Publish Date:Jan 26, 2019
‘ది ఒడిసా డైలాగ్’ పేరిట శుక్రవారం భువనేశ్వర్ టౌన్హాల్లో వివిధ రంగాలకు చెందిన వారితో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై స్పందించారు. ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. 'ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం ఈ పది రోజుల్లో ఆకస్మికంగా ప్లాన్ చేసింది కాదు. పార్టీలోకి రావాలని చాలా ఏళ్లుగా ఆమెను అడుగుతూనే ఉన్నాను. ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం అనే ఏకైక కారణంతో వాయిదావేస్తూ వచ్చింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు' అన్నారు. నా ఆలోచనలు, ప్రియాంక ఆలోచనలు దాదాపుగా ఒక్కటే. మమ్మల్ని వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి వివిధ అంశాలపై ప్రశ్నిస్తే .. 80 శాతం సమాధానాలు ఒకేలా ఉంటాయి. మేమిద్దరం చాలా విషయాలపై మాట్లాడుకుంటాం. ఒకరికోసం ఒకరు సర్దుబాటు చేసుకోవాలని భావిస్తాం అన్నారు.
ప్రధాని మోదీపై ఎలాంటి ద్వేషభావం లేదు. ఉన్నదంతా వివిధ అంశాలపై బేధాభిప్రాయాలు మాత్రమే అన్నారు. ఆయా అంశాలపై ఆయనతో గట్టిగా పోరాడతాను. మోదీని గద్దె దించడం నా లక్ష్యం అని పేర్కొన్నారు. ఆయన నన్ను దూషించినప్పుడల్లా ఒక ఆలింగనం ఇవ్వాలని అనిపిస్తుంది. ఆరెస్సెస్, బీజేపీ తిట్లను సైతం దీవెనలుగానే భావిస్తాను అన్నారు. కాంగ్రెస్ అందరి అభిప్రాయాలు వింటుంది. కానీ.. మోదీ అలా కాదు. అన్నీ తనకే తెలుసునని అనుకుంటారు అని ఎద్దేవా చేసారు. బీజేపీకి మాతృక ఆరెస్సెస్. దేశంలోని ప్రతి సంస్థలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాను మినహా మరో సంస్థ ఉండొద్దని భావిస్తుంది. మంత్రులందరినీ ఆరెస్సెస్ కంట్రోల్ చేస్తోంది అని ఆరోపించారు. వ్యవసాయాన్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రైతుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి అని విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-rahul-gandhi-slams-modi-government-in-odisha-dialogue-39-85525.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.