జలుబు ఎవరికి వస్తుంది... తగ్గించుకునే సులువైన మార్గాలు
జలుబు వీలాకి మాత్రమే వస్తుంది. వాళ్ళకి రాదు అన్నది కాదు. అందరికీ వస్తుంది ముఖ్యంగా స్చూల్ కి వెళ్ళే పిల్లలకి సంవత్సరానికి 1౦ సార్లు రావచ్చు యుక్త వయస్సులో ఉండే వాళ్ళకి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు రావచ్చు నని వైద్యులు పేర్కొన్నారు. స్కూలు కు వెళ్ళే పిల్లలకి జలుబు అధికంగా రావడానికి కారణం ఏమిటి అంటే స్కూల్ లో పిల్లలు ఒక్కొకరు ఒక్కో వైరస్ లకు ఎక్స్పోజ్ అవుతారు పైగా అప్పటికీ వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఇంకా ఉంటుంది.పెరుగు తున్నకొద్ది రోగనిరోదక శక్తి పరి పక్వానికి వచ్చి వాళ్ళు జలుబు వైరస్ ల దాడి ని తట్టుకోగలిగే స్థితికి వస్తారు. అసలు తేలికగా జలుబు బారిన పడే వాళ్ళు వ్యక్తులు వీళ్ళే.... తాగుబోతులు.పొగతాగే అలవాటు ఉన్నవాళ్లు. వృద్ధులు. బలహీనులు. ఉబ్బసం,బ్రోన్కైల్ ఆస్తమా ఉన్నవాళ్లు. మొదలైన వాళ్ళు అని వైద్యులు గుర్తించారు. అసలు జలుబు ఎంతకాలం ఉంటుంది?... జలుబు ఎంతకాలం ఉంటుందనేది,మనిషినుంచి మనిషికి అంటుకున్న వైరస్ ని బట్టి రోగ నిరోధక శక్తిని బట్టి.మారుతూ ఉంటుంది సాధారణంగా జలుబు 2 నుంచి 5 రోజులు ఉంటుంది. కాంప్లికేట్ అయితే వారం లేదా రెండు వారాల దాకా ఉండ వచ్చు. జలుబు లక్షణాలు... మనకు సోకే జలుబులో అధిక భాగపు జలుబు హెడ్ కొల్డ్స్ అంటే ముక్కులోకి,గొంతులోకి అంటి పెట్టుజకుని ఉంటాయి. ఇలాంటి జలుబుప్రధమ లక్షణం గొంతులోనో ముక్కులోనో చిన్నగా తిక్ల్ చేసినట్లు ఉంటుంది. తరు వాత తుమ్ములు,తరువాత ముక్కునుంచి నీళ్ళు కారడం ఉంటుంది. సాధారణంగా జలుబు వైరస్ మనకు సోకిన 1-2 రోజులకే ప్రారంభ మౌతుంది. ముక్కు లోపల తుమ్ము రాబోతున్న ఇమాజినేషన్,తుమ్ములు,నీరు కారడం,వగైరాలతో,ముక్కు లోపలికి బాక్టీరియా కూడా ప్రవేశించి వుండే పసుపు పచ్చగా చీమిడి కూడా మొదలౌతుంది. ఆ తరువాత నుంచి ఒళ్ళు నొప్పులు,జ్వరం,తలనొప్పి,ఉండోచ్చు.ఇన్ఫెక్షన్ గొంతునుంచి లోపలి ప్రవేశిస్తే గొంతులో,చాతిలో,నొప్పి బరువుగా అనిపిస్తుంది.గొంతు బొంగురు పోవడం పొడి దగ్గు మొదలైనవి ఉంటాయని సాధారణ వైద్యులు చెపుతున్నారు. దగ్గు ప్రారంభంలో పొడిగానే ఉన్న రోజులు గడుస్తున్న కొద్ది ఇబ్బందికి గురిచేస్తుంది.ముఖ్యంగా రాత్రివేళ మిమ్మల్ని రాత్రివేళ నిద్ర పోనివ్వదు.అంతే కాక మీకు రుచి వాసన తేలీ కుండా పోతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో జలుబు మరే తీవ్రమై మధ్య చెవి ఇన్ఫెక్ట్ కావడం జరుగుతుంది. సైను సైటిస్,బ్రాన్ కైటిస్,వాటికీ దారు తీయవచ్చు. అంతకు ముందు ఆస్తమా,క్రానిక్ బ్రాంకైటిస్,చెవిపోటు ఉన్న వాళ్ళు జలుబు వస్తే అంతకు ముందు ఉన్న సమస్యలు ఎక్కువ చేసి రోగిని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా జలుబు వల్ల మధ్య చెవి ఇన్ఫెక్ట్ అయినప్పుడుఅది మేనిన్గితిస్ ఎంసిఫిలిటిస్ కు దారి తీయ వచ్చు.దీని వల్ల పరిస్థితి మరింత తీవ్రమై సీరియస్ కండిషన్ ఏర్పడవచ్చు.ఒక్కోసారి అచుట్టుపక్కల భాగాలు ఇన్వొల్వె అయ్యి తల నొప్పి వంతులు మెడ పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి. జలుబు కొన్ని అపోహలు... వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది.వర్షంలో తడిస్తే జలుబు రావాలని లేదు.మీరు ఇంట్లో ఉన్న జలుబు చేస్తుంది. ఇంలో ఏమాత్రం తేమ ఉన్న జలుబు వస్తుంది వర్షం కురిసినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారుమీ ఇంట్లో చెమ్మ వాతావరణం వేడి వాళ్ళ వైరస్ ముక్కును అంటి పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుజుంటే జలుబు చేస్తుంది... ముద్దు పెట్టుజుంటే జలుబు చేస్తుంది అన్నది 1౦ % కేసులలో ఉండవచ్చు.లాలా జాలం ద్వారా ఒకరినుంచి ఒకరికి జలుబు సోకవచ్చు. ముద్దు పెట్టుకున్నప్పుడు ముక్కులు రెండు దగ్గర అవుతాయి. చలిలో తెరిగితే జలుబు చేస్తుంది.... మనం చలిలో తరిగితే జలుబు చేస్తుంది అని అనుకుంటాం కాని నిత్యం మంచు ప్రదేసాలలో వుండే వాళ్ళకు జలుబు అంతగా సోకదు. వేడి ప్రదేశాలలో ఉండే వాళ్ళకి జలుబు బాద. జలుబును తగ్గించుకునే మార్గాలు... విటమిన్ సి,పెన్సిలిన్,యాన్తి బాయిటిక్స్ లాంటివి జలుబును తగ్గిస్తాయి.అనుకోడం భ్రమ మాత్రమే. యాంటి బాయిటిక్స్ బాక్టీరియా మూలంగా ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి ఉపక రిస్తాయి.తప్ప వైరస్ మూలంగా వచ్చే జలుబు లాంటి అస్వస్థత వద్ద యంటి బాయిటిక్స్ పప్పులు ఏవి ఉడకవు. వ్వితమింక్ మన శరీరంలో ఉండే చెత్తని బయటికి తోలే పని చేస్తుంది.జలుబును పూర్తిగా తొలగించాడు కాని వరం రోజులు ఉండే జలుబును రెండు మూడు రోజులు ఉంటుంది. వితమింక్ దగ్గడం,చీదడం లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది.