బంగారు తెలంగాణ సాధన దిశగా...

Publish Date:Jun 2, 2016

Advertisement

 

తరతరాలుగా సొంత రాష్ట్రం కోసం..స్వపరిపాలన కోసం అస్థిత్వ పోరాటం సాగించిన అనంతరం సాకారమైన 60 ఏళ్ల కల తెలంగాణ వచ్చిన రోజు..అదే జూన్..2. ఇది ఎవరి ఘనతా కాదు..యావత్తు తెలంగాణసాగించిన అపూర్వ పోరాటాల ఫలం..రాష్ట్ర ఏర్పాటును ఓ అనివార్యతగా మార్చేసిన అద్భుతమైన ప్రజాపోరు. నీళ్లు, నిధులు, నియామకాలు, యాస, సంస్కృతుల కోసం సాగించిన అద్వీతీయ ప్రజాందోళన ఇది. నెత్తుటి చుక్క చిందకుండా ఓ లక్ష్యం ముద్దాడిన చరిత్ర ఇది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఆ సమయంలో తెలంగాణ నినాదాన్ని భుజానికెత్తుకున్న టీఆర్ఎస్‌ పార్టీనే ప్రజలు నమ్మారు. ఉద్యమనాయకుడే..తొలి ప్రభుత్వాధినేత అయ్యారు. ఉద్యమ నాయకుడిగా జనాన్ని నడిపించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలనలోనూ సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. అన్నీ తానై దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో..వారి ఆశలు, ఆకాంక్షలేమిటో తెలిసిన నాయకుడిగా సంక్షేమ
పథకాలకు రూపకల్పన చేశారు.

 

చిన్న రాష్ట్రం ఎన్నటికీ కుదురుకోలేదని..విడిపోతే వికలమైపోతుందనీ..శాంతి భద్రతల నుంచి కరెంట్ కష్టాల వరకు సమస్యలు చుట్టుముట్టి రాష్ట్రంగా మనగలగడమే కష్టమన్న స్థితి నుంచి రాష్ట్రమంటే ఇలా ఉండాలి అనేంతగా కేసీఆర్‌ తెలంగాణను నడిపిస్తున్నారు.  రాష్ట్ర భవిష్యత్‌కు బంగారు బాటలు వెయ్యటంలో పరిణితి చెందిన వ్యక్తిగా రాణిస్తున్నారు. అటు రాజకీయంగానూ, ఇటు పరిపాలనాపరంగానూ తనకు ఎదురులేకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చే శక్తి తాగునీరు, సాగునీరుల్లోనే ఉన్నాయని గ్రహించిన గులాబీ దళపతి ఆ దిశగా భారీ బాధ్యతలను నెత్తుకున్నారు. కాకతీయుల కాలంలో కీలకభూమిక పోషించిన చెరువులకు తిరిగి జవజీవాలనివ్వాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ పేరుతో మళ్లీ చెరువులకు పునర్వైభవాన్ని కల్పించేందుకు కష్టపడుతున్నారు. ఈ సారి వర్షాలు సాధారణ స్థాయిలో కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో చెరువులన్నీ జలకళను సంతరించుకోనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరును అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ను చేపట్టారు కేసీఆర్. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీళ్లు అందించి ఏ ఆడబిడ్డా నీటి కోసం నెత్తిన బిందె పెట్టుకుని రోడ్డెక్కకూడదన్నది ముఖ్యమంత్రి ఆశయం.

 

ఐడీహెచ్‌ కాలనీలో పర్యటించిన వేళ పేదవాడి గూడును చూసి చలించిన కేసీఆర్ బడుగుజీవి ఆత్మగౌరవంతో బతకాలని ఆకాంక్షించారు. అందుకే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టించి ఉచితంగా అందజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంపై దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకున్నారు కేసీఆర్. కొత్త పెట్రోలింగ్ వాహనాలు అందజేసి నేరాల అదుపుకు కృషిచేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పోలీసులకు , ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. త్వరలో అగ్రరాజ్యాలతో పోటీపడేలా కమాండ్ కంట్రోల్ నిర్మించేందుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆసరా  ఫించన్ల ద్వారా వృద్ధులు, వికలాంగుల కళ్లలో వెలుగులు నింపారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేయ్యాలంటే ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదు. అందుకే ఎస్సీ, ఎస్టీ, మైనారిటి యువతుల సంక్షేమం కోసం షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాల ద్వారా పేద తల్లిదండ్రుల భారం తనదిగా భావించి తండ్రిగా మారారు. శిశు మరణాల రేటును తగ్గించేందుకు కేసీఆర్ నడుం బిగించారు. గతంలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 38 మరణాలుగా ఉండగా ఇప్పుడది 28కి తగ్గింది. రాష్ట్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రారంభించింది.

 

హాస్టల్‌లో చదువుకునే విద్యార్థులకు ఇది వరకు ముక్కిపోయిన బియ్యం, రేషన్ బియ్యాన్ని భోజనంగా పెట్టేవారు. కాని కేసీఆర్ ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు. నా మనవడు ఏ బియ్యం తింటాడో అదే బియ్యం హాస్టల్ బిడ్డలకు పెట్టాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యంతో హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టిన ఘనత దక్కించుకుంది తెలంగాణ. ఏ రాష్ట్రానికైనా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివి. సంక్షేమాన్ని విజయవంతంగా అమలు చేసిన కేసీఆర్ ఆర్థికాభివృద్ధిపైనా దృష్టిపెట్టారు. తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్‌కు రావాల్సిన వివిధ సంస్థలు, ఇక్కడున్న పరిస్థితితో ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయి. మళ్లీ ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 2014 నవంబర్ 27న టీఎస్ ఐపాస్‌కు చట్టబద్ధత కల్పించారు. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా సింగిల్ విండ్ విధానాన్ని బలోపేతం చేస్తూ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు రూ.35 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

 

వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు టీ-హబ్ పేరిట దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు కేసీఆర్ రూపకల్పన చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపి వారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవిధంగా ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి ఐటీ దిగ్గజాలు తమ కార్యకలాపాలకు కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. పాలనలో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ ఫైబర్ గ్రిడ్, రాష్ట్ర వ్యాప్తంగా 4జీ సేవలు, ముఖ్య నగరాల్లో వైఫై సేవలు, ఈ-గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య తదితరాలకు పెద్దపీట వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమ నినాదంలో అత్యంత కీలకమైన నియామకాలపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. ఈ ఏడాది మరి కొన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ఆదేశాలిచ్చారు.

 

మరోపక్క చాలి చాలని జీతాలతో బతుకు బండిని ఈడుస్తున్న ప్రభుత్వోద్యోగులకు భారీగా ఫిట్‌మెంట్ పెంచి వారి జీతాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం చేశారు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందనే అపోహల్ని పటాపంచలు చేసేందుకు కేసీఆర్ తన తొలి ప్రాథాన్యతను విద్యుత్ రంగానికే ఇచ్చారు. కొత్త ప్రాజెక్ట్‌లు, విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్రానికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఇలా ప్రతీ రంగంలోనూ కేసీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తూ బంగారు తెలంగాణ  సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆయన కృషి ఫలించాలని ఆకాంక్షిస్తూ..తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.