ఏపీలో ఒక్కరోజులో 37 మంది మృతి

ఏపీలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. 24 గంటల వ్యవధిలో 37 మంది చనిపోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 365 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,935 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,103కి చేరింది. ఇప్పటివరకు 16, 464 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 14,274 యాక్టివ్ కేసులు ఉన్నాయి.