ఇందుకోసం మీరు విటమిన్ సి కల టాబ్లెట్స్ వాడడం కంటే ఆరంజి, ద్రాక్ష, పళ్ళ రసాలను,తాగడం మంచిది. ఆహారం... జలుబు చేసినప్పుడు కొవ్వుగల ఆహార పదార్ధం,మాంసం,పాల ఉత్పత్తులు,తక్కువగా తీసుకోండి, తాజా పళ్ళ రసాలు కయాగూరలు ఎక్కువగా తీసుకోండి. చికెన్ సూప్... జలుబు చేస్తే కోడి కూర తినమంటూ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.వైద్య పరంగా అది సరైనదే అని అనిపిస్తుంది. ఒక కప్పు వేడి వేడి చికన్ పులుసు మీ ముకు బిరడాని తొలగించి ముక్కులో ముక్కునుంచి పలుచగా నీరు కారడం గమనించ వచ్చు. అది బహుశా కోడి కూరలో వేసిన మూలికలు నషాళానికి చేరి మీ ముక్కును శుభ్రం చేసి ఉంటాయి. ముక్కు కారడం వల్ల మీరు మాటి మాటికీ మీ ముక్కు చీదడం వల్ల మీ శరీరంలోని సూక్ష్మక్రిములు బయటకు వెళ్లి పోతాయి. ఉప్పు నీటితో పిక్కిలించండి... జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం ఉప్పునీతిని గొంతులోపోసి పుక్కులించండి.దీనివల్ల కొంత రిలీఫ్ వస్తుంది. ఆవిరి పట్టడం... ఇది మన పూర్వీకుల నుంచి ఆచరిస్తూ అస్తున్న పద్ధతి ఒక గిన్నెలో బాగా మరగ బెట్టిన నీటిని తీసుకుని అందులో కొంత విక్స్ అమృతాంజనం గాని తీసుకుని తలమీద దుప్పటి లేక టవల్ ను కప్పుకుని ఆవిరిని గట్టిగా పీల్చండి జలుబు తాలూకు ముక్కు దిబ్బడ తగ్గుతాయి. ముక్కుకు వెస్లిన్... ఇక ఆఖరుగా చీదగా చీదగా ముక్కు వొరుసుకు పోయి మంట పుడుతూ ఉంటుంది పెట్రోలియం జెల్లి ని గని వెస్లిన్ గని ముక్కు చివర పట్టించి కొంచం ముక్కు లోపలి భాగం రాసుకుంటే ఈ బాధ తప్పు తుంది. బ్రాంది,వైన్.... చాలా మందికి కొంచం జలుబు చేయగానే 3 టీ స్పూన్ల బ్రన్దీని వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే కొంత రిలీఫ్ ఇస్తుంది అంటారు మందు బాబులు.
read moreఫ్లు వస్తే ఏం చేయాలి ఎలాంటి మందులు వాడాలి...
అసలు ఫ్లు వస్తే ఎలా ఉంటుంది ఎలాంటి బాధ పడతారు అన్న విషయాలు తెలుసుకుందాం. జరీ కింద పది నలిగి పోయినట్టు గా బాధ పడుతున్నారా?జ్వరం వచ్చి ఇక చచ్చిపోతనేమో అన్నంత గా భయ పడిపోతున్నారా?ఇప్పుడు పడుతున్న బాధకంటే చచ్చిపోయినా బాగుండు నని అనుకుంటున్నారా? తల పోటుగా ఉండడం కండరాలు గుంజుతున్నట్టుగా ఉందా?నుదురు మంటల్లో కాలిపోతున్నట్టుగా ఉంటుందా? అయితే అది ఫ్లు వైరస్ అని మీరు గ్రహించాలి.తగ్గి పోయే అంతవరకూ అది మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అమెరికాలో సంవత్సరానికి 1౦3మిలియన్ల ప్రజలు ఫ్లు బారిన పడుతూ ఉంటారు.72 వేల మంది రోగులు ఉండడం ఆసుపత్రిలో చేరుతూ ఉండడం గమనించవచ్చు అలాగే అమెరికాలో ఫ్లు,నిమోనియా తో 69,౦౦౦ మంది మరనిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫ్లూ చాలా నెమ్మదిగా అమ్మయకంగా వస్త్ఝుంది.ఒళ్ళంతా కొద్దిపాటి నొప్పులు ప్రారంభమై,కొద్దిగా తల నొప్పి,గొంతునొప్పి వస్తుంది.కొన్ని గంటల తరువాత చలి ప్రారంభమై జ్వరం,దగ్గు,శరీరం లాగుతున్నట్లు అంటే గుంజినట్లుగా,కీళ్ళ నొప్పులు వచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే అది ఫ్లూ అని చెప్పవచ్చు.. అసలు ఫ్లూ ని ఎలా చూడాలి ఫ్లూ ని వెయ్యి తలలు ఉన్న రాక్షసిగా చూడాలని అంటున్నారు వైద్యులు. ఇంఫ్లూయేన్ జా లో మూడు రకాల వైరస్లు ఉన్నా ప్రధమికం గా ఎ,బి,సి అనే మూడు రకాలే ఉన్న అవి ఒకదానికి ఒకటి కలగలిపి అనేక రూపాల కింద రూపాంతరం చెందుతుంది.అలాగని ఈఏడు వైరస్ ల కంటూ టీకా తీసుకున్నప్పటికీ ఫ్లూ వచ్చి మీమీద దాడి చేసే మిమ్మల్ని మీ శరీరాన్ని బలహీనం చేసే అవకాసం ఉంది. ఫ్లూ వచ్చినప్పుడు యాంటీ బాయిటిక్స్ తీసుకున్న లాభంలేదు.వైరస్ మూలంగా వచ్చే ఫ్లూ యాన్టి బాయిటిక్స్ పనిచేయవు. ఫ్లూ కు మీరు వేరే మందులు వాడాల్సిందే. ఫ్లూ వచ్చినప్పుడు ఎలాంటి జగత్తలు తీసుకోవాలి... ఫ్లూ వచ్చి నప్పుడు ఇంట్లో ఉండండి.ఫ్లూ ఒకళ్ళ నుండి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి.ఫ్లూ వచ్చినప్పుడు ఆఫీసుకి వెళ్లి పనిచేసే ప్రయత్నం చేయకండి.మీవల్ల మిగతా వాళ్ళకు సోకే ప్రమాదం ఉంది. ఫ్లూ తగ్గే దాకా ఇంట్లోనే ఉండండి.జ్వర, సాధారణ స్థితికి వచ్చేదాకా కొన్ని రోజులు ఆగండి.ఒక వేళ మీపిల్లలకు ఫ్లూ వస్తే ఫ్లూ పూర్తిగా తగ్గే దాకా వాళ్ళను స్చూలుకు పంపకండి. ఫ్లూ వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకోండి... ఫ్లో వచ్చిన వ్వల్లలో పూర్తిగా జ్వరం అలసట నీరసం ఉంటుంది కాబట్టి.మంచం మీదే రెస్ట్ తీసుకోండి.శరీరానికి రెస్ట్ ఇవ్వడం వల్ల మీ శరీరం తన శక్తిని కూడా గట్టుజుని ఫ్లూ ఇన్ఫెక్షన్ పై పోరాడేందుకు వినియోగిస్తుంది మీరు కదులుతూ మీరు ఎదో ఒక వ్యాపకం లోకి వెళ్ళారంటే మీరు పూర్తిగా నీరసించిపోయి ఉండడం వల్ల మీశరీరంలో డిఫెన్స్ మెకానిజం బలహీనపడి తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చు. ఆహారం లో ఏమితీసుకోవాలి... ఫ్లూ జ్వరం తో బాధ పడేవారు డీ హైడ్రేషన్ కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి.మీరు ఘన ఆహారాని తీసుకున్న సహించదు.