తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర మంత్రుల బృందానికి ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో కేంద్రానికి బోలెడన్ని డిమాండ్లు రాసింది. ఆ బోలెడన్ని డిమాండ్లలో కొన్ని డిమాండ్లు బయటి ప్రపంచానికి తెలిజేసింది. సీమాంధ్రుల గుండెలు ఆగిపోయేలా వున్న ఆ డిమాండ్లను రాజకీయ విశ్లేషకులు గొంతెమ్మ కోర్కెలుగా అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణకి తప్ప టీఆర్ఎస్ మరి దేనికీ ఒప్పుకోదట.
విభజన తర్వాత హైదరాబాద్ని మూడేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కాకుండా సీమాంధ్రకు తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉంచాలట. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను కేంద్రమే నిర్మించాలట. పదిహేను వందల మెగావాట్ల విద్యుత్ని కేంద్రమే ఇవ్వాలట. సీమాంధ్రులు సాధ్యమైనంత త్వరగా రాజధానిని నిర్మించుకునేలా ఒత్తిడి తేవాలట.
అక్కడితో ఆగారా... 1956 కంటే ముందున్న ఆస్తులన్నీ తెలంగాణ ప్రభుత్వానికే ఇచ్చేయాలట. వాటిమీద కేంద్రానికి హక్కులు ఉండకూడదట. సింగరేణి కూడా తెలంగాణ రాష్ట్రానికే సొంతం చేసేయాలట. ఇక్కడితో ఆగితే పర్లేదనుకోవచ్చు. ఏకంగా ఢిల్లీలో వున్న ఏపీ భవన్ కూడా తెలంగాణకే ఇచ్చేయాలట. బయటకి తెలిసినవే ఇంత దారుణంగా వున్నాయి... ఇక లేఖలో ఇంకెన్ని గొంతెమ్మ కోర్కెలు ఉన్నాయోనని పరిశీలకులు అనుమానిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-telangana-party-gives-menu-to-gom-39-27108.html
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.