కొత్త రాష్ట్రం సందట్లో... హోదా సడేమియాలు!

Publish Date:Jan 30, 2017

Advertisement


అనగనగా ఓ స్వామీజీ దొంగతనం మహాపాపం అన్న అంశంపై గొప్పగా ప్రవచనం ఇస్తున్నారు! వేలాది మంది తన్మయంగా విన్నారు! ఉపన్యాసం పూర్తయ్యాక బయటకి వచ్చి చూసుకుంటే చాలా మంది జేబుల్లోని పర్సులు మాయం అయ్యాయట! అక్కడ స్వామి వారు దొంగతనం చెడ్డ పని అని చెబుతోంటే... ఇక్కడ దొంగలు తమ చేతివాటం చూపారన్నమాట!


నవ్యాంధ్రలో పరిస్థితి సదరు స్వామీ జీ సభలోలాగే వుంది! ఒకవైపు జనం కొ్త్తగా రాష్ట్రం ఏర్పడటం వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ భరిస్తూ వుంటే... వెనక నుంచి తమ పని తాము చేసుకుపోతున్నారు ఆరితేరిన వారు! పైగా ఈ మొత్తం మోసానికి ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ మాంచి గ్లామరస్ పేరు తగిలించారు. పదే పదే యువతను బురదలో దూకమంటూ గావు కేకలు పెడుతున్నారు...


అక్కడెక్కడో జల్లికట్టు ఉద్యమం జరగగానే, ఇక్కడా, మోకాళ్లలో ఆలోచనలు మొదలయ్యాయి. అక్కడ బీచ్ పక్కన జనం కూడారు కాబట్టి ఇక్కడా ఓ బీచ్ వెదికారు. వైజాగ్ కు రమ్మన్నారు. మౌనపోరాటం అన్నారు. కొవ్వుత్తుల ప్రదర్శనన్నారు. హోదా రావాల్సిందేనన్నారు. కాని, జనానికి పిలుపునిచ్చిన వారు చెప్పందేంటంటే, జల్లికట్టు అమలు చేసుకోటానికి ఒక ఆర్డినెన్సు, ఒక బిల్లు చాలు. కాని, ప్రత్యేక హోదా అసాధ్యం. ఏపీకే కాదు ఏ రాష్ట్రానికి ఇకపై హోదాలుండవని కేంద్రం తేల్చేసింది. అయినా ఆనాడు వెంకయ్య అడిగాడు, మన్మోహన్ ఇచ్చాడు అంటూ రెచ్చగొడుతున్నారు మన హీరోలు, పొలిటికల్ హీరోలు!


ప్రత్యేక హోదా ఇవ్వగలిగే అవకాశం వుంటే మోదీ సర్కార్ ఎప్పుడో ఇచ్చేది. కాని, ప్లానింగ్ కమీషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చిన ప్రస్తుత తరుణంలో ప్రత్యేక హోదా గత చరిత్రే. ఇప్పుడు హోదా వున్న రాష్ట్రాలకి కూడా ముందు ముందు పోనుంది. ఇక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటోన్న పవన్ , జగన్ ఆంధ్రా జనాలకి మరో వివరణ కూడా ఇచ్చుకోవాలి. ధశాబ్దాలుగా స్పెషల్ స్టేటస్ అనుభవిస్తున్న జమ్మూ, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయి? అక్కడికి పెట్టుబడులు ఎందుకు పోటెత్తటం లేదు? అలాగే, హోదా ఇవ్వకున్నా ప్యాకేజ్ వల్ల అనేక లాభాలు కలుగుతున్నాయి. వాట్ని కూడా వద్దని భీష్మించుకుంటే ఆ నష్టం ఎవరు పూడుస్తారు? హోదా ఇవ్వకుండా, ప్యాకేజ్ కూడా ఇవ్వకుంటే కేంద్రాన్ని ఎవరైనా ఏం చేయగలరు?


