థోరియం నిల్వలు..ఆరోపణలు వాస్తవాలు.. సాంకేతిక సవాళ్లు!

Publish Date:Apr 14, 2026

Advertisement

కంఠమనేని సీతారాం

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా దేశంలో   థోరియం నిల్వలకు సంబంధించి భారీ ఎత్తున కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.  గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 60 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద అక్రమంగా విదేశాలకు తరలిపోయిందనీ, దీనివల్ల దేశం భారీగా నష్టపోయిందని ఈ కథనాల సారాంశం. ముఖ్యంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వంటి అగ్రనేతల నిర్ణయాల వల్ల భారత అణు ఇంధన స్వయంప్రతిపత్తి దెబ్బతిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వివాదానికి ప్రధాన కేంద్రం   దేశ తీరప్రాంతాల్లో లభించే  మోనాజైట్ అనే ఖనిజం. ఇందులో థోరియం నిల్వలు పుష్కలంగా ఉంటాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రైవేట్ సంస్థలు జరిపిన బీచ్ సాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. దీనిపై గతంలోనే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి, కొన్ని సంస్థలపై కేసులు కూడా నమోదు చేశాయి. అయితే..  సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లక్షల కోట్ల రూపాయల నష్టం అనే అంకెకు సంబంధించి ఏ ప్రభుత్వ సంస్థ లేదా కాగ్   ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నివేదికను విడుదల చేయలేదు.

భారతదేశం భవిష్యత్  అణు విద్యుత్ అవసరాల కోసం మూడు దశల అణు కార్యక్రమాన్ని రూపొందించుకుంది. ఇందులో థోరియం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ..  థోరియం ఆధారిత రియాక్టర్ల నిర్మాణం అనేది అత్యంత సంక్లిష్టమైన, భారీ వ్యయంతో  కూడుకున్న ప్రక్రియ. ప్రస్తుతం ఈ సాంకేతికత అభివృద్ధిలో జాప్యం జరగడానికి ప్రధానంగా శాస్త్రీయ,  భద్రతా పరమైన సవాళ్లే కారణమని నిపుణులు అంటున్నారు. దీనిని కేవలం రాజకీయ కోణంలో చూడటం సరికాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు..  చైనా వంటి దేశాలు భారత్ నుండి అక్రమంగా థోరియం పొంది వేల ఏళ్ల పాటు తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోబోతున్నాయనే వాదనలకు కూడా  శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇల్మనైట్ వంటి ఖనిజాలను నియంత్రిత జాబితా నుండి తొలగించడం వల్ల స్మగ్లింగ్ పెరిగిందని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, భారీ స్థాయిలో థోరియం రహస్యంగా ఎగుమతి కావడం సాధ్యం కాదని అణు శక్తి విభాగం చెబుతోంది.

ఏది ఏమైనా..  దేశ వ్యూహాత్మక వనరులైన థోరియం వంటి ఖనిజాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అక్రమ మైనింగ్‌ను అరికట్టడం ఎంత ముఖ్యమో..  సాంకేతికతను అభివృద్ధి చేసి అణు శక్తి రంగంలో స్వావలంబన సాధించడం కూడా అంతే  ముఖ్యం.  నిరాధారమైన ఆరోపణలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్న తరుణంలో..  ప్రభుత్వం, శాస్త్రీయ సంస్థలు ఈ అంశంపై పూర్తి పారదర్శకతతో కూడిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ భవిష్యత్తుకు అవసరమైన ఇంధన వనరులను కాపాడుకోవడమే మనందరి ప్రాధాన్యత కావాలి.

By
en-us Political News

  
గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సుదీర్ఘంగా మూడు నెలల పాటు పరిశీలించి, అది తప్పుడు కేసు అని తేల్చిచెప్పిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించగానే కేవలం తొలి రోజే ఆ తీర్పును పక్కనపెట్టేలా జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యవహరించారని ఆరోపించారు. కేవలం మూడు విచారణలతోనే నిందితులందరినీ అవినీతిపరులుగా ముద్ర వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండి, ఆర్థికంగా వెనుకబడిన లేదా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విధుల్లో చేరకముందే ఈ బాధితులను గుర్తించి, ఒక పద్ధతి ప్రకారం వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
మానసిక , మతపరమైన ఒత్తిడికి గురి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒకటని కాదు.. పలు విధానాల ద్వారా బాధితులను వీరి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. హిందూ ధర్మంపై విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు, ఆహారపు అలవాట్లలో బలవంతపు మార్పులు అంటే బీఫ్ తినమని ఒత్తిడి చేయడం, అలాగే మతాచారాలను మార్చుకోవాలని అంటే నమాజ్ చేయమని తీవ్ర ఒత్తిడి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ప్రచారంపై హైడ్రా అధికారులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసు పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు తప్పుడు సమాచారం చేస్తున్నారని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే మహిళ బస్సు కింద పడి పోయినప్పటికీ, డ్రైవర్ ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె ఘటనాస్థలంలోనే కన్నుమూసింది.
సామాజిక మాధ్యమంలో పోస్టుల ప్రకారం.. 2004–2014 మధ్య భారీ స్థాయిలో ఖనిజ ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. మోనాజైట్ వంటి థోరియం కలిగిన ఖనిజాలు విదేశాలకు తరలించబడ్డాయి. దీని వల్ల దేశానికి లక్షల కోట్ల నష్టం జరిగింది. థోరియం ఆధారిత అణు సాంకేతికతను ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారు. అన్న తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇప్పటి వరకూ ఏ సీజన్ లోనైనా ఎస్ఆర్ హెచ్ సాధించిన విజయాలన్నీ ఆ జట్టు బ్యాటింగ్ బలంతోనే. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటంతో ఆ జట్టు 200 పరుగుల పై చిలుకు స్కోరును కూడా కాపాడుకోలేక చతికిల పడిన సందర్భాలున్నాయి. అటువంటి ఎస్ఆర్ హెచ్ సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ ప్రదర్శన వల్లనే భారీ విజయం నమోదు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య విభేదాలు పొడసూపినట్లు మైదానంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరియు సీట్ల పెంపు అంశంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది.
ఆదివాసీ, గిరిజ‌న ,ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో మరోసారి మతపరమైన ఉద్రిక్తతలు హింసాత్మక రూపం దాల్చాయి.
ఏప్రిల్ 13, 1919 — భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో శాశ్వతంగా చెక్కుకుపోయిన నల్లరోజు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.