జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే! ఎస్ఈసీ నిమ్మగడ్డ మనోగతం

Publish Date:Feb 3, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ సర్కార్ మధ్య వార్ ముదురుతోంది.  నిమ్మగడ్డపై చర్యలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సిద్దమవుతుందనే ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డకు.. మరో రాజ్యాంగ బద్ద కమిటితోనే చెక్ పెట్టే స్కెచ్ సీఎం జగన్ టీమ్  వేసిందని తెలుస్తోంది. అయితే ఏపీ సర్కార్ తాజా పరిణామాలపై తన అనుచరుల దగ్గర స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్..  కీలక, ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, జగన్ సర్కార్ తీరుపై ఆయన తన మనోగతం స్పష్టం చేశారు. 
 
ఎస్ఈసీగా తాను ఎన్నికల వ్యవస్థను కాపాడుతున్నానని చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతంలో సహేతుక కారణాలతోనే ఎన్నికలను వాయిదా వేశానని తెలిపారు. పార్టీల పట్ల తనకు పక్షపాతం లేదన్న నిమ్మగడ్డ... తనకు ఎవరితోనూ వ్యక్తిగత వైర్యం లేదన్నారు. వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన అవసరం తనకు అంతకంటే లేదన్నారు. ఎన్నికల వ్యవస్థను కాపాడం కోసం రాజ్యాంగ విధి నిర్వహణలో కమిషనర్ అధికారులను , బాధ్యతను కాపాడం కోసమే  కోర్టులకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు నిమ్మగడ్డ. ఒక వ్యవస్థ, మరో వ్యవస్థలోకి చొరబడటం ప్రజాస్వామ్య వ్సవస్థకు మంచిది కాదన్నారు ఎస్ఈసీ.  భారత రాజ్యాంగ ప్రకారం మూడు వ్యవస్థలు స్వతంత్ర ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి, సాకారం, సమన్వయంతో  పని చేయాల్సి ఉందన్నారు. కార్యనిర్వహణ వ్యవస్థతో తలపడాలని తానెప్పుడు  కోరుకోలేదన్నారు. 

రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నందున.. ఆ విధి నిర్వహణలో భాగంగా  ప్రభుత్వ సహకారంతోనే గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ విడుల చేశామని నిమ్మగడ్డ అన్నారు. కరోనా తదితర కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందిన్నారు.ఇప్పుడు దేశమంతా పరిస్థితులు మారిపోయాయని,  అనేక చోట్ల స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్  ఉప ఎన్నికలు జరుగుతున్నాయని నిమ్మగడ్డ చెప్పారు. మనకు కూడా గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం కోసమే పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తున్నామన్నారు.  రాజ్యాంగ పరిధికి లోబడి.. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తన సన్నిహితులతో చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. 
       
 తాను గవర్నర్ కు రాసిన లేఖలన్ని అధికారకమైనవి, అత్యంత రహ్యస ప్రధానమైనవని చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఆ లేఖల అంశాల ఆధారంగా కొన్ని  వ్యూహాత్మక కథనాలను ఆధారంగా చేసుకుని... మంత్రులు హక్కుల తీర్మానం పెడితే భయపడటానికి తానేమి పిరికివాడిని కానని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో గాని, రాజ్యాంగ పరిరక్షణలో గాని ఎలాంటి  విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి తాని సిద్దమని,  అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . తాను ఎవరి హక్కులు హరించలేదని, తన హక్కులను ఎవరైనా  హరించాలనుకుంటే మాత్రం తగిన మూల్సం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వృత్తి పరంగా తప్పు చేయనంత కాలం.. వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించనంత కాలం తాను నిప్పులాంటి మనిషేనని చెప్పారు నిమ్మగడ్డ. 40 సంవత్సరాల వృత్తి జీవితంలో ఏ తప్పు చేయలేదని తన అనుచరులతో ఆయన స్పష్టం చేశారు.. వ్యక్తిగతంగా తానెవరిని దూషించడం లేదని, ఒకవేళ ఎవరైనా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నస్తే మాత్రం భయపడేది లేదని చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.