ద్రవ ఆహారం మీకు పోషక శక్తిని ఇస్తుంది. ఆహారంలో పల్చటి సూపులు,పళ్ళు,వెజిటేబుల్ రసాలు,అంటే ముఖ్యంగా బీట్రూట్,క్యారెట్ రసాలు,విటమిన్లు,ఖనిజ లవణాలు ఉండే ద్రవాలు తీసుకోవాలి. సగం జ్యుస్ కి అంతే నీళ్ళు కలిపి రుచికోసం కొంచం పంచదార కలుపుకోవచ్చు.పంచదారను ఎక్కువగా కలిపితే జ్వరంలో అది విరేచనాలకు దారి తీస్తుందిపంచదారను కొంచం గా మాత్రమే తీసుకోవాలి. శరీరం పూర్తిగా బలహీన పడి ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే... ఆస్ప్రిన్,నైస్,ఇబుప్రోఫెన్,లాంటి మందులుఫ్లూ తో పాటు వచ్చే మందులు తలనొప్పి,ఒల్లునోప్పులను తగ్గిస్తాయి.అది డాక్టర్ సూచన మేరకే వాడాలి. ఫ్లూ లక్షణాలు మధ్యాహ్నం,సాయంత్రము,ఎక్కువగా కనిపిస్తాయి.అందుకు డాక్టర్లు ఈ మందులను నాలుగు ఘంటలకి ఒకసారి వేయమని చెబుతారు.సొంత వైద్యం చేసుకోడం అనర్ధం. గమనిక అస్ప్రిన్ మందును పిల్లలకు ఇవ్వకూడదు.దీ ని వల్ల నరాల సంబందిత వ్యాధితో బాధ పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇష్టమొచ్చిన మందులు వాడవద్దు... ఫ్లూ తో బాధ పడుతున్నప్పుడు జలుబుకు సంబందించి మనకు తెలిసిన టాబ్లెట్స్ ను వాడవద్దు.లేక మందుల షాపు లో వాళ్ళు ఇచ్చిన మందులు వాడవద్దు.అలాంటి మందు వల్ల కొన్ని లక్షణాలు తొలగి పోయి,తాత్కాలికంగా ఫ్లూ తగ్గినట్టు అనిపిస్తుంది.కానీ మళ్ళీ తిరగ బెట్టి సీరియస్ సీరియస్ అయ్యే అవకాసం ఉంది ఉప్పు నీటిన్ పుక్కిలించండి... ఫ్లూ సోకినప్పుడు గొంతు పొడి ఆరి పోయి నట్లు ఉంటుంది.స్పూను ఉప్పునునీళ్ళలో కలిపి గార్లింగ్ చేస్తే కొంత రిలీఫ్ ఉండవచ్చు. అయితే ఆనీటిని మింగకూడదు. ఉప్పు లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మింగాక పోవడమే మంచిది. వేడి కాపడం పెట్టుకోవాలి... ఫ్లూ తో వచ్చే ఒళ్ళు నొప్పులకు అలసట అధికంగా ఉంటుంది.ఈ నొప్పులనుంచి కాస్త ఉపసమనం కోసం వేడి కాపడం ఉపయోగ పడుతుంది. తాజా గాలి తీసుకో డం ముఖ్యం... రోగి ఉన్న గదిలోకి తాజా గాలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసికోవాలి.అయితే చలివేయకుండా వెచ్చటి పక్క బట్టలను అమర్చుకోవాలి. వెన్ను నిమరడం చేయాలి... ఫ్లూ తో బాధ పడే వ్యక్తులు ఎవరైనా మృదువుగా మసాజ్ చేయించుకున్నట్లుగా ఎవరితో ఐనా వెన్ను నిమిరించుకుంటే ఆవ్యక్తిలో రోగ నిరోధక యంత్రాంగం యాక్టివ్ అయ్యి ఫ్లూతో పోరాడేందుకు తయారు అవుతుంది. తేలిక పాటి ఆహారం తీసుకోవాలి... ఫ్లూ రోగులకు ఆకలి ఉండదు కాని ఫ్లూ తగ్గు ముఖం పడుతూ ద్రవ ఆహారం నుంచి ఘన ఆహారం తీసుకుంటునప్పుడు పేషంట్ తీసుకునే ఆహారం చాలా తేలికగా జీర్ణ మయ్యేడిగా ఉండాలి.బ్రెడ్ పాలు మెత్తటి వరిడాక్టర్ సూచించిన విధంగా తీసుకోవాలి.
read moreకోవిడ్ కేసుల పెరుగుదలతో భయం పట్టు కుందా?
కోవిడ్ కేసులు పెర్గుతూ ఉండడంతో ఆసుపత్రులకు భయం పట్టుకుంది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్యాన్డమిక్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కోవిడ్ రోగుల శాతం గణనీయంగా పెర్గుతూ ఉండడం తో శరీరంలో ఒళ్ళు నెప్పులు, జ్వరం,లంగ్ ఫైబ్రోసిస్,పల్మనరీ ఎంబాలిజం,బ్రెయిన్ ఫాగింగ్ వంటిసమస్యలతో అవుట్ పేషెంట్ రోగులుగా వస్తున్నారని డాక్టర్స్ తెలిపారు. చాలామందిలో మానసిక సంబందమైన సమస్యలు యాంక్జైటీ,ఒత్తిడి,కంఫ్యుషన్. హై బిపి,జ్ఞాపక శక్తినికోల్పోడం,కొత్తగా డయాబెటిస్,వంటి సమస్యలతో రోగులు వస్తున్నట్లు తెలిపారు.మూడునెలల కాలంలో 99౦ రోగులలో 31.8%రోగులు పోస్ట్ కోవిడ్ రోగులు కావడం విశేషం.11% మందిలో కోవిడ్ లక్షణాలు ఇంకా ఉన్నాయని,9-నుండి12 నెలలలో అలసట 12.5%మైలోరియా 9.3%ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్న రోగులు ఉన్నారు.డిల్లి లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సాకేత్ తెలిపారు. కోవిడ్ లక్షనాలు లేని వారు కూడా దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలు గుర్తించామని.మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి డైరెక్టర్ డాక్టర్ వివేక్ నంజియా అన్నారు. వీరు ఎక్కువగా కళ్ళు, ఇతర అవయవాలపై ప్రభావం ఉందని తేల్చారు.చాలా కేసులను పరిశీలించిన మీదట వైరస్ దీర్ఘకాలంగా కొనసాగే అవకాసం ఉందని. వైరస్ నుండి బయట పడ్డ తరువాత కూడా సమస్యలు వస్తున్నాయని పూనా జూపిటర్ ఆసుపత్రికి చెందిన మహేంద్ర డడ్కే అన్నారు.పోస్ట్ కోవిడ్ లో న్యూరో వైడైటరీ లక్షణాలు డిప్రెషన్,ఒత్తిడి,యాంక్జైటీ,బ్రెయిన్ ఫాగ్,నిద్రలేమీ. ఊపిరి పీల్చుకోలేక పోవడం వంటి సమస్యలతో వస్తున్నారనిముఖ్యంగా వారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తరువాత వచ్చిన సమస్యలుగా పేర్కొన్నారు.ఏది ఏమైనా ఇతర అవయవాల ను నాశనం చేయలేదని ఐ సి యు లో ఉన్నవారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నవారే నని తేల్చారు. ఒక్కోసారి కోవిడ్ నెగెటివ్ వచ్చిన ఐ సి యు లో ఉండేవారని నిమోనియా తదితర సమస్యలు వారిని వేదిస్తున్నట్లు గుర్తించామన్నారు.
