సెప్టెంబర్ 10కి.... ఆత్మహత్యకి లింకేంటి?

Publish Date:Sep 10, 2016

Advertisement

సెప్లెంబర్ 10.... వాల్డ్ సుయిసైడ్ ప్రివెన్షన్ డే! ఇది కూడా వుందా అని ఆశ్చర్యపోతున్నారా? అప్ కోర్స్, వుంది! నిజానికి సంవత్సరం పొడవునా వచ్చే రకరకాల వింత, విచిత్ర దినాలు, దినోత్సవాల కంటే ఇది ఎంతో ముఖ్యమైంది! అవసరమైంది! అర్థవంతమైంది కూడా! భూమ్మీద ఆత్మహత్య చేసుకునేదెవరు? మనిషే! ఇంకెవరూ సుయిసైడ్ చేసుకోరు! కొన్ని క్రిములు, పురుగులు, జంతువులు ఆత్మహత్యకి పాల్పడతాయని కొందరు చెబుతున్నా... అది చాలా అరుదైన పరిణామం. కాని, మామూలుగా మనకంటే ఎంతో తక్కువ స్థాయి చైతన్యంలో వుండే నూటికి తొంభై తొమ్మిది శాతం జంతువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోవు! మనిషి మాత్రం ఆత్మహత్య చేసుకుంటాడు! ఇదే పెద్ద విషాదం... 


మనిషి చాలా తెలివైన వాడు. అదే అతని బలం, బలహీనత. తెలివి సరైన దారిలో ముందుకు పోతే రోబోలు మొదలు రాకెట్ల వరకూ ఎన్నిటికో ప్రాణం పోస్తాడు. కాని, అదే తెలివి ఒక్కమారు తప్పుదోవ పట్టిందంటే తన ప్రాణం తానే తీసుకుంటాడు! ఇంకా తెలివి వక్ర మార్గం పట్టిపోతే సాటి మనిషిదే ప్రాణం తీస్తాడు కూడా! ఇలా హత్యకి , ఆత్మహత్యకి పాల్పడే మరే జీవి భూమ్మీద లేదనే చెప్పాలి.... ఎందుకని మనిషి హత్యకి, ఆత్మహత్యకి పాల్పడతాడు? హత్య చేయాలంటే స్వార్థం కట్టలు తెంచుకోవాలి. ఆగ్రహం నరాలు తెంచుకోవాలి. ఇది కొంత క్లియరే. కాని, ఆత్మహత్య చాలా క్లిష్టమైంది. ఒక మనిషి బతకటానికే ఎప్పుడూ ఛస్తుంటాడు. ఎన్నో చేస్తుంటాడు. ఏదైనా చేస్తుంటాడు. కాని, ఒకానొక క్షణంలో అంతా వద్దనుకుని ఉరితాడుకి వేళ్లాడుతాడు. నిద్ర మాత్రలు మింగేస్తాడు. ఇదే ఆత్మహత్యలోని అయోమయం! 


ప్రకృతి ప్రతీ జీవికి బతకటం సహజంగా నేర్పిస్తుంది. చిన్న చీమ కూడా కాలి కింద పడితే నలిగిపోయి మళ్లీ తిరిగి లేచి కూర్చునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ్నుంచి ముందుకు వెళ్లిపోయి ప్రాణం దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. కాని, కొన్ని లక్షల చీమలకు సమానమైన మనిషి మాత్రం రకరకాలుగా ఆత్మహత్య చేసుకుంటాడు. రకరకాల కారణాలతో తనని తాను అంతం చేసుకుంటూ వుంటాడు! ఈ వైపరిత్యానికి కారణం మనిషిలో వున్న అపారమైన జ్ఞాపకశక్తి! ఇది విచిత్రంగా అనిపించినా నిజం! మనిషికి మతిమరుపు వుంటుంది. అది చాలా ఇబ్బందులకి కారణం. కాని, జ్ఞాపకం అంతకంటే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అసలు మన సమస్యలన్నీ మన ఆలోచనలే కదా! గతం గురించిన మన జ్ఞాపకాలే మన అత్యధిక శాతం దుఃఖాలకి కారణం. ఎప్పుడైతే మనిషి తన జ్ఞాపకాన్ని జయించలేకపోతాడో, ఎప్పుడైతే జరిగిపోయిన దానినే తలుచుకుని తలుచుకుని కుమిలిపోతాడో డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ జీవించటం కంటే మరణం మేలనిపించేలా చేస్తుంది! ఇదే లాజికల్ గా మాట్లాడుకున్నప్పుడు మనిసి ఆత్మహత్యకి కారణం!

ప్రతీసారి మనిషి గతమే ఆత్మహత్యకి కారణం కాకపోవచ్చు. అప్పుడప్పుడూ భయం, భవిష్యత్ గురించి మనిషి ఊహించుకునే అర్థరహితమైన కల్పనలు... ఇవి కూడా ఆత్యహత్యే శరణ్యం అనిపించేలా చేస్తాయి. 
వాల్డ్ సుయిసైడ్ ప్రివెన్షన్ డే అయిన ఇవాళ్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే... ఆత్యహత్యకి ఏకైక పరిష్కారం దైర్యం. అది వుంటే ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. అలాగే, ఆత్యహత్య చేసుకుంటారని మనకు అనుమానం వున్న వారికి కూడా ధైర్యం కల్పించటమే అత్యుత్తమం...   
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.