ప్రత్యేక హోదా లాభాలు, సాధ్యాసాధ్యాల గురించి జనంలో స్పష్టమైన అవగాహన తీసుకురాకుండా సముద్ర తీరాన సందడి చేద్దామంటే వీలు కాదు. అంతకంటే మించీ నిరంతరం రాష్ట్రం గురించి మాట్లాడకుండా వున్నట్టుండీ ఊడిపడి ఉద్యమం చే్ద్దామంటే కూడా కుదరదు. వైజాగ్ లో జల్లికట్టు తరహా వీర పోరాటం అన్న పవన్ గాని, జగన్ గాని ఇప్పటికీ హైద్రాబాద్ లోనే వుంటున్నారు. ఏపీలో స్థిరపడిందీ లేదు. అమరావతిలో మకామూ లేదు. ఈ యువ నాయకులిద్దరూ యువతనైతే బీచ్ కి రమ్మన్నారుగాని తాము మాత్రం పూర్తి స్థాయిలో నవ్యాంధ్రకు రావటం లేదు. మరో వైపు, పవన్ కేవలం కేంద్రానిదే తప్పనట్టుగా మాట్లాడటం, జగన్ చంద్రబాబుది మాత్రమే నేరమన్నట్టు మాట్లాడటం కూడా వీళ్ల చిత్తశుద్దిని తేటతెల్లం చేస్తాయి. హోదా తేవటంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ విఫలమైందని పవన్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా అనలేకపోయాడు. అదే రీతిలో జగన్ ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం మోదీ తప్పని ధైర్యంగా చెప్పలేకపోయాడు. ఇందులో ఎవరి ఇబ్బందులు వారివి!


జనసేన పార్టీతో వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున రంగంలోకి దిగుదామని అనుకుంటోన్న పవన్ హోదా నినాదంతో జనంలో వుంటున్నాడు. కాని, పవన్ లాగే అప్పుడప్పుడూ ఉద్యమించే సినిమా వాళ్లు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు... ఎవ్వరూ కేంద్రంపై నిజంగా సీరియస్ గా వున్నట్టు కనిపించదు. తమకు వీలైనప్పుడు , ఖాళీ సమయం దొరికినప్పుడు హోదా అంటూ హోరు సృష్టిస్తున్నారు. మళ్లీ వారం తరువాత అంతా నిశ్శబ్దమే! ఇక పవన్ కంటే కాస్త బెటర్ గా హైద్రాబాద్ వదిలి వైజాగ్ ఎయిర్ పోర్ట్ దాకా వెళ్లిన జగన్ తనకు రాష్ట్ర హోదా కంటే స్వంత హోదానే ఎక్కువని చెప్పకనే చెప్పేశాడు! ఎయిర్ పోర్ట్ లో తానే కాబోయే సీఎం అంటూ బెదిరింపుకి దిగి ప్రత్యేక హోదా అసలు కారణమని కాదని తేల్చేశాడు!


పవన్, జగన్ అభిమానులు తమ నేతలు హోదా రాదని తెలిసి కూడా మభ్యపెడుతున్నారని అంటే ఒప్పుకోకపోచ్చు. కాని, వారిద్దరికి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే దాకా మీడియా ముందు వుండటానికి ఇది గొప్పగా ఉపయోగపడుతోంది. అలాగే, ప్యాకేజీకి ఒప్పుకొని ముందుకు సాగిపోతున్న చంద్రబాబు అనివార్య పరిస్థితి కూడా వారికి కలిసి వస్తోంది. సీఎం ప్యాకేజీ కూడా వద్దని మొండికేస్తే వచ్చేది కూడా పోతుంది రాష్ట్రానికి. అందుకే, ఎన్డీఏలోంచి బయటకి రావటం లేదు టీడీపీ. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే ప్రతిపక్షాలకి కావాల్సినంత పని దొరుకుతుంది. హీరో శివాజీ ఉద్యమాలు మొదలు కేవీపీ ప్రవేశ పెట్టే ప్రైవేట్ బిల్లుల వరకూ అన్నీ ఈ కోవలోకే వస్తాయి. కాని, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం అయిదేళ్లకోసారి జనం చేతిలోనే వుంటుంది. హోదా కోసం హోరు సృష్టిస్తున్న ఎవరెవరి హోదా ఏంటో ఓటర్లే నిర్ణయిస్తారు!


      

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.