read moreతల నొప్పికి మసాజ్ దేరఫీ...
మసాజ్ చేయడం మూలంగా టెన్క్షణ్ తో ఉన్న కండరాలు వదులు అవుతాయి. తల వెన్నెముక భాగంలో మసాజ్ చేస్తే మిమ్మల్ని వేదిస్తున్న తల నొప్పి పోతుంది. 1 ఈ మసాజ్ ని మీకు మీరు కాకుండా వేరే వాళ్ళు చేస్తే మీరు రిలాక్స్ కాగలుగు తారు. 2 మసాజ్ చాలా మృదువుగా చిన్న చిన్న వర్తులకారపు పద్దతిలో మాజ్ చేస్తూ పోవాలి. ఒక్కో పాయింట్ వద్ద కనీసం 7 సెకండ్ల పాటు ఉండాలి.వేళ్ళ కొనలతో నుదురు పై భాగాన మధ్య పాపిడి ప్రారంభ భాగాన ముందు మసాజ్ చేయాలి.మధ్య పాపిడి పొడవునా దాకా మస్సాజ్ చేస్తూ పోవాలి. నుదుటికి ఇరు వైపులా పక్క పాపిడి భాగంలో మధ్య పపిడికి సమాంతరంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత చిన్న చిన్న వర్తులాకార పద్దతితో మీ అరచేతులతో తలకు రెండు వైపులా మసాజ్ చేయాలి.ఇప్పుడురెండు బొటన వేళ్ళ తోను తలకు రెండు వైపులా మెడ పైన మాడుకు కింది భాగాన మసాజ్ చేయాలి. ఆతరువాత రెండు చూపుడు వేళ్ళ తోనూ తలకు అటు ఇటూ వైపు భాగాలలో మసాజ్ చేయాలి. ఇపుడు మొహాన్ని నెమ్మదిగా పైకి ఎత్తి బొటన వేళ్ళతో గానీ లేదా నాలుగు వేళ్ళతో గాని రెండు చేతులతో మసాజ్ చేయాలి.ఇక చివరికి వీపు భాగంలో వద్ద మసాజ్ చేయడం ద్వారా మీరు చేస్తున్న మసాజ్ కార్యక్రమం పూర్త్గి అవుతుంది.అది మీ తల నొప్పికి మసాజ్ ట్రై చేయండి మీనోప్పి గాయప్.
read moreపక్షవాతంతో జీవితం ముగిసినట్టేనా?
కన్ను మూసి తెరిచే లోగా జరిగి పోతుంది.క్షణ కాలంలో మీ జీవితం మారిపోతుంది. అసలు పక్షవాతం అంటే--మెదడు లోపలి ధమనుల ద్వారా మెదడుకు వెళ్ళే రక్త ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే పక్ష వాతం అని అంటారు. మీరు మాట్లాడే శక్తినికోల్పో వచ్చు,ఆలోచించగలిగే శక్తిని కోల్పో వచ్చు.కాలు చెయ్యి పడిపోవచ్చు అదేపక్షవాతం పక్ష వాతాన్ని వైద్య పరిభాషలో అపోప్లేక్టిక్ స్ట్రోక్ అంటారు. అమెరికాలో మనుష్యుల్ని మృత్యువు దగ్గరికి చేరుస్తున్న ప్రమాద కర జబ్బులలో గుండె జబ్బులు క్యాన్సర్,తరువాత పక్ష వాతం మూడో స్థానం లోకి వస్తుంది. అమెరికాలో ప్రతిసంవత్సరం షుమారు అరమిలియను మందికి పక్షవాతం బారిన పడుతున్నారని ఒక అంచనా.వాళ్ళలో లక్షా యాభై వేలమంది కి పైగా మృత్యు వాత పడుతున్నారు.బతికి ఉన్నవాళ్ళు కూడా ఎదో ఒక శారీరక లోపంతోజీవిస్తున్నారని తెలుస్తోంది. మాటపడిపోవడం.దృష్టిలోపం,జ్ఞాపకశక్తి,లేకపోవడం లేదా శరీరలో ఒక పక్క ఎదో ఒక భాగం చచ్చుబదిపోవడం లాంటి ఎదో ఒక అవలక్షణం తో జీవితాన్ని వెళ్ళ దీస్తున్నారు. పక్షవాతం అంటే ఏమిటి? డాక్టర్స్ దీనిని సెలబ్రెల్ ఎమర్జెన్సీ కింద చెబుతారు. సెలేబ్రెల్ అంటే మెదడు అర్ధం ఏమర్గెంచి అంటే ఆకస్మికం అని అర్ధం లేదా అకస్మాత్తుగా వచ్చిందని అర్ధం. మెదలోపలి ధమనుల ద్వారా మెదడుజు వెళ్ళే రక్త ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే స్ట్రోక్ పక్షవాతం. రక్త ప్రవాహానికి ఆటంకం కలగాదమనేది ధమనిలోని ఎదో భాగాన రక్తం గడ్డకట్టడం బ్లడ్ క్లోట్ మూలంగా కావచ్చు. లేక దమని చిట్లడం మూలంగా ను కావచ్చు. దమని ద్వారా మెదడుకు వెళ్ళే రక్తం మెదడుకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను అందిస్తుంది.మెడకు రక్త సరఫరా ఆగిపోగానే ఆక్సిజన్ సరఫరా కూడా ఆగిపోతుంది.ఆక్సిజన్ సరఫరా లేక పోయేసరికి మెడకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది.అపుడు మెడకు చెందిన విలువైన కణజాలం నసిన్చిపోతాయి.లేక సీరియస్ గా డ్యామేజ్ అవుతాయి. ఈ డామేజ్ జరగడానికి కేవలం నాలుగు లేదా ఐదు నిమిషాలు చాలు అంతే. మెడకు వెళ్ళేసరఫరా కి నాలుగు ఐదు నిమిషాలు అవరోధం ఏర్పడితే చాలు పక్ష వాతం వచ్చేస్తుందన్న మాట. ఇలా డామేజ్ అయిన మెదడు కణాలు మీ ఎడమ చేతిని పని చేయించేవి అయితే మీ ఎడమ చేయి పడిపోతుంది. జ్ఞాపక శక్తిని కొంత్రోల్ చేసేవి అయితే జ్ఞాపక శక్తిని కోల్పోతారు.ఒకవేళ మెదడు తాలూకు అత్యధిక కణజాలం నశిస్తే అమనిశే చనిపోతాడు. ఆకస్మికంగా రక్త సరఫరా ఆగిపోవడం స్ట్రోక్ అనేది అప్పటికిఅప్పుడు ఆరోగ్యంగా ఉన్న దమనుల లో ఏమి ఆగదు. ఏళ్ల తరబడి డ్యామేజ్ అయిన ధమనులలో మాత్రమే జరుగుతుంది. స్ట్రోక్/లేదా పక్షవాతం ఎలా ఏర్పడుతుంది.--ఎన్నిరకాలు ---- సేలేబ్రెల్ త్రంబోసిస్---- మెడకు వెళ్ళే రక్త నాళాలలో ఎక్కడో ఒక చోట రక్తం గడ్డ కడుతుంది.ఇలా రక్తం గడ్డకట్టడాన్ని బ్లడ్ క్లోట్ అంటారు దీనిని వైద్య పరిభాషలో త్రోమ్బోస్ అంటారు.క్రమేణా ఈ క్లోట్ పెద్దదై రక్తాన్ని పూర్తిగా మూసేస్తుంది. --- రక్తనాళాలలో ఏర్పడ్డ త్రోమ్బోస్ ని ప్రారంభంలోనేగుర్తిస్తే రక్తనాళాన్ని పూర్తిగా మూసేయకుండా ఉండే విధంగా ఉండడానికి తగిన మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. సెలబ్రల్ ఏమ్బాలిజం... మరేదో శరీరం నుండి కొట్టుకు వచ్చిన రక్తపు గడ్డ లేదా నరేదైనా ముక్క గాని ఉంటె దానిని ఎమోలుస్ అంటారు.మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనిలో ఇరుక్కుపోయి రక్త సరఫరాకి ఆటంకాన్ని కలిగిస్తుంది. సెలేబ్రల్ హేమరేజ్... మెదడుకు రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్తనాళం ఏదైనా చిట్లి నప్పుడు ఆ ప్రాంతం నుండి రక్తం బయటకు చిమ్మి లీక్ అవుతుంది. ఏదైనా ట్యూమర్ లాంటిది మెదడుకు రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్త నాళాన్ని అదిమి పెట్టి నప్పుడు ఆ నాళం మూసుకుపోయి మెడకు వెళ్ళే రక్తం ఆగిపోతుంది.ఈ నాలుగు సందర్భాలలోనూ వ్యక్తికి పక్ష వాతం వచ్చే అవకాసం ఉంది.
read moreయాంటీ బాయిటిక్స్తో జాగ్రత్త...
యాంటీ బాయిటిక్స్ తో కొలట్రాల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం నిపుణుల హెచ్చరిక. యాంటి బాయిటిక్స్ వల్ల కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తునారు. 5౦ సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు.ఇటీవలి కాలం లో యాంటీ బాయిటిక్ మందుల వాడకం విపరీతంగా పెరిగింది. యాంటీ బాయిటిక్స్ అదే పనిగా వాడారో ఆరోగ్యసమస్యలు తప్పవని అవి మరింత తీవ్రంగా ఉంటాయని.అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటి బాయిటిక్స్ సహాయ పడతాయి.ఏది ఏమైనా అనారోగ్య సమస్యల పైన శాస్త్రజ్ఞులు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. ఒక నూతన పరిశోదన ప్రకారం యురోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ వరల్డ్ కాంగ్రెస్ 2౦21 గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ క్యాన్ సర్ పై నిర్వహించిన సదస్సులో ఈ అంశం చర్చించారు. ప్రత్యేకంగా 5౦ సంవత్సరాలలోపు కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అనవసరమైన యాంటి బాయిటిక్స్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని పరిశోదన వెల్లడించింది. యాంటి బాయిటిక్స్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగ పడతాయి.ఏది ఏమైనా యాంటీ బాయిటిక్స్ అతిగా వాడితే దీనిఫలితం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యాంటీ బాయిటిక్స్ అనవసర వాడకం... సిడి సి ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ఇన్ఫెక్షన్లకు యాంటీ బాయిటిక్స్ ఉపయోగ పడతాయి,కాని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు వాడడాన్ని గమనించవచ్చు.ఇన్ఫెక్షన్స్ పై ప్రభావ వంతంగా పనిచేసిన యాంటి బాయిటిక్స్ వైరస్ ల పై పని చేయవని నిపుణులు తేల్చి చెప్పారు. యాంటీ బాయిటిక్స్ ఎల్లప్పుడూ తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదు.కొన్ని సందర్భాలాలో మాత్రమే వాడాల్సి ఉంటుంది కొన్ని సర్ర్లు శరీరం దానికదే ఇన్ఫెక్షన్ ను తగ్గించుకుంటుంది.అనవసరంగా యాంటీ బాయిటిక్స్ జాతీయ,అంతార్జాతీయ స్థాయిలో యాంటీ బాయిటిక్స్ వాడకం పెరగడం పై సి డి సి తీవ్రంగా పరిగణించింది. యాంటీబాయిటిక్స్ ను చాలా జాగ్రత్తగా వాడాలని,యాంటీ బాయిటిక్స్ వాడకం నివారించడం ద్వారా దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దుష్పరిణామాలు నివారించవచ్చు.నని సిడి సి తెలిపింది. ప్రజాలు విచ్చల విడిగా వాడడం వల్ల క్లోస్టిదిఒ దీఫ్ఫిసిల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఇన్ఫెక్షన్ల రకాలను యాంటి బాయిటిక్స్ నియంత్రిస్తుంది.నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ హెల్త్ యాంటి బాయిటిక్స్ బ్యాక్తీరియాను చంపడానికి ఉపయోగ పడుతుంది. గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ ట్రాక్ సమస్యలు తీవ్రత ఉన్నందున యాంటి బాయిటిక్స్ వాడకంలో సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేసారు.అవసరం లేని యాంటీ బాయిటిక్స్ ఓపి లోనే 3౦%ఉంటున్నాయని యు ఎస్ వెల్లడించింది.ఎమొరీ విశ్వ విద్యాలయానికి స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ మైఖేల్ వుడ్ వర్త్ సహాయ ప్రొఫెసర్ ఇన్ఫెక్షియస్ దిసేఅజేస్ అట్లాంటా మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. ఆరోగ్యాన్ని అందించేవారికి యాంటీ బాయిటిక్స్ వాడకం పెద్ద సవాలుగా నిలిచింది.యాంటి బాయిటిక్స్ వాడకం పై లాభాలు,నష్టాలు దుష్పరిణామాలు ఉన్నాయని యన్టీ బాయిటిక్స్ అంతార్జాతీయ ప్రాధాన్యత వల్ల టాక్సీ కేంట్స్ తగ్గి పోతాయి.ఎంపిక చేసిన యాంటీ బాయిటిక్స్ తట్టుకోగలిగిన యాంటీ బాయిటిక్స్ వాడాలి. కొలట్రాల్ క్యాన్సర్ పై ప్రభావం... అమెరికన్ క్యాన్సర్ సొసైటి చర్మ సంబంద క్యాన్సర్ను నిరోదించింది.అమెరికాలో అతి పెద్ద క్యాన్సార్లలో కొలట్రాల్ క్యాన్సర్ గా గుర్తించింది.