బెంగుళూరు టెస్ట్: టీమిండియా టార్గెట్ 261

 India Vs New Zealand, India New Zealand, New Zealand india, New Zealand tour indiaబెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టులో న్యూజిలాండ్ 249 పరుగులకు ఆలవుట్ అయింది. శనివారం తొమ్మిది వికెట్లు కోల్పోయి 232 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన తర్వాత కేవలం 4.2 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. జహీర్ ఖాన్ లాస్ట్ వికెట్ ను సోమవారం పడగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఫ్రాంక్లిన్ 41, రాస్ టేలర్ 35 పరుగులు చేశారు. భారత్ బౌలర్స్‌లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీసుకోగా ఓజా 2, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు.