Publish Date:Mar 27, 2026
ప్రపంచ క్రికెట్ రంగంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఒక్కో ఐపీఎల్ ఫ్రాంఛైజీ విలువ కోట్ల రూపాయలు ఉంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు 15 వేల నుంచి. 16 వేల కోట్ల రూపాయల విలువకు చేరుకున్నాయి. దాదాపు ఫ్రాంచైజీలన్నిటికీ ఐపీఎల్ అద్భుత ఆదాయాన్ని ఇచ్చింది. అయితే కొందరికి మాత్రం ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానులు వివాదాలు, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఐపీఎల్ అంటేనే వారికి ఒక పీడకలలా మారింది. ఐపీఎల్ ఆరంభంలో జట్లను కొనుగోలు చేసిన కొందరు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ దురదృష్ట వంతులు ఎవరని చూస్తే మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు విజయ్ మాల్యా.
. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సుమారు రూ. 450 కోట్లకు కొనుగోలు చేసిన మాల్యా.. ప్రస్తుతం పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దేశం విడిచి పారిపోయి లండన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నాడు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా దేశ ప్రజల దృష్టిలో నిలిచాడు.
ఇక ఆ తరువాత డక్కన్ క్రానికల్ అధినేత టి. వెంకట్రామిరెడ్డి. ఆయన అప్పట్లో హైదరాబాద్ ఫ్రాంచైజీని డెక్కన్ చార్జెస్ పేరుతో కొనుగోలు చేశారు. డెక్కన్ చార్జన్ ఐపీఎల్ రెండో సీజన్ విజేతగా నిలిచింది. గిల్ క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్ వంటి స్టార్ ప్లేయర్లతో కళకళలాడిన ఆ జట్టు నిర్వహణ లోపాల కారణంగా కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. తరువాత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆ జట్టు ఉనికిలోనే లేకుండా పోయింది. టి.వెంకట్రామిరెడ్డి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో ప్రస్తతం హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ చేతికి వెళ్లింది అలాగే , రాజస్థాన్ రాయల్స్ మాజీ వాటాదారులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకూడా వివాదాల్లో చిక్కుకుని ఫ్రాంచైజీని వదులు కున్నారు. అయితే ఇలా నష్టపోయిన వారంతా వారి వారి స్వయంకృతాపరాధాల వల్లే నష్టపోయారు అని చెప్పాలి.
ఐపీఎల్ మాత్రం ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా ఎదిగింది. యాజమాన్యాలు భారీ పెట్టుబడులతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వేల కోట్ల వ్యాపారం మరింత పుంజుకునే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. క్రికెట్ ఒక మతంగా మారిన ఇండియాలో ఐపీఎల్ కు ఆదరణ దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-ipl-brought-profits-to-everyone-36-216261.html
డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రముఖ నాయకులపై నిస్సిగ్గుగా విమర్శలు చేసినందుకు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో కోర్టులో అతనికి తక్షణమే బెయిల్ లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 ప్రముఖ AI టూల్స్ యొక్క బలహీనతను వాడుకుని హాకర్లు భారీ బాట్నెట్ నెట్వర్క్లను సృష్టిస్తున్నారు. హాలూస్క్వాటింగ్ (HalluSquatting) అనే ఈ సరికొత్త సైబర్ ముప్పు గురించిన పూర్తి వివరాలు మీకోసం.
2026 సంవత్సరంలో ఉక్కపోత మరియు వేసవి ఎండలను తరిమికొట్టే సరికొత్త షార్క్, డైసన్ మరియు డ్రియో కంపెనీల టాప్ 5 కూలింగ్ ఫ్యాన్స్ వివరాలు, ధరలు మరియు వాటిలోని AI మోషన్ ట్రాకింగ్, వాటర్ మిస్ట్ టెక్నాలజీ ప్రత్యేకతలు మీకోసం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫలితాల తర్వాత గ్లోబల్ చిప్ మార్కెట్లో భారీ పతనం. అమెరికా వాల్ స్ట్రీట్లో ఇంటెల్, ఏఎండీ, శాన్డిస్క్ షేర్లు కుప్పకూలాయి. నాస్డాక్ 500 పాయింట్లు పడిపోవడానికి గల పూర్తి కారణాలు, చమురు ధరల పెరుగుదల వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీసీఆర్డీఏ భారీ ఊరటనిచ్చింది. ఎకరాకు రూ. 40,000 కౌలు పెంపు, మరో 15 ఏళ్ల పొడిగింపుతో పాటు రూ. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ నిజాలు, ఆ బాటిల్ ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.
ఫీఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ ముందు ఊహించని పరిణామం క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, మరియు హోస్ట్ యూఎస్ఏ జట్లు టోర్నీ నుండి అవుట్ కావడంతో క్వార్టర్ ఫైనల్ టికెట్ల ధరలు భారీగా పడిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భారత్ ఘోర ఓటమి తర్వాత సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించడంపై వివాదం చెలరేగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వివరణ, స్టేడియం బయట ఫ్యాన్స్ హంగామా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) మరియు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉపయోగించి దీర్ఘకాలంలో కోట్ల రూపాయల సంపదను ఎలా సృష్టించాలో ఉదాహరణలతో సులభంగా తెలుసుకోండి.
బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో 14 చిన్న తరహా అణు రియాక్టర్ల (SMR) ఏర్పాటు కోసం పోలిష్ బిలియనీర్ 35 బిలియన్ పౌండ్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. AI డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు చూడండి.
హోమ్ సెక్యూరిటీ కెమెరాలు అనవసరమైన ఖర్చు అనుకుంటున్నారా? అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు గోడ దూకిన ఈ భయంకరమైన నిజ జీవిత సంఘటన మరియు కెమెరాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడే చదవండి.
బిట్డిఫెండర్ ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్తో ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయండి. బడ్జెట్ ధరలో $1 మిలియన్ ఇన్సూరెన్స్, డార్క్ వెబ్ మానిటరింగ్ మరియు క్రెడిట్ అలర్ట్స్ పొందే పూర్తి వివరాలు మీకోసం.