మహాత్ముడితో పుట్టిన మహానుభావుడు!

Publish Date:Oct 2, 2016

Advertisement

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ... ఈ పేరుకి ఇండియాలో ఇంట్రడక్షన్ అక్కర్లేదు! మన మనీ నోట్ల మీద మొదలు మనస్సుల్లో దాకా ఆయన అంతటా వుంటారు! మహాత్ముడిగా మనకు తరతరాలకు సరిపడా ప్రేరణనిచ్చారు. అలాగే జాతిపితగా... గాంధీ భారతీయతలో అవిభాజ్యమైన అంతర్భాగం అయ్యారు! అసలు ఒక్కసారి ఆలోచించండి... గాంధీ పేరు చెప్పకుండా ఆధునిక భారత చరిత్ర మీరేం చెబుతారు? కుదరని పని... 


అక్టోబర్ రెండు అనగానే మనకు ఠక్కున గాంధీ జయంతి జ్ఞాపకం వస్తుంది. అది సంతోషకరమే! కాని, గాంధీ పుట్టిన రోజునే మరో గాంధేయవాది జన్మించిన సంగతి చాలా మందికి తెలియదు. పైగా గాంధీతో బర్త్ డే షేర్ చేసుకున్న ఆయన నిఖార్సైన గాంధేయవాది కూడా! అసలు ఒక్కమాటలో చెప్పాలంటే... గాంధీ మాటలతో ఏం చెప్పాడో, ఎలా వుండమన్నాడో.. అలా ఆజన్మాంతం ఆచరించిన ఆదర్శ పురుషుడు! అతనే మాజీ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి! 


లాల్ బహదూర్ శాస్త్రి కేవలం మహాత్ముడు పుట్టిన అక్టోబర్ రెండున పుట్టిన వాడు మాత్రమే కాదు. ఆ మహాత్ముడితో సమానమైన మహానుభావుడు కూడా! తన పేరులోని శాస్త్రి ఊరికే కులం ఆధారంగా ఆయన పెట్టుకోలేదు. ఆ శాస్త్రి అన్నది లాల్ బహదూర్ కఠిక దారిద్ర్యాన్ని జయించి సాధించిన విద్యార్హత వల్ల వచ్చింది! అవును, ఆయన చదివిన ఉన్నత చదువుల కారణంగా శాస్త్రి బిరుదు ఆయనకు వచ్చింది! 


లాల్ బహదూర్ శాస్త్రి చిన్న నాటి కథనం ఒకటి ప్రచారంలో వుంది. ఆయన స్కూలుకి వెళ్లే కాలంలో నది దాటి వెళ్లాల్సి వచ్చేది. అందుకు పడవ వాడికి రోజుకు కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కాని, చాలా మంది గొప్ప వాళ్లలాగే శాస్త్రిజీ కూడా పుట్టుకతో కఠిక పేదరికం అనుభవించారు. అందుకే ఓ రోజు నది దాటేందుకు పడవ వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన వద్ద లేకపోయాయి. మళ్లీ ఇస్తానంటే నది దాటించే వాడు అవమానకరంగా మాట్లాడాడు. దాంతో ఆత్మాభిమానం కలిగిన లాల్ బహదూర్ శాస్త్రి మళ్లీ ఏనాడూ... ఏళ్ల తరబడి... పడవ ఎక్కనే లేదు! ప్రతీ రోజు నది ఈదుకుంటూ వెళ్లి చదువుకుని వచ్చేవాడు! అంతటి ఆత్మభిమానం , పట్టుదల వున్న వాడు కాబట్టే ఆయన తరువాతి కాలంలో దేశ ప్రధాని కాగలిగారు, పాక్ పీచమణచగలిగారు!


అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి పీఎం అయ్యాక కూడా చాలా సాదాసీదాగా వుండేవారని అంటారు! ఎంతగా అంటే , తన బట్టలు తానే పిండుకునేవారట ఆయన! ఇక నెహ్రు కాలంలో అప్పటికే దెబ్బతిన్న పాకిస్తాన్ తన వక్ర బుద్ది పోనించుకోక దండెత్తి వచ్చింది శాస్త్రిగారి శకంలో కూడా! అప్పడే భీకర యుద్దం జరుగుతుండగా ఆయన జై జవాన్...జై కిసాన్ చారిత్రక నినాదం ఇచ్చారు! 


శాస్త్రి జీ ఇచ్చిన స్వేచ్ఛతో తన అస్త్ర, శస్తాలన్నీ బయటకు తీసి విజృంభించింది భారత ఆర్మీ. ఫలితంగా మన సేనలు పాక్ చేతిలో వున్న కార్గిల్ ప్రాంతం స్వాధీనం చేసుకోవటమే కాకుండా లాహోర్, కరాచీల్ని కూడా కంట్రోల్ లోకి తెచ్చుకున్నాయి. అయినా అప్పటి సూపర్ పవర్ రష్యా కొద్దిగా పాక్ వైపు రాజకీయం నడిపి లాహోర్, కరాచీల్ని తిరిగి ఆ దేశానికి ఇప్పించేసింది! మన కార్గిల్ కూడా తిరిగి ఇవ్వాలని సోవియట్ చెప్పింది. అందుకు శాస్త్రి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. కాని, అనూహ్య పరిణామాల మధ్య ఆయన రష్యాలోని తాష్కెంట్లో హఠాత్తుగా మరణించారు! దీని వెనుక కుట్ర వుందని భావించే వారు ఇప్పటికీ చాలా మంది వున్నారు. 


లాల్ బహదూర్ శాస్త్రి మరణం కొంత మిస్టరీనే అయినా ఆయన జీవితం మాత్రం గొప్ప హిస్టరీ! ఆయన పాక్ పైన తీసుకున్న స్టాండ్ ఇప్పటి మోదీకి కూడా ఇన్ స్పిరేషన్ అనవచ్చు! ఇప్పుడు నమో చేసినట్టే పాకిస్తాన్ ను ఆయన అప్పట్లో గడగడలాడించారు! కాకపోతే, దురదృష్టకరంగా హఠాన్మరణం పాలయ్యారు. అయినా కూడా గాంధీ పుట్టిన తేదీనే పుట్టిన ఆయన గాంధేయ వాదానికి అసలు సిసలు నిదర్శనం! గాంధీయవాదం, అహింస అంటే శత్రవులకి భయపడుతూ, వాళ్లకి లొంగి వుండటం కాదనీ, మనల్ని మనం రక్షించుకుంటూ పక్క వాళ్లని ఇబ్బంది పెట్టకపోవటమేనని.. లాల్ బహదూర్ బహు గొప్ప నిరూపించారు! అదే ఇప్పటికీ, ఎప్పటికీ భారతీయులందరికీ గొప్ప పాఠం! 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.