Publish Date:Jan 13, 2025
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆయన పరిస్థితి ఇపుడు కొరివితో తలగోక్కున్నట్టు తయారయ్యింది. తన పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించుకోకపోవడంతో కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
జిల్లా కలెక్టరేట్ లో అధికారిక కార్యక్రమంలో గందరగోళం సృష్టించి మీటింగ్ ను పక్కదారి పట్టించిన ఆరోపణపై కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆదివారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్ట రేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో రసాభాసాగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కౌశిక్ రెడ్డి పచ్చి బూతులు తిట్టారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యేను ఉచ్చరించడానికి వీల్లేని పదజాలంతో తిట్టడం చర్చనీయాంశమైంది. వీరిరువు గతంలో మంచి స్నేహితులు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. కానీ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కౌశిక్ రెడ్డి సహించలేకపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే అరికపూడి కాంగ్రెస్ కు దగ్గరైనప్పుడు పెద్ద గొడవ చేశారు. నానా బూతులు తిడుతూ వార్తలకెక్కారు. తాజాగా సంజయ్ కుమార్ తో అదే తరహా గొడవ చేశారు. వాగ్వాదంతో గొడవ ప్రారంభమై చిలికిచిలికి గాలి వానగా మారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను గట్టిగా తోసేశారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేంలో గందరగోళం ఏర్పడింది. ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదైంది.
ఇక తన పట్ల అసభ్యపదజాలంతో దురుసుగా ప్రవర్తంచిన ఆరోపణపై కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది.
కౌశిక్ రెడ్డిపై గత సంవత్సరం జులై ఒకటో తేదీన బిఎన్ఎస్ యాక్ట్ క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే . ఇదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 122 126(2) బిఎన్ఎస్ సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు. జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రభుత్వాధికారులను దూషించిన ఆరోపణ క్రింద కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొత్తగా పరిచయం చేసిన క్రిమినల్ కోడ్ బిఎన్ ఎస్ క్రింద కేసు నమోదైన మొదటి పొలిటిషియన్ కూడా కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/3-cases-registered-against-brs-mla-padi-kaushik-reddy-25-191243.html
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.