కొలట్రాల్ క్యాన్సర్ ఇటీవలి కాలంలో తగ్గు ముఖం పట్టాయి. 64 సంవత్సరాల్ లోపు వారిలో కొలట్రాల్ క్యాన్సర్లు పెరిగి నట్టు గుర్తించారు.అయి తే ముఖ్యంగా యువతీ యువకులలో కొలట్రాల్ క్యాన్సర్ వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.ఈ విషయాన్ని క్యాన్సర్ జర్నల్ లో ప్రచురించారు. కోలాట్రాల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ను 45-5౦ సంవత్సరాల మధ్య తప్పనిసరిగా చేయించాలని సూచించింది. కొలట్రాల్ క్యాన్సర్ను ప్రాధమిక స్థాయిలో గుర్తించిన పక్షంలో నివారించవచ్చని అభిప్రాయ పడింది. క్యాన్సర్ నివారణ పై దృష్టి పెట్టాలి... కొలట్రాల్ క్యాన్సర్ మరణాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.క్యాన్సర్ మరణాలలో కొలట్రాల్ క్యాన్సర్ 2 వ స్థానం లో ఉంది. శరీర వ్యాయామంలేకపోవడం,అతిగా మద్యం సేవించడం,పొగాకు వాడకంవల్ల కొలట్రాల్ క్యాన్సర్ కు కారణాలుగా గుర్తించారు.కొలట్రాల్ క్యాన్సర్ లో వైద్యం లో లేని మరో జబ్బు అతని వయస్సు,లేదా కుటుంబ చరిత్ర,జనటిక్స్ వల్ల ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్,వంటి కారణాలు గా చెప్పారు ఈలక్షణాలు ఉన్నవారు సత్వరం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తేల్చారు.కొలట్రాల్ క్యాన్సర్ పై ఇంకా పోర్తిగా తెలియాల్సి ఉంది.కోలాన్ క్యాన్సర్ యాంటి బాయిటిక్స్ పై పూర్తి పరిశోదనలు చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.
read moreఇన్సులిన్ వాడకంలో జాగ్రత్తలు
డయాబెటిస్ మందులతో కట్టడి చేయలేక పోతే డాక్టర్ సూచించిన విద్జంగా ఇంసూలిన్ తప్పనిసరిగా వాడాల్సిందే ఇంసూలిన్ ఇంజక్షన్న్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ఆయా రోగుల లక్షణాలు వ్యక్తిగత అవసరాన్ని బట్టి ఉంటుంది.ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న అంశాన్ని డాక్టర్స్ సూచిస్తారు. రక్తంలో చక్కెర శాతం పడిపోయి హై పో గ్లై సీమియా రాకుండా రాకుండా ఉండటానికి అంటే బ్లడ్ షుగర్ ను తగిన విధంగా నియంత్రణలో ఉంచుకోడం కోసం మే ఇంసూలిన్ ఇంజక్షన్ తీసుకుంటారు. వీటిలో మూడురకాల ఇంసూలిన్ లు ఉన్నాయి.1)సోలుబ్లె2 )ప్రోటామిన్3)ఇన్సులిన్ జింక్ సస్పెంసాస్ ఇంజక్షన్ ద్వారా ఇంసూలిన్ ని ప్రవేశ పెట్టినప్పుడు అది శరీర కాణా లలోకి గ్లూకోజ్ ద్వారా శరీరానికి అవసరమైన శక్తి అందే విధంగా చేస్తుంది.చాలా మందికి పేషంట్ లకు రోజుకు ఒక ఇంజక్షన్ సరిపోతుంది. ఇంకొందరికి రోజుకు రెండు తీవ్రతను బట్టి రోజుకు 3నుండి 4 డోసులు కూడా ఆహారానికి ముందు అవసర మౌతాయి.ఎన్నిసార్లు తీసుకోవాలి ఎంతతీసుకోవాలనే దానిని డాక్టర్స్ నిర్ధారిస్తారు. ఇన్సూలిన్ ఇన్జేక్షన్ వాడకంలో జాగ్రత్తలు----- ఇన్సూలిన్ ని చల్లటి ప్రదేశంలో ఉంచాలి.రేఫ్రేజి రేటర్ లో మంచు తయారయ్యే డీప్ గ్రీజేర్ లో మాత్రం ఉంచకూడదు. ముఖ్యంగా పలుకులు,పలుకులు గా కనిపించే మకిలి పట్టిన ఇంసూలిన్ ను కొనవద్దు. శరీరంలో ఇంజక్షన్ చేసే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇంజక్షన్ భోజనానికి 2౦-3౦ నిమిషాలు ముందు తీసుకోవాలి.ఇంజక్షన్ బాటిల్ పైన లేబుల్ ని చెక్ చేయాలి.ఇంసూలిన్ బోటిల్ పైన ఎక్స్ పైరీ డేట్ ను కూడా గమనించాలి. స్వంతంగా ఇంజక్షన్ చేసుకోడానికి నేర్చుకోవాలి.వివిధ సమయాలలో మీ బ్లడ్ షుగర్ ను పరీక్ష చేసుకునే విధానాని కూడా నేర్చుకోవాలి. మీరు తీసుకునే ఇన్సూలిన్ డోసేజ్ షెడ్యుల్ ని బట్టి మీరు ఎప్పుడు భోజనం చేయాలి,ఇతరా లేదా శారీరక పనులు మొదలైన వాటి మధ్య సమన్వయం ఉండాలి.ఒక చిన్న డైరీ ని రాయడం అలవాటు చేసుకోవాలి అందులోమీరు ఇంజక్షన్ చేసుకున్న తేది,టైం,బ్లడ్ గ్లూకోజ్,ఎమన్నా రీయక్షన్ వచ్చిందా అయితే అది ఎ రకమైన రియాక్షన్ గురించిన వివరాలు ఉండడం మంచిది. ఇంజక్షన్ ని ఎలా చేయాలి------ మీరు తీసుకునే పరిణామం లో డాక్టర్ సూచించిన విధంగా సిరంజ్ లోకి తీసుకోవాలి. ఇంజక్షన్ ని మీ శరీరంలో కండరం లోకి లేక కొవ్వు ఉన్న భాగానికి ఇంజక్ట్ చేసుకోవాలి. సామాన్యంగా కొవ్వు ఉన్న భాగాలలో కి చేసుకోడం సులువుగా ఉంటుంది. చాలా మంది భుజాలు, తొడలు, పొత్తికడుపు, పిర్రలు, మొదలైన భాగాలలో చేసుకోవాలి ఆభాగం చర్మం మొద్దు బారిపోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఇంజక్షన్ చేసే ప్రాంతాన్ని మ్సరుస్తూ ఉండాలి. ఇంజక్షన్ చేయబోయేభాగాన ఆల్కాహాల్ లో ముంచిన దూదితో శుభ్రం చేయాలి. బొటన వేలు మిగతా వ్రేళ్ళ మధ్య ఇంజక్షన్ చేయబోయే భాగాన్ని పట్టుకుని పెన్సిల్ ను పట్టుకునే విధంగా సిరంజిని రెండు చేతి వేళ్ళ మధ్య పట్టుకుని సూదిని నిటారుగా చర్మంలోకి గుచ్చాలి. తర్వాత సిరంజి పలున్గేర్ ని కిందకి నొక్కాలి ఇప్పుడు వెల్ల మధ్యా పట్టుకున్న చర్మాన్ని వదిలేసి సిరంజిని పైకి లాగాలి.
