గాంధీ భవన్‍లో తీవ్ర ఉద్రిక్తత...మల్లు రవి, కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!

Publish Date:May 24, 2026

Advertisement

 

తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల అంతర్గత సమీక్షా సమావేశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బూత్ లెవెల్ ఏజెంట్ల  పనితీరు, క్షేత్రస్థాయి నివేదికలపై చర్చించేందుకు హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్ మరియు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన ఈ కీలక సమావేశం ఏర్పాటయింది. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటా మాటా పెరిగి గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

వివాదానికి ప్రధాన కారణం గోషామహల్ నియోజకవర్గ అంతర్గత రాజకీయాలేనని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గోషామహల్ నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి సునీతా రావుకు సమాచారం లేకుండా, ఆమె సమక్షం లేకుండా ఈ నియోజకవర్గ సమీక్షను ఎలా నిర్వహిస్తారంటూ స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ హోదాలో ఉన్న మల్లు రవిని నేరుగా నిలదీస్తూ నిరసనకు దిగారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నేతలను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేటర్లు ఒక్కసారిగా నిలదీయడంతో మల్లు రవి సైతం తీవ్ర అసహనానికి గురయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏవైనా సమస్యలు ఉంటే పద్ధతి ప్రకారం తన దృష్టికి తీసుకురావాలని, అంతే తప్ప ఇలా బాధ్యతారాహిత్యంగా అరుస్తూ గొడవ చేయడం తగదని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు మరింత ముదిరాయి. తాను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ అని, తన ముందే క్రమశిక్షణ తప్పి ఇలాంటి రచ్చ చేస్తారా అంటూ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంతో గాంధీ భవన్ ప్రాంగణంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బూత్ స్థాయి ఏజెంట్ల 100 శాతం పనితీరును సమీక్షించాల్సిన సమావేశం కాస్తా, నేతల అంతర్గత విభేదాల వేదికగా మారిపోయింది. హైదరాబాద్ లోని ముఖ్యమైన నియోజకవర్గాల నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం ఈ ఘటనతో మరోసారి బహిర్గతమైంది. క్రమశిక్షణకు మారుపేరైన గాంధీ భవన్ లో సొంత పార్టీ నేతలే ఈ విధంగా వాగ్వాదానికి దిగడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, సభలలో చేసిన వ్యాఖ్యల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత సెక్షన్ల కింద మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉదయం లేచి రైతులు వచ్చి చూసేసరికి ధాన్యం మొత్తం నీటి పాలైంది. అది చూసిన రైతులు కంటతడి పెట్టుకున్నారు.
చిరంజీవి తీవ్ర అనా రోగ్యంతో ఉన్నారని,ఆయన ఆరోగ్యం విషమించిందని తప్పుడు సమాచారంతో వీడియోలు ప్రచారం చేయ డంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
చిన్న వివాదం కాస్తా పెద్ద గొడవగా మారడంతో జెప్టో డెలివరీ బాయ్స్ గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడుతూ రచ్చ రచ్చ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్‌గా పేరుగాంచిన మొయిజుద్దీన్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదాలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన కేసుల్లో ఆయన చురుకుగా వ్యవహరించడంతో కొందరు ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై స్పష్టత లేదు. వేసవి ఎండల తీవ్రత కారణమా, పంట పొలాల్లో ఎవరైనా తుక్కు కాల్చడం వల్ల మంటలు వ్యాపించాయా అన్నది తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్ దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం.
ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.