డెల్టా డెత్ గేమ్ స్టార్ట్.. 500 చిన్నారులు మృతి.. 

Publish Date:Jul 26, 2021

Advertisement

ఒకటి కాదు రెండు కాదు. ఒకే  వారంలో ఏకంగా  500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయసు  ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. గత వారంలో 500మంది చిన్నారుల మృతి చెందగా, 50వేల కొత్త కేసులు..ఇండోనేసియా దేశం ఏషియాలోనే డెల్టా వేరియంట్ కే కేంద్రబిందువుగా మారిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అక్కడ రోజురోజు పెరుగుతున్న కేసులు, చావు బతుకలతో బెంబేలెత్తిపోతోందా? ఇండోనేసియాలో కోవిడ్ పేనిక్ సిట్యువేషన్ ఎలా ఉంది?  డెల్టా వేరియంట్ లో-  ఇప్పటికే 27 లక్షల కేసులు వచ్చాయి. అది అలా ఉంచితే  ఒక్క వారంలో 50 వేల కేసులు నమోదు అవ్వడం. ఈ దేశం తన రికార్డులను తానే అధిగమిస్తూ తన చావు తానే ఒంటరిగా ఎదుర్కుంటున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండోనేసియా అని చెప్పాలి.  ఇక్కడ చాలా మంది పరిస్థితి ఏంటంటే.. కరోనా ఒక వైపు కరోనా వచ్చాక ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు అక్కడి ప్రజలు.  ఇలాంటి డెల్టా డెత్ సమాచారం అందుకుంటున్న సిబ్బంది గతంలో ఒకటీ రెండు మాత్రమే దహన సంస్కారాలను చేసేవారు. అదే ఇప్పుడు.. రోజుకు 24 వరకూ అంత్యక్రియలు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.

ఆక్సిజన్ కొరత, కోవిడ్ మరణాలు, ప్రాణాధార ఔషధాల అందలేకపోవడంతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. అంత వల్లకాడులా మారుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి కొంత వరకు భారత్ బయటపడిందనే చెప్పాలి. అయితే గతంలో  భారత్ ఎదుర్కొన్న పరిస్థితిని ఇప్పుడు ఇండోనేషియాలో కనిపిస్తోంది. కరోనా మహమ్మారి విలయతాండవం, అక్కడ కరోనా యముడు ప్రజల ప్రాణాలతో శివతాండవం చేస్తుంది. అయితే ఇప్పుడు సంభవిస్తున్న మరణాల్లో  ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ కరోనా విడతల వారీగా ప్రజలపై తన ప్రభావం చూపిస్తుంది. గతం లో వయసు పై బడిన వారిపై ..ఆ తర్వాత యువకులపై నుంచి ఇప్పుడు ఏకంగా చిన్నారలను కబళిస్తుంది. చిన్నారులను  ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ పిల్లల్లో కరోనా మరణాల రేటు పెరిగిపోతోంది. వందలాది మంది చిన్నారులు కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోతూ.. స్మశానాల్లో కాలుతున్నారు.  ఇండోనేషియాకు చెందిన వందలాది మంది చిన్నారులు  కోవిడ్ మహమ్మారికి చిక్కి చనిపోయారు. వారిలో చాలా మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇండోనేషియాలో పిల్లల్లో కోవిడ్ మరణాల రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా నమోదైంది. ఇక్కడ జూలై నెలలో వారానికి 100 కన్నా ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇండోనేషియాలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో ఇదే ఎక్కువ అని అక్కడి అధికారులు అంటున్నారు. పిల్లల మరణాల సంఖ్య పెరుగుదల ఆగ్నేయాసియాలో డెల్టా వేరియంట్ కేసులతో సమానంగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఇండోనేషియా ప్రభుత్వం దేశీయ మొత్తం జనాభాలో దాదాపు 50వేల కొత్త కేసులు నమోదు కాగా.. 1,566 మరణాలు నమోదయ్యాయి.

శిశువైద్యుల ఇచ్చిన నివేదికల ప్రకారం.. ఆ దేశంలో కోవిడ్ కేసులలో మునుపటి నెలతో పోలిస్తే… చిన్నారులు 12.5శాతంగా ​ఉన్నారు. జూలై 12న కరోనాతో 150 మందికి పైగా చిన్నారులు చనిపోయారు.  గత వారంలో 500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. మొత్తంమీద.. ఇండోనేషియాలో 3 మిలియన్లకు పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా, 83వేల మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది నుంచి ఇండోనేషియాలో 18ఏళ్ల కంటే తక్కువ వయస్సులో 800 మందికి పైగా చిన్నారులు కరోనా రక్కసికి చిక్కారు.

కోవిడ్ మరణాలలో ఎక్కువ భాగం గత నెలలోనే నమోదయ్యాయని ఆ దేశ వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశంలో తక్కువ టీకా రేటు కూడా దీనికి కారణమనేది ఇక్కడి వారి రిపోర్టులో వెల్లడైంది. ఇండోనేషియాలో కేవలం 16శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందినట్లుగా తెలుస్తోంది. మరో 6శాతం మందికి మాత్రమే రెండో డోస్ వేయించుకున్నవారి సంఖ్య ఉంది. కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రులన్నీ వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా సోకిన చిన్నారుల సంరక్షణ కోసం కొన్ని ఆస్పత్రులను ప్రత్యేకంగా  ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిలలను రక్షించుకునేందుకు వారి ఉరుకులు పరుగులు చూస్తుంటే మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏ దేశానికైనా విపత్తు వచ్చినప్పుడు మన దేశం ఎప్పుడు ముందే ఉంటుంది.. మన దేశం ఎప్పుడు ముందే ఉంటుందని మరో నిరూపించింది. తాజాగా భారత్ తన మిత్ర దేశానికి చేయూతనిస్తోంది. ఇప్పటికే 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ను ఇండోనేషియాకు పంపించింది. భారత నావికాదళానికి చెందిన ఓ నౌకలో వీటిని ఇండోనేషియా రాజధాని జకార్తా తరలించారు.

By
en-us Political News

  
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.