రైజింగ్ స్టార్ లోకేష్.. ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీ కథనం.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్   ఐటీ, ఎలక్ట్రానిక్స్  విద్యా శాఖ  మంత్రి నారా లోకేష్‌ రైజింగ్ స్టారా? అంటే..  ప్రముఖ జాతీయ వ్యాపార  పత్రిక 'ఫార్చ్యూన్ ఇండియా' ఔననే అంటోంది. ఆ పత్రిక తన ఆగస్టు 2026 సంచిక కవర్ స్టోరీలో మంత్రి లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ గా అభివర్ణించింది.  యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.  2024 లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చేపడుతున్న   విధివిధానాలు, తీసుకుంటున్న  నిర్ణయాలు రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలుకుతున్నాయని పేర్కొంది.

2024లో ఐటీ, ఎలక్ట్రానిక్స్,  విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన క్షణం నుంచీ  నారా లోకేష్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో   గూగుల్   ప్రాజెక్టు ఏపీ సాంకేతిక విప్లవానికి ఒక మైలురాయిగా నిలిచింది.  అలాగే..  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఆటోమోటివ్ రంగాల్లో విదేశీ, స్వదేశీ దిగ్గజ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారని ఫార్చ్యూన్ ఇండియా కథనం ప్రస్తుతించింది.

విదేశీ పర్యటనల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను కలవడం లోకేష్ కార్యాచరణలో భాగమైంది. ఇటీవలి దక్షిణ కొరియాలో పర్యటనలో లోకేష్,  ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, బ్యాటరీ తయారీ,   ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. కేవలం ఒప్పందాల స్థాయిలోనే కాకుండా, కంపెనీలకు అవసరమైన   అనుమతులు,  మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆయన తీసుకుంటున్న సత్వర నిర్ణయాలు ఏపీ పారిశ్రామిక రంగ పురోగతికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. 

అదే విధంగా విద్యా రంగంలో కూడా నారా లోకేష్   కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుల బదలీల్లో పారదర్శకత తీసుకురావడం, మెగా డీఎస్సీ ద్వారా వేల సంఖ్యలో   టీచర్ పోస్టులను భర్తీ చేయడం, పాఠశాలలకు  రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలతో పాఠశాల విద్య నాణ్యతను పెంచే సమగ్ర ప్రణాళిక  అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత  పెంచడంతో పాటు, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగిన స్కిల్స్  అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. 

గతంలో అంటే 2014, 2019 మధ్య కాలంలో  విద్యాశాఖ  మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో లోకేష్ రాజకీయ అనుభవం, మాట్లాడే తీరు, ప్రజలతో అనుసంధానమయ్యే విధానంపై ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ట్రోలింగ్, రాజకీయ సవాళ్లను దాటుకుంటూ ఆయన తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ముఖ్యంగా  యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఆయన రాజకీయ ప్రయాణంలో  మైలురాయి అనడంలో సందేహం లేదు. ఆ పాదయాత్ర తరువాత లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదిగారు. 

ఇప్పుడు అంటే 2024లో రెండో సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ  లోకేష్ పాలనాపరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సాంకేతికతను ఉపయోగిస్తూ పాలనలో వేగం పెంచడం, జెన్ జీ,   యువతతో నేరుగా సంభాషిస్తూ రాజకీయంలోకి వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రకటనల కంటే ఫలితాల ఆధారిత పాలనకే  ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.  

  Fortune India cover page story on Nara Lokesh, Andhra Pradesh Rising Star, AP IT Department, Nara Lokesh investments, Education Minister

By
en-us Political News

  
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.