ఆత్మహత్యలకు దారితీస్తున్న సీరియల్

Publish Date:Aug 1, 2017

Advertisement

 

ఇప్పటి సినిమాలు చూసి కుర్రవాళ్లు చెడిపోతున్నారని అంటారు పెద్దలు. ఇప్పటి సీరియల్స్ ఇంట్లో విషాన్ని నింపేస్తున్నాయి అంటున్నారు పిల్లలు. మనకి రోజూ కనిపించేదే తీస్తున్నాం కదా! అని తప్పుకుంటున్నారు నిర్మాతలు. ఇంతకీ మీడియా ప్రభావం మన మీద ఉందా? అనే ప్రశ్నకి దిమ్మతిరిగిపోయే జవాబు ఒకటి వినిపిస్తోంది. అదే 13 Reasons Why. ఒక టీనేజీ అమ్మాయి తన స్కూళ్లో అనుకోని సమస్యలని ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యే సరైన మార్గం అని అనుకుంటుంది. ఆత్మహత్య చేసుకుంటుంది కూడా! కానీ చనిపోబోయే ముందు ఓ 13 వీడియో క్యాసెట్ల ద్వారా తన బాధనంతా వెళ్లగక్కుతుంది. తన మనసుని నొప్పించి తన చావుకి కారణమైనవారికి ఆ 13 క్యాసెట్లనీ పంపుతుంది. ఇదీ క్లుప్తంగా ’13 Reasons Why’ అనే నవలలోని కథ. ఇప్పుడు అదే నవలను Netflix అనే సంస్థ ఒక సీరియల్గా రూపొందించింది. ఈ ఏడాది మార్చిలో సీరియల్ మొదలవగానే విపరీతమైన జనాదరణ లభించింది. సీరియల్ అద్భుతంగా ఉందనీ, కుర్రకారు ప్రవర్తనకు దగ్గరగా ఉందనీ జనం విరగబడి చూడటం మొదలుపెట్టారు. కానీ ఈ సీరియల్ మొదలైన దగ్గర నుంచీ అది కుర్రకారు మీద ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆరోపణలు మొదలయ్యాయి.

 

నిజంగానే 13 Reasons Whyతో ఆత్మహత్యలు పెరిగి ఉంటాయా? అన్న అనుమానం వచ్చింది పరిశోధకులకి. దాంతో ఇంటర్నెట్లో ఆత్మహత్యల గురించి వెతికేవారి సంఖ్య పెరిగిందో లేదో గమనించాలనుకున్నారు. ఆశ్చర్యంగా ఈ సీరియల్ మొదలైన దగ్గర్నుంచీ ఆత్మహత్యల గురించి సమాచారం కోరుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. ఇలా కాస్తో కూస్తో కాదు, దాదాపు 20 శాతం ఎక్కువ మంది ఆత్మహత్యల గురించి విచారించడం మొదలుపెట్టారట. ఆత్మహత్య ఎలా చేసుకోవాలి? మనల్ని మనం చంపుకోవడం ఎలా? లాంటి ప్రశ్నలు ఇంటర్నెట్లో ఎక్కువయిపోయాయి.

 

ఆత్మహత్య గురించి సెర్చ్ చేసినవారంతా ఆత్మహత్యకు పాల్పడరు కదా! అన్న వాదన రావచ్చు. కానీ వారిలో అలాంటి ఆలోచన ఒకటి మొదలయినట్లేగా! పైగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు, అప్పటికే మానసికమైన సమస్యలు ఉన్నవారు.... ఇలాంటి సీరియల్స్ చూస్తే, ఆత్మహత్య చేసుకుంటే దరిద్రం వదలిపోతుంది అన్న నిర్ణయానికి వచ్చేసే ప్రమాదం ఉన్నట్లే. దానికి రుజువుగా, ఈ సీరియల్ మొదలైన దగ్గర నుంచీ... ఆత్మహత్య చేసుకోవాలనే తలపుతో సైక్రియాట్రిస్టుల దగ్గరకి పరుగులు పెట్టేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందట.

 

ఆత్మహత్య అనేది క్షణికావేశంతో తీసుకునే నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించేలా ఎలాంటి దృశ్యాలు కనిపించకుండా మీడియా జాగ్రత్త పడాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకునే విధానాన్ని చూపించడం, ఆత్మహత్యే ప్రధాన అంశంగా ప్రోగ్రాంలు రూపొందించడం చేయకూడదని చెబుతోంది. కానీ ఇప్పుడు ఆత్మహత్య తప్ప మరో మాట లేకుండా ఏకంగా ఓ సీరియల్నే రూపొందించేశారు. పైగా అది సూపర్హిట్ కావడంతో... దాన్ని పొడిగించేందుకు సిద్ధపడిపోతున్నారు.

- నిర్జర.

 

 

 

By
en-us Political News

  
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.