ఈ నాలుగు పనులు చేస్తే  100ఏళ్ల ఆయుష్షు గ్యారెంటీ అంట..!

Publish Date:Nov 26, 2024

Advertisement


 

కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.  ఎక్కువ కాలం బ్రతకాలంటే శరీరం దృఢంగా ఉండాలి.  ఇందుకోసం మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అంటుంటారు. అయితే ఆహారం వివిధ రకాలుగా ఉంటుంది.  శాకాహారం,  మాంసాహారం అనే వర్గాలు అందరికీ తెలిసినవే.. శరీరం బాగా దృఢంగా ఉండాలంటే మాంసాహారం బాగా తినాలని అంటుంటారు కొందరు. కానీ 114ఏళ్ల  వయసున్న ఒక బామ్మ తన ఆయుష్షు వెనుక రహస్యాన్ని బయట పెడుతూ నాలుగు పనులు చేయడం  వల్లే తనకు దీర్ష ఆయుష్షు లభ్యమైందని, తను వాటిని ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అంత శక్తి వంతమైన ఆ నాలుగు పనులు  ఏంటో తెలుసుకుంటే..


నవోమి వైట్ హెడ్ అనే వృద్ధురాలి వయసు అక్షరాలా 114 ఏళ్ళు.  ఆమె పెన్సిల్వేనియాలో నివసిస్తుంది.  అమెరికా దేశంలోకెల్లా జీవించి ఉన్న అతిపెద్ద వయస్కురాలు ఈమెనె. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆమె తన 114వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో  జరుపుకుంది. 1910లో జన్మించిన ఈమె అన్నేళ్లు జీవించడం వెనుక నాలుగు రకాల కూరగాయల తో పాటు కొన్ని పనులు కూడా సహాయపడ్డాయట.

ఇంటి కూరగాయలు..

బామ్మగారు తను ఆహారంలో తినే కూరగాయలను తనే తన ఇంటి పెరట్లో పండించుకునేవారట.  ప్రతి కూరగాయను తన ఇంటి వెనుక ఉన్న స్థలంలో ఒక చిన్న తోట పెంచి అందులో పండించుకునే వారట. దీని వల్ల రసాయలనాలు లేని కూరగాయలను ఆహారంలో సాధ్యమైంది.  ఒక వేళ ఇంటి పెరడు లేకపోతే కనీసం మిద్దెతోట వంటివి ఏర్పాటు చేసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని అంటున్నారు.

చెడు అలవాట్లు..

చాలామంది చెడు అలవాట్ల కింద మద్యపానం, ధూమపానం ను చెబుతుంటారు.  ఇవి మనిషి ఆయుష్షును తగ్గిస్తాయి.  మద్యపానం., ధూమపానానికి దూరం ఉండేవారు దీర్ఘకాలం జీవించవచ్చని అంటున్నారు.

చురుకుదనం..

శారీరకంగా చురుకుగా ఉండటం ఎంతో ముఖ్యం.  ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత ఆయుష్షు అంటున్నారు.  ప్రతి రోజూ వ్యాయామం చేయడమే కాకుండా వీలైనన్ని పనులు సొంతంగా చేసుకోవడం వల్ల శరీరం బాగా ఫిట్ గా తయారవుతుంది.  ఇది ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది.

ఆహారం..

శరీరానికి శక్తికి మూల వనరు ఆహారమే.. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. సొంతంగా పండించుకున్న కూరగాయలను వండుకోవాలి.  ఇంటి ఆహారమే తినాలి.  బయటి ఆహారం అస్సలు తినకూడదట.  ముఖ్యంగా ఇప్పట్లో బాగా అమ్ముడుపోతున్న పిజ్జాలు,  బర్గర్లు,  ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినకూడదని బామ్మగారు చెప్పారు.  సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.


                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.