గురుగ్రామ్ లో ఎన్ కౌంటర్.. నలుగురు గ్యాంగ్ స్టర్లు హతం.!

Publish Date:Jul 10, 2026

Advertisement

దేశ రాజధాని ప్రాంత (NCR)  పరిధిలోని   పారిశ్రామిక నగరం గురుగ్రామ్‌లో  గురువారం (జులై 9) అర్ధరాత్రి జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నలుగురు గ్యాంగ్ స్టర్లు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.  సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో  నేరగాళ్లను పట్టుకునే క్రమంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. నివాస ప్రాంతాల మధ్య జరిగిన ఘటన  స్థానికులను  భయాందోళనలకు గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి.  

ఎస్‌జీటీ (ఎస్జీటీ) యూనివర్సిటీ వ్యవస్థాపకుడి కుమారుడు, ఒక ప్రముఖ వ్యాపారవేత్తను టార్గెట్ చేస్తూ కొంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటూ అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్ నడుపుతున్న గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ పేరుతో ఈ ముఠా భారీగా డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే.. గురువారం (జులై9)  రాత్రి ఒక  ఎస్‌యూవీ  వాహనంలో అత్యాధునిక మారణాయుధాలతో వచ్చిన సాయుధ దుండగులు సదరు వ్యాపారవేత్త నివాస సమీపంలోకి చేరుకున్నారు.వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేసేలా దుండగుల ముఠా ఒక్కసారిగా ఆయన ఇంటిపై కాల్పులు జరపడం ప్రారంభించింది. 

అయితే..  ఈ ముఠా కదలికలపై ముందే నిఘా ఉంచిన గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వాహనాలను చూసిన గ్యాంగ్‌స్టర్లు లొంగిపోవడానికి బదులుగా, తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై   కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు అక్కడికక్కడే మరణించగా, మరో  గ్యాంగ్ స్టర్ తీవ్రంగా గాయపడ్డాడు.   ముగ్గురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.  

Gurugram encounter, gangsters killed, Deepak Nandal gang, police firing

By
en-us Political News

  
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ సతీమణి..!
రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి భారత షట్లర్‌గా ఘనత..!
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.