భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రాయానికి ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా.!

Publish Date:Jul 14, 2026

Advertisement

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి  ప్రతిష్టాత్మక  ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు హోదా ఇస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం (జులై 14) గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.  ఇమ్మిగ్రేషన్,  విదేశీయుల చట్టం 2025 పరిధిలోని సెక్షన్ 4(1) ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో దేశంలోని కేటగిరీ 1 అధీకృత అంతర్జాతీయ విమానాశ్రయాల జాతీయ రిజిస్ట్రీ జాబితాలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు 39వ స్థానం లభించింది. ఈ తాజా హోదాతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు, విదేశీ ప్రయాణికులకు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, వీసా చెకింగ్ వంటి ఇమ్మిగ్రేషన్ సేవలు అందించేందుకు చట్టబద్ధమైన మార్గం సుగమమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల తర్వాత ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా దక్కించుకున్న మూడవ విమానాశ్రయంగా భోగాపురం నిలిచింది. ఈ పరిణామం   కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్  ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నెల 10న  న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రతిష్టాత్మక లైసెన్స్ పత్రాలను జీఎంఆర్  ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి ఎయిర్‌పోర్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఈ లైసెన్స్ స్పష్టం చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనలు, పర్యవేక్షణలో రాబోయే పాతికేళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని అత్యంత వేగంగా లాంచ్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.

జీఎంఆర్ గ్రూప్ సుమారు 4 వేల 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో,   2వేల 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని  నిర్మించింది. ఈ విమానాశ్రయం వార్షికంగా దాదాపు 4 కోట్ల మంది  ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైనయ్యింది. ఇక్కడి టెర్మినల్ భవనం వైశాల్యం 78,000 చదరపు మీటర్లుగా ఉంది. దీని నిర్మాణ శైలి సముద్రంలో ఎగిరే చేప   ఆకారంలో ఉండటం విశేషం.  టెర్మినల్ లోపలి   వెలుపలి డిజైన్లు ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్ర దాయాలు   వైభవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ప్రయాణికులు వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవడానికి వీలుగా విశాఖపట్నం బీచ్ రోడ్ మార్గం ద్వారా భోగాపురానికి ప్రత్యేక కనెక్టివిటీ రూట్‌తో పాటు మొత్తం 7 అనుసంధాన రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

జూలై చివరి నాటికి  ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్  ప్రారంభం కానుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే విజయనగరం జిల్లా కలెక్టర్,  జీఎంఆర్ ఉన్నతాధికారులతో ఎయిర్‌పోర్ట్ లాంజ్, రన్‌వే, అప్రోచ్ రోడ్లపై సమగ్ర సమీక్ష నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. విమానాశ్రయం ప్రారంభమైన వారం రోజుల నుంచే ఇక్కడ పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.  

 Immigration Check Post Status to Bhogapuram Airport,  Rammohan Naidu, Alluri Sitarama Raju Airport, Bhogapuram Airport Inauguration, GMR Bhogapuram Greenfield Airport

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన శకం ముగిసింది.
టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు.
కన్న కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లి గుండె, నేడు శోకసంద్రమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ RAW NTR (రా-ఎన్టీఆర్) పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు
తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది.
రూ.2 లక్షల లంచంతో ఏఈ దొరికేశాడు..
సార్, ఒకసారి హగ్ చేసుకోవచ్చా.. యువ వైద్యుడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి విజయ్..!
ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
పాతబస్తీకి చెందిన రెండు కుటుంబాలు లులు మాల్ సెల్లార్ పార్కిం గ్‌లో ఒక్కసారిగా వాగ్వాదా నికి దిగారు. గొడవ తీవ్రరూ పం దాల్చుతున్నట్లు గుర్తిం చిన మాల్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.