అన్ని పార్టీలు చుట్టేసిన రాములమ్మ! ఈసారైనా సెటిలయ్యేనా?

Publish Date:Nov 9, 2020

Advertisement

22 ఏండ్లు.. ఐదు పార్టీలు.. ఒకసారి ఎంపీ పదవి. ఇవీ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండుగా పిలుచుకునే విజయశాంతి అలియాస్ రాములమ్మ రాజకీయ చరిత్రను సూచించే లెక్కలు. సినిమా రంగం నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన విజయశాంతి.. ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండలేకపోయారు. నాలుగు పార్టీలు మార్చారు. సొంతగా ఒక పార్టీ పెట్టుకుని కొంత కాలానికి దుకాణం ఎత్తేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటి చైర్మెన్ గా ఉన్న ఆమె,,  త్వరలోనే బీజేపీలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. 
 

1998లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు  విజయశాంతి.  తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009లో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి కేసీఆర్ తో కలిసి పనిచేశారు రాములమ్మ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ తర్వాత గులాబీ పార్టీలో నంబర్2 పొజిషన్ లో విజయశాంతి ఉన్నారనిపించింది.   అయితే కొద్ది రోజులకే  కేసీఆర్ తో ఆమెకు విభేదాలొచ్చాయి. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాసైన సందర్భంలో ఆమె టీఆర్ఎస్ ఎంపీగా సభలోనే ఉన్నారు. అయితే కేసీఆర్ తో మాత్రం దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్  లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతిని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ చైర్మెన్ ను చేశారు.
           

ఫైర్ బ్రాండ్ లేడీగా రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి ఎక్కడా స్థిరంగా ఉండకపోవడంపై విమర్శలకు తావిచ్చింది. ఆవేశపూరిత నిర్ణయాలే ఆమెకు నష్టం కల్గించాయనే భావన వ్యక్తమవుతోంది. ఎల్ కే అద్వాని శిష్యురాలిగా బీజేపీలో చేరిన రాములమ్మకు ఆ పార్టీలో  మంచి గుర్తింపే దక్కింది. అయితే కొంత కాలానికే ఆమె తల్లి తెలంగాణ పేరుతొ సొంత పార్టీ స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే దేవేందర్ గౌడ్ పీఆర్పీ వైపు మొగ్గు చూపడంతో.. విజయశాంతి ఆయనతో విభేదించారు. అనూహ్యంగా తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. 

 

2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి.. కొంత కాలానికే ఆ పార్టీ నేతలతో విభేదాలొచ్చాయి. ఎంపీగా ఉంటూనే టీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్జేజీలో ఉన్న సమయంలోఎంపీగా ఉన్న విజయశాంతి.. కేసీఆర్ తో మాత్రం గ్యాప్ పెంచుకుంటూనే వచ్చారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కొన్ని ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో  పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ 2013లో రాములమ్మని టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక 2014లో విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు. 

 

కాంగ్రెస్ లోనూ విజయశాంతికి మంచి స్థానమే దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమెను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. తర్వాత ప్రచార కమిటి చైర్మెన్ చేశారు. నిజానికి ఎన్నికల ప్రచారంలో తప్ప మిగితా సమయంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరు. కొన్ని సార్లు నెలల తరబడి ఆమె బయటికే రారని ఆరోపణలున్నాయి. అయినా రాములమ్మకు కీలక పోస్టులు కట్టబెట్టింది కాంగ్రెస్. విజయశాంతికి  కాంగ్రెస్ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉండేవంటారు. అందుకే టీపీసీసీ నేతలతో పని లేకుండానే ఆమెకు పార్టీలో కీలక పోస్టులు వచ్చాయంటారు. అయితే ఈ మధ్య రాష్ట్ర పార్టీ సీనియర్లు తనను పట్టించుకోవడం లేదని,  కొన్ని కీలక సమావేశాలకు పిలవలేదనే భావనలో విజయశాంతి ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల  ప్రచారానికి ఆమె దూరంగా ఉన్నారు. గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతి.. అదే జిల్లా పరిధిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికను పట్టించుకోకపోవడంతోనే ఆమె పార్టీ మారడం ఖాయమనే సంకేతమిచ్చింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో రాములమ్మ పార్టీ మారకపోవచ్చని భావించారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ తో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. 

 

బీజేపీ నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాములమ్మ.. తిరిగితిరిగి మళ్లీ అదే పార్టీ  చేరబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెకు బీజేపీలో జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో చేరి తనదైన ముద్ర వేసి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు బీజేపీలో చేరడం.. అటు ఆ పార్టీకి, ఇటు ఈమెకు కూడా లాభం చేకూర్చే అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో ఈసారైనా విజయశాంతి నిలదొక్కుకోగలుగుతుందా లేద మళ్లీ కొన్ని రోజులపై పార్టీ మారుతుందా అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.