ప్రతి కుటుంబానికీ పాతిక లక్షలు ఆరోగ్య బీమా.. దటీజ్ బాబు!

Publish Date:Feb 21, 2025

Advertisement

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. ముందు తరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పథకాలకు రూపకల్పన చేస్తారు. ఇదే ఆయనను  మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారిని సైతం ఆయన అభిమానులుగా మార్చేసింది. ఒక అబ్దుల్ కలామ్, ఒక బిల్ గేట్స్ వంటి వారు తాము చంద్రబాబు అభిమానులమని బాహాటంగా ప్రకటించడం వెనుక కారణం కూడా ఇదే. అటువంటి చంద్రబాబు ఇప్పడు ప్రజా ప్రయోజనాలు, ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర పథకంతో ముందుకు వస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఎవరూ ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదన్న ఉద్దేశంతో ఆయన విప్లవాత్మక పథకానికి రూపకల్పన చేస్తున్నారు. 

ఔను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో విప్లవాత్మక పథకాన్ని అమలు చేసే యోచనలో ఉన్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబానికీ పాతిక లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకానికి రూపకల్పన చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే దేశంలోనే ఇదొక ఆరోగ్య విప్లవంగా నిలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ  పథకం అమలులో ఉంది.  అయితే ఆ పథకం కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితం. ఉదాహరణకు ఈ పథకం కిందకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. అంతే కాకుండా ఈ పథకం పూర్తిగా అసంఘటితంగా ఉంది. ఈ పథకం కింద వైద్య సేవలు అందించే ప్యానల్ ఆస్పత్రుల సంఖ్య చాలా చాలా స్వల్పం. ఆ ఆస్పత్రులు కూడా తరచూ పెండింగ్ బిల్లులంటూ సేవలు నిలిపివేస్తామని బెదరిస్తాయి. పలు ఆస్పత్రులైతే ఈ పథకం కింద చికిత్స అందించడానికి పెండింగ్ బిల్లులు సాకు చూపుతూ నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకూ ఆరోగ్యబీమా కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు.  ఈ పథకం అమలులోకి వస్తే దేశంలోనే ఇది ఒక ఆరోగ్య విప్లవంగా అభివర్ణించవచ్చు. 

ఒక అంచనా ప్రకారం ప్రతికుటుంబానికి ఆరోగ్య బీమా వర్తింప చేయడానికి కుటుంబానికి పాతిక వందల చొప్పున ప్రీమియం పడుతుంది. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బీమా కంపెనీల మధ్య పోటీ కారణంగా ప్రీమియం మరింత తగ్గే అవకాశాలను కూడా కొట్టి పారేయలేము. దివంగత వైఎస్సార్ తొలి సారిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకానికి ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఈ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా పేరు మార్పు వినా ఈ పథకాన్ని యథాతధంగా కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అమలు అవుతోంది. అయినప్పటికీ ప్రజలు దీనిని ఆరోగ్య శ్రీ పథకం అనే అంటున్నారు.  ఆ క్రెడిట్   వైఎస్సార్ ఖాతాలోనే పడుతోంది. దానిని అలా ఉంచితే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిమితులూ లేకుండా ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆరు గంటల్లో చికిత్సకు అనుమతి లభించడమే కాకుండా చెల్లింపులు సైతం వేగంగా జరుగుతాయి. 

ఇది అమలులోకి వస్తే చంద్రబాబు పేరు చిరస్థాయిగా ప్రజల గుండెలలలో నిలిచిపోతుందని, అన్నిటికీ మించి ఇది చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద రాజకీయ పెట్టుబడి అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక సారి ఈ పథకం ఏపీలో అమలులోకి వస్తూ ఆ వెంటనే పలు రాష్ట్రాలు కూడా దీనిని తమ తమ రాష్ట్రాలలో అమలు చేస్తాయి. ఇందుకు రాజకీయ ప్రయోజనాలు ఒక కారణమైతే.. బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉండటం మరో కారణం. ఈ పథకాన్ని కనుక చంద్రబాబు రాష్ట్రంలో ముందుగా అమలులోకి తీసుకు వస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పరిశీలకులు అంటున్నారు. 

కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే ఆ పథకం కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా మాత్రమే కల్పిస్తున్నది.  అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదిస్తున్న బీమా పథకం మాత్రం  అంతకు ఐదింతలు ఎక్కువగా  పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తుంది.  

By
en-us Political News

  
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.