మంత్రి కొడుకును అడ్డుకున్నందుకు లేడీ కానిస్టేబుల్ కు పనిష్మెంట్

గుజరాత్ లోని సూరత్ లో ఒక మంత్రి కుమారుడిని అడ్డుకుని ప్రశ్నించినందుకు ఒక లేడీ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పై అధికారులు. ఇంతకూ ఆమె చేసిన తప్పేంటంటే.. రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కుమారుడు, మరో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి కరోనా కారణంగా రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న టైం లో జామ్ జాం అని తిరిగేస్తుంటే అదేంటని ప్రశ్నించింది కానిస్టేబుల్ సునీతా యాదవ్. ఈ ఘటన జులై 8 వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగింది. ఐతే మొన్న జులై 12 న ఆ మంత్రి కుమారుడిని అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ పై వదిలి పెట్టారు. ఇది ఇలా ఉండగా మంత్రి కుమారుడిని కానిస్టేబుల్ ప్రశ్నిస్తున్న వీడియో ప్రస్తుతం  వైరల్ గా మారింది. ఐతే ఈ ఘటన పై తన వాదనను వినిపించేందుకు ఆమె పని చేసే స్టేషన్ లోని ఎస్ ఐ ని కలవగా వెంటనే లీవ్ లో వెళ్లాలని అయన ఆదేశించారు. అంతే కాకుండా ఈ ఘటనకు సమబంధించి ఆమె పై ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోబోతున్నారని తెలియడంతో ఏకంగా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించింది.