Publish Date:Mar 27, 2026
ప్రపంచ క్రికెట్ రంగంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఒక్కో ఐపీఎల్ ఫ్రాంఛైజీ విలువ కోట్ల రూపాయలు ఉంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు 15 వేల నుంచి. 16 వేల కోట్ల రూపాయల విలువకు చేరుకున్నాయి. దాదాపు ఫ్రాంచైజీలన్నిటికీ ఐపీఎల్ అద్భుత ఆదాయాన్ని ఇచ్చింది. అయితే కొందరికి మాత్రం ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానులు వివాదాలు, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఐపీఎల్ అంటేనే వారికి ఒక పీడకలలా మారింది. ఐపీఎల్ ఆరంభంలో జట్లను కొనుగోలు చేసిన కొందరు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ దురదృష్ట వంతులు ఎవరని చూస్తే మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు విజయ్ మాల్యా.
. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సుమారు రూ. 450 కోట్లకు కొనుగోలు చేసిన మాల్యా.. ప్రస్తుతం పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దేశం విడిచి పారిపోయి లండన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నాడు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా దేశ ప్రజల దృష్టిలో నిలిచాడు.
ఇక ఆ తరువాత డక్కన్ క్రానికల్ అధినేత టి. వెంకట్రామిరెడ్డి. ఆయన అప్పట్లో హైదరాబాద్ ఫ్రాంచైజీని డెక్కన్ చార్జెస్ పేరుతో కొనుగోలు చేశారు. డెక్కన్ చార్జన్ ఐపీఎల్ రెండో సీజన్ విజేతగా నిలిచింది. గిల్ క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్ వంటి స్టార్ ప్లేయర్లతో కళకళలాడిన ఆ జట్టు నిర్వహణ లోపాల కారణంగా కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. తరువాత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆ జట్టు ఉనికిలోనే లేకుండా పోయింది. టి.వెంకట్రామిరెడ్డి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో ప్రస్తతం హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ చేతికి వెళ్లింది అలాగే , రాజస్థాన్ రాయల్స్ మాజీ వాటాదారులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకూడా వివాదాల్లో చిక్కుకుని ఫ్రాంచైజీని వదులు కున్నారు. అయితే ఇలా నష్టపోయిన వారంతా వారి వారి స్వయంకృతాపరాధాల వల్లే నష్టపోయారు అని చెప్పాలి.
ఐపీఎల్ మాత్రం ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా ఎదిగింది. యాజమాన్యాలు భారీ పెట్టుబడులతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వేల కోట్ల వ్యాపారం మరింత పుంజుకునే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. క్రికెట్ ఒక మతంగా మారిన ఇండియాలో ఐపీఎల్ కు ఆదరణ దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-ipl-brought-profits-to-everyone-36-216261.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్లైన్లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.