో మరణానంతరం కూడ జీవం ఉండి, సిద్ధౌషధంలా వారిని జీవింపచేస్తుంది. ఇటువంటి ధన్య జీవులు ఎవరు ? కవులు – పండితులు వీరు సద్ధౌషధం సేవించిన యోగులవంటివారు.】

పై పద్యం భర్తృహరి రచించిన నీతి శతకంలోనిది. ఆ పద్యాన్ని, దాని భావాన్ని వివరంగా పరిశీలిస్తే, దాన్ని అర్థం చేసుకుంటే కళ ఎంత గొప్పదో అర్థమవుతుంది. కవులు, పండితులు సిద్దౌషధం సేవించినటువంటి వారని ఆయన అంటాడు. ఇంతకు సిద్ధ ఔషధం ఏమిటి అంటే ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలాంటిది శక్తివంతమైన వైద్యం సిద్దవైద్యం కూడా. సిద్ధులు శైవ భక్తులు, వీరు పద్దెనిమిది మంది ఋషులు. ఆయుర్వేదాన్ని ఎలాగైతే ధన్వంతరీ మహర్షి అభివృద్ధి చేశారో అలాగే సిద్ధులు కూడా సిద్దవైద్యాన్ని అభివృద్ధి చేశారు. ఈ సిద్ధులలో అగస్త్య మహర్షి ముఖ్యమైనవాడు. ఇక విషయంలోకి వెళ్తే ఆ సిద్ధ ఔషధం అమృతంతో సమనమైనది. దాన్ని తీసుకున్నవాడు మరణాన్ని జయిస్తాడు. అయితే అది సాధారణ మనుషులకు అందుబాటులో ఉండదు. యోగులు, ఋషులకు అందుబాటులో ఉండి వాళ్ళు మాత్రమే దాన్ని సేవించగలుగుతారు.

కానీ….. విద్వాంసులు అంటే కవులు, పండితులు, కళలలో నైపుణ్యం సంపాదించినవారు. వీళ్ళందరూ సాధారణ మనుషుల్లోనే ఉన్నా, వీళ్ళు మరణించినా వారిలో ఉండే కళ, దాని నైపుణ్యం కారణంగా వాళ్ళు అందరి మనసులలో జీవించే ఉంటారు. అంటే భౌతికంగా మరణించినా, మానసికంగా అందరి మనసులలో బతికే ఉండటం. ఇలాంటి వాళ్ళు సిద్ధ ఔషధం స్వీకరించిన యోగులు, ఋషుల వంటి వారు. మనుషుల్లో ఉన్న గొప్పవాళ్ళు వీళ్ళు.  దీని వల్ల కళ గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, బొమ్మలు గీయడం, పాటలు పాడటం, విశిష్ట ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరు కూడా పైన భర్తృహరి చెప్పినట్టు అమృతంతో సమానమైన ఔషదాన్ని సేవించినవాళ్ళ లాంటి వారే.

ఇక ఈ పద్యం ముఖ్యంగా భర్తృహరి నీతి పద్యంగానే కాకుండా కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం సాగరసంగమంలో ఈ పద్యాన్ని ప్రస్తావిస్తారు. అంటే ఆ సినిమాలో కూడా కళ గురించి తపించిన వారు కళను ప్రేమించి, ప్రతిభ ఉన్నవారికి భౌతికంగా మనరణం సంభవించినా మానసికంగా మరణం అనేది ఉండదనే విషయాన్ని అందులో చెప్పారు.

కాబట్టి కళను గౌరవించి, ప్రేమించాలి. ముఖ్యంగా నేటితరం సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి.

◆ వెంకటేష్ పువ్వాడ
 

By
en-us Political News

  
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.