read moreభారత్లో ప్రతిఏటా 7 లక్షల మరణాలు లాన్ సెట్ జర్నల్ లో వెల్లడి...
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణలో చోటుచేసుకుంటున్న వాతవరణ మార్పులు వాళ్ళ అసమాన ఉష్ణోగ్రతలు పెరగడం,అలాగే అతిశీతల వాతవారంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని లన్సేట్ హెచ్చరించింది. 2౦౦౦ -2౦19 సంవత్సరంలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరిగి పోయాయని ఇది గ్లోబల్ వార్మింగ్ గా నిపుణులు పేర్కొన్నారు. సంవత్స రంలో 7,4౦,౦౦౦ మరణాలు కేవలం భారాత్లో చోటు చేసుకోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నిపుణులు స్పష్టం చేసారు. వాతావరణంలో మార్పుల వల్ల వేడి,అతి సీతలం గా ఉండడం వల్లే మరణాలు పెర్గుతున్నాయని లాసెట్ ప్లానెట్ హెల్త్ జర్నల్ లో ప్రచురించిన నివేదికలో వెల్లడించింది. మొనాష్ విశ్వ విద్యాలయం,ఆస్ట్రేలియాలో ప్రపంచ వ్యాప్తంగా 5 మిలియన్ల ప్రజలు మరణించారని వాతావరణంలో మార్పుల వాళ్ళ భారత్ లో6,55,4౦౦ అధిక ఉస్నోగ్రతాల వల్ల83,7౦౦ గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.2౦౦౦ నుండి 2౦19 ప్రపంచంలోని వాతావరం లో మార్పులు వచ్చాయని ఒక దశాబ్దం లో ౦.26 డిగ్రీ ల సెల్సియస్ గా నమోదు కావడాన్ని అధయన బృందం పరిశీలించింది. ప్రపంచ వ్యాప్తంగా 9.43 మరణించారని ఆధ్యనంలో లో వెల్లడించారు.అంటే ప్రతి1౦,౦౦౦ మంది ప్రజలలో 74 మంది అదనంగా ఉంటున్నారని అది అతి చల్లదనం వల్ల చనిపోవాదాన్ని మనం గమనించవచ్చు. దీర్ఘ కాలంలో వాతావరణంలో మార్పులు మరణాలు మరింత పెరగవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు యూరప్,సహారా ఆఫ్రికా,అత్యధిక వేడి,శీతల ప్రాంతాలు ఉండడం వల్ల అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని లాస్ సెట్ జర్నల్ లో ప్రచురించారు. ఆశియలో ముఖ్యంగా తూర్పి దక్షిణ యూరప్ లో 1౦,౦౦౦ మంది అధిక ఉష్ణోగ్రతల మరణించారు. సహారా ఆఫ్రికాలో 1౦,౦౦౦ మంది అధిక శీతల వాతావరణంవల్ల మరణించారు.43 దేశాల నుండి సేకారించిన డాటా ఆధారంగా వివిధ రకాల వాతావరణాలు,సామాజిక,ఆర్ధిక,భౌగోళిక అంశాల ఆధారంగా వివిదరకాల మౌలిక వసతుల కల్పన ప్రజా ఆరోగ్యం సేవలు పర్గానలోకి తీసుకున్నామని నిపుణులు లా సెట్ జర్నల్ లో పేర్కొన్నారు.
read moreజికా వైరస్ అత్యంత ప్రమాదకరం అప్రమతంగా ఉండాలని హెచ్చరిక...
డెల్టావేరియంట్ కన్నా,డెల్టా ప్లస్ కన్నా అత్యంత ప్రమాదకరమైన వైరస్ గా జికా వైరస్ ను పేర్కొన్నారు.తొలుతభారత్ లో కనుగొన్న జికా వైరస్ లోకల్ వైరస్ గా పేర్కొన్నారు.జికా వైరస్ ల కన్నా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తునారు.ప్రస్తుతం వర్షాకాలం ఉన్నందున జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉబ్తుందని న్నిపునులు అంచనా వేస్తున్నారు.కేవలం వెక్టర్ దోమ వల్ల వ్యాపిస్తుందని,అందుకే దీన్ని వెక్టర్ జోన్ డిసీజ్ గా పేర్కొన్నారు.దీని లక్షణాలలో ముఖ్యంగా జ్వరం,శరీరమంతా దద్దుర్లు,జాయింట్స్ కీళ్లలో నొప్పులు కండరాలలో నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు.ఒకరకంగా చెప్పాలంటే చుకున్ గునియా,డెంగ్యు,ఇపుడు జికా ముఖ్యంగా కాళ్ళు కీళ్లలో నిసత్తువ వచ్చి కీళ్లలో ముణుకులు,మోచిప్పలలో తీవ్రమైన నొప్పి,అనొప్పి శాశ్వతంగా మారిపోయే అవకాసం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జికా ఎయిడిన్ ఈజిప్ట్ దోమ వల్ల వచ్చే డెంగ్యు కు కారణమైనా దోమ వల్లే జికా వ్యాపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాగా ఈజిప్ట్ దోమ మూడు రోజుల్లో పెర్గుతుందని రెండు వారాల తరువాత దీని లక్షణాలు బయట పడతాయని ఈలక్షనాలు 2 ,లేదా 3 రోజులు ఉంటాయని, అలాగే ఈ లక్షనాలు కనపడవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా జ్వరం,కండరాల నొప్పులు,జాయింట్స్ లలో నొప్పులు తల నొప్పి కాళ్ళ కలక,దద్దుర్లు వస్తాయని వైద్యులు తెలిపారు. చుకున్ గునియా గర్భిణీలకు ఆత్యంత ప్రమాదకరమని దీనివల్ల పుట్టిన పిల్లలు కొన్నిరకాల్ అంగ వైకల్యంతో పుట్టవచ్చని ఈ అంశాన్ని గమనించాలని పేర్కొన్నారు దీనికి ప్రత్యేకంగా మందులు లభ్యం కాలేదని,డీ హై ద్రేషణ్ రాకుండా చూసుకోవాలని జ్వరం వస్తే tyenole(r) లేదా acetominophin,వాడవచ్చునని స్తేరాయిడ్స్ కు దూరంగా ఉండాలని,ఇతర సమస్యలతో బాధ పడే వారు డాక్టర్ను ను సంప్రదించాలని డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. పైన పేర్కొన్న లక్షణాలు ఉన్న వారు లేదాఅనుమానితుల కోవిడ్ లక్షణాలు ఉన్న వారినుండి స్యాంపుల్ సేకరించాలని వీటిని వైరాలజీ ల్యాబ్ కు పంపాలని,ముఖ్యంగా గర్భిణీలు,అప్పుడే పుట్టిన పిల్లల సీరం నమూనాలు వైరాలజీ ల్యాబ్ కు పంపాలని సూచించారు. కేరళా లో ఇప్పటికే 24 సంవత్సరాల గర్భిణిలో జికా కనిపించిందని,త్రివేండ్రంలో మరో 13 మంది లో ముగ్గురికి జికా ఉందన్న అనుమానం వ్యక్తం చేసారు.