ఆరు నూరైనా.. మడమ తిప్పనంటున్న మహేష్?
posted on Sep 14, 2023 6:21PM
![](/teluguoneUserFiles/img/gunturu%20karam.webp)
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ షూటింగ్ హైదరాబాద్లో నాన్స్టాప్గా జరుగుతోంది. ఇటీవల కోటిలోని ఉమెన్స్ కాలేజీలో రావు రమేష్, ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, మురళీశర్మ కాంబినేషన్లో మహేష్ లేకుండా వచ్చే సీన్స్ను త్రీకరించారని తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్లోని ఓ హోటల్కు షిఫ్ట్ అయి అక్కడ మహేష్, ప్రకాష్రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇందులో మహేష్కి తాతగా ప్రకాష్రాజ్ కనిపించబోతున్నారట.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రీలీల కాగా, మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడంతో కొన్ని రోజులు ఈ సినిమా కోసం కేటాయించిందని తెలుస్తోంది. మీనాక్షిచౌదరిపై చాలా సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. నాన్స్టాప్గా జరుగుతున్న షూటింగ్ని బట్టి, స్పీడ్ని బట్టి చూస్తే ఈ సినిమా సంక్రాంతి రిలీజ్కి రెడీ చేయబోతున్నారని అర్థమవుతోంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అబిమానుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఎంతో కేర్ తీసుకొని మహేష్ క్యారెక్టర్ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.