తొలగిన "స్థానికత" అడ్డు

Publish Date:Jun 11, 2016

Advertisement

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏపీకి తరలిరావడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న స్థానికత సమస్య తొలగిపోయింది. తెలంగాణలో స్థిరపడి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి స్థానికతను నిర్థారిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1974, 1975 నాటి ఉత్తర్వులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా 2017 జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే అభ్యర్థులకు విద్య, ఉద్యోగాల పరంగా స్థానికత కల్పించే అధికారాన్ని కేంద్రప్రభుత్వం ఏపీ సర్కార్‌కు కట్టబెట్టింది. తెలంగాణ నుంచి తరలివచ్చే అభ్యర్థులు ఏపీలోని 13 జిల్లాల పరిధిలో ఎక్కడ నివాసం ఏర్పరుచుకున్నా అక్కడి స్థానికులతో సమానంగా పరిగణించబడతారు.

 

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న సచివాలయాన్ని పదేళ్లపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంచింది కేంద్రప్రభుత్వం. అయితే తదనంతర కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మాకాంను విజయవాడకు మార్చారు. ఆయనతో పాటు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు బెజవాడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా జూన్ 27లోగా అమరావతికి వచ్చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సచివాలయ ఉద్యోగులు ఏపీకి తరలిరావడానికి ఉన్న ప్రధాన అడ్డంకి "స్థానికత".

 

ఉమ్మడి రాష్ట్రంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరువాత అన్ని ప్రాంతాల వారికి స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్లు కల్పించేందుకు గానూ 1973లో అప్పటి కేంద్రప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి "371(డి)" నిబంధనను తీసుకువచ్చింది. 1974లో ఇది అమల్లోకి వచ్చి, 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి 4వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాప్రాంతానికి చెందిన ఉద్యోగులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో స్థిరపడ్డారు.  వీరి పిల్లలు ఇక్కడే చదివి ఉండటంతో వారు తెలంగాణ స్థానికత కలిగిఉన్నారు. ఉన్నపళంగా ఏపీకి తరలివస్తే తమ పిల్లల భవిష్యత్ ఏంటని వారు ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవడంతో ఆయన ఏజీ సలహా మేరకు స్థానికత మార్గదర్శకాల్లో సవరణ చేయాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు.

 

కేంద్రం ఫైలును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు పంపడంతో పరిశీలించిన రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల(ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వులు-1974ను సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల (ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వులు-2016గా పరిగణిస్తారు. 1974 ఉత్తర్వుల్లోని 4వ పేరాగ్రాఫ్‌లో సబ్ పేరా 2 తర్వాత సబ్ పేరా 1,2లకు సంబంధం లేకుండా 2014 జూన్ 2 నుంచి మూడేళ్లలోపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నా అక్కడి స్థానికులతో సమానంగా పరిగణింపబడతారు.

 

ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యూలేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఉత్తర్వులు-1975ను సవరిస్తూ తాజాగా ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ ఉత్తర్వులు-2016ను రాష్ట్రపతి జారీ చేశారు. దీని ప్రకారం పేరా 7లో సబ్ పేరా 2 తర్వాత సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా..తెలంగాణ నుంచి ఏపీలోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వచ్చేవారిని ఏపీ స్థానిక అభ్యర్థిగా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో నివసించే స్థానికులతో సమానంగా పరిగణింపబడతారని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గెజిట్‌లో పొందుపరిచింది. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు పెద్ద ఉపశమనం లభించినట్లైంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.