ఏపీకి క్యూ కట్టనున్న దిగ్గజ సంస్థలు.. గెట్ రెడీ.. అధికారులతో చంద్రబాబు

Publish Date:Jan 25, 2025

Advertisement

దావోస్ పర్యటనకు ఆర్భాటంగా వెళ్లి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు చంద్రబాబు. దావోస్ వేదికగా జరిగి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ఏకైక అజెండాగా వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సదస్సు జరిగినన్ని రోజులూ క్షణం తీరక లేకుండా దిగ్గజ సంస్థల అధిపతులతో చర్చోపచర్చలు జరిపింది. సదస్సు ముగిసిన తరువాత విజయ హాసంతో చంద్రబాబు, ఆయన బృందం తిరిగి వచ్చింది. 

అయితే వైసీపీ నేతలు మాత్రం దావోస్ పర్యటనలో చంద్రబాబు విఫలం, ఒక్క రూపాయి పెట్టుబడి రాష్ట్రానికి తేలేకపోయారంటూ ఇష్టారీతిగా నోరు పారేసుకుంది. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఏడు నెలలో దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వెతుక్కుంటూ వచ్చాయన్న విషయాన్ని వైసీపీ నేతలు కన్వీనియెంట్ గా మరిచిపోయారు. దావోస్ సదస్సులో ఒక్కటంటే ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోలేకపోయారంటూ చంద్రబాబు, లోకేష్ మీద ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. వాటన్నిటికీ చంద్రబాబు దీటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పర్యటనను ముగించుకుని శుక్రవారం (జనవరి 24) సాయంత్రానికి అమరావతి చేరుకున్నారు.  అదే రోజు తన అధికారిక నివాసంలో   ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  ఈ సందర్బంగా చంద్రబాబు   ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకే తాను దావోస్ వెళ్లానని ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశాననీ చెప్పారు.  

ప్రభుత్వం తరఫున తాము ఇచ్చిన ప్రజెంటేషన్లను సావధానంగా విన్న దిగ్గజ సంస్థల అధిపతులు, ప్రతినిధులు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపారని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో దిగ్గజ సంస్థల ప్రతినిధి బృందాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. వారు వచ్చినప్పుడు… వారికి అవసరమైన వివరాలను సమగ్రంగా అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పిందే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. దావోస్ లో తాము చేసిన కృషికి కొనసాగింపుగా పకడ్బందీ చర్యలు చేపడితే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తడం ఖాయమేనని, ఆ దిశగా సిద్ధం కావాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

By
en-us Political News

  
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకు ఒక సారి వచ్చే మహా కుంభ మేళా ఈ నెల 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచీ భక్తులు వెల్లువలా తరలి వస్తున్నారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మహా కుంభమేళాకు వెళ్లే భక్తులతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ అంచనాలకు మించి భక్తుల రద్దీ ఉండటంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు.
అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్యసత్యేంద్ర దాస్ భౌతిక కాయాన్ని సరయు నదిలో జలసమాధి చేశారు.
తెలంగాణలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలో కూనారిల్లుతోంది. ఆ పార్టీకి రాష్ట్రంలో బలం ఉంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష ఆ పార్టీ హైకమాండ్ కు మెండుగా ఉంది. అందుకే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ  పూర్తి అయిన నేపథ్యంలో  వాటి గూర్చి రాహుల్ కు వివరిస్తున్నట్టు సమాచారం.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు ప్రారంభించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి త్వరలో అమరావతిలో కూడా ఏర్పాటు కాబోతోంది.
అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమల దేవుడి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ఆంక్షలు విధించింది. గతంలోలా కాకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు మాత్రమే యథావిథిగా అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది.
 గన్నవరం మాజీ  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఎపి పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ రాయదుర్గంలోని ఆయన ఇంట్లో  వంశీ సెల్ ఫోన్ కోసం సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికలలో ఘోర పరాజయంతో వైసీపీ పనైపోయిందన్నది స్పష్టమైపోయింది. నభూతో న భవిష్యత్ అన్న రీతీలో ఐదేళ్ల అధికారంలో ఉన్న పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించి జనం మీ సేవలింక చాలు అని విస్పష్టంగా జగన్ కు తేల్చి చెప్పారు.
వైసీపీ ఆవిర్భావమే సెంటెమెంటును అడ్డం పెట్టుకుని జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్ లో ఫలించకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని తండ్రిని కోల్పోయిన కొడుకును అంటూ జనంలోకి వచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయడ్డారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన హడావుడిగా హస్తిన పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.