ఆరు నూరైనా.. మడమ తిప్పనంటున్న మహేష్?

మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ షూటింగ్‌ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఇటీవల కోటిలోని ఉమెన్స్‌ కాలేజీలో రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, మురళీశర్మ కాంబినేషన్‌లో మహేష్‌ లేకుండా వచ్చే సీన్స్‌ను త్రీకరించారని తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కు షిఫ్ట్‌ అయి అక్కడ మహేష్‌, ప్రకాష్‌రాజ్‌ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇందులో మహేష్‌కి తాతగా ప్రకాష్‌రాజ్‌ కనిపించబోతున్నారట. 
ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ శ్రీలీల కాగా, మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడంతో కొన్ని రోజులు ఈ సినిమా కోసం కేటాయించిందని తెలుస్తోంది. మీనాక్షిచౌదరిపై చాలా సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. నాన్‌స్టాప్‌గా జరుగుతున్న షూటింగ్‌ని బట్టి, స్పీడ్‌ని బట్టి చూస్తే ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌కి రెడీ చేయబోతున్నారని అర్థమవుతోంది. మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అబిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్‌ ఎంతో కేర్‌ తీసుకొని మహేష్‌ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేసినట్టు తెలుస్తోంది.