ఈమేరకు రోగుల నమూనాలను పూనా వైరాలజీ కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈమేరకు కేరళలో జికా వైరస్ కేసులు వెలుగు చూడడం తో కర్ణాటకా ప్రభుత్వం అప్రతమైంది ఈమేరకు కర్ణాటకా రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది దక్షిణ కర్నాటకలోని ఉడిపి,చామ రాజ నగరం కర్ణాటక సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేసాలలో పేర్కొంది.జికా వైరస్ విస్తరించే అవకాసం ఉన్నందున ఆశా,హెల్త్ వర్కర్స్ గ్రామీణ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని,యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కర్ణాటకా రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా కమీషనర్డాక్టర్ త్రిలోక్ ఒక ప్రకటనలోఆదేశాలు జరీ చేసినట్లు సమాచారం.
read moreపుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఏవి?
పిల్లలు కొందరు ఆరోగ్యంగా పుడితే ఇం కొందరు ఎదో ఒక వైకల్యం తో పుడతారు. వాటిలో ముఖ్య మైనది కాంజేనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే గుండె కవాతలకు వచ్చే జబ్బు. కోరోనరీ ధామానికి వచ్చే జబ్బు. మెడికల్ ట్రీట్మెంట్ కోసం గాని,సర్జరీ కోసం గాని డాక్టర్ల వద్దకు వచ్చే రోగుల ను గమనించినప్పుడు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు సంబందించిన వాళ్ళు 25% ఉంటె గుండె కవాటాల రోగులు 35%ఇతర కోరోనరీ ధామానికి సంబందించిన వాళ్ళూ ఉండడం గమనించ వచ్చు. పుట్టుకతో వచ్చే గుందేలోపాలకు అంతగా తెలీదు.పూర్వ కాలంలో అవి వారసత్వంగా వచ్చే జబ్బుగా అనుకునే వాళ్ళు.అది సరైన అభిప్రాయం కాదని,బహుశా గర్భంలో ఉండగా ఇన్ఫెక్షన్ కావడం వల్ల,,లేదా మేనరికపు వివాహాల వల్ల కావచ్చనేది మరో అభిప్రాయం. లేదా గర్భంలో ఉండే లోపాలు సరిగా ఎదుగుదల లేకపోవడం వంటిలోపాల మూలంగా కావచ్చునని అభిప్రాయ పడ్డారు. వైద్యులు శాస్త్రజ్ఞులు చేపుతునా ఆమ్సాల ప్రాతిపదికన ఏ ఇన్ఫెక్షన్ మూలంగా నైనా సరే శరీరంలో లోపల యన్టీ బాడీ తయారైతే అది గుండెను కూడా డ్యామేజ్ చేస్తుంది.అన్డుజే గొంతు ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు వైద్యులు. గుందేకవాటాల జబ్బులో 9౦ %రుమాటిక్ గుండె జబ్బులే ఇవి ఎక్కువగా గొంతు ఇన్ఫెక్షన్ కావటం మూలంగా వస్తాయని నిపుణుల అంచనా. గొంతు మాటిమాటికీ ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంటే ఆక్రమంలో కొన్నాళ్ళకి గుండె తీవ్రంగా దెబ్బతినే అవకాసం ఉంది. ఈ సమస్య ముఖ్యంగా మధ్య తరగతి,కింది మధ్య తరగతి కుటుంబాల వాళ్ళుఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కీళ్ళ నొప్పులు జ్వరం ఇన్ఫెక్షన్ కూడా ఈ వ్యాధిని కలగ జేసే అవకాసం ఉంది. కోరోనరీ ధమనికి వచ్చే వ్యాధుల గురించి మరింత వివరంగా చూద్దాం.
read moreకొలస్ట్రాల్ ను నిర్లక్ష్యం చేస్తే సమస్యలే ?
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బిపి,గుండె జబ్బులు,స్తూల కాయం అన్న మాట వింటూ ఉంటున్నాం.ముఖ్యంగా కో లేస్త్రాల్ ను గురించిన వాళ్ళు తెలియని వాళ్ళు అది ఎదో భూతం లాగా మనిషికి ప్రజలకి శత్రువు గా మాట్లాడం మనం చూడచ్చు. కొలస్ట్రాల్ ఈ ఆహార పదార్ధంలో ఉంది ఆ ఆహార పదార్ధంలో లేదు.దీనిని త్తినాలి దీనిని తినకూడదు అంటూ క్లాస్ పీకడానికి రెడీ అయిపోతారు. నిజానికి అసలు కొలస్ట్రాల్ అంటే ఏమిటి? అది ఎలా మన ఆరోగ్యం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది? మనిషికి కొలస్ట్రాల్ ఎంతమేరకు అవసరం? ఎంతుంటే ఎక్కువ ఎంతుంటే తక్కువ? అన్న ప్రాస్న్లకు సమాధానాలు చూద్దాం. కొలస్ట్రాల్ అనేది ఒక మెత్తటి మైనం లాంటి పదార్ధం.లివర్ చేత తయారు కాబడే ఈపదార్ధం రక్తంలో కలిసి మన శరీర మంత ప్రవహిస్తూ వివిధ హార్మోన్లు పిత్తరసం విటమిన్ డి ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కొలస్ట్రాల్ మనశరీరంలో ఎక్కువ ఉత్పత్తి అయితే అది రక్త నాళాల లో పేరుకు పోయి రక్త ప్రసరణకు అవరోధంగా మారుతుంది.ఎదిరో స్క్లేరో సిస్ అనే సమస్యకు దారితీస్తుంది.దీని వాళ్ళ గుండె పోటు,ఆకస్మిక మరణం సంభవించవచ్చు. కొలస్ట్రాల్ ని రకరకాల్ పర్యాయ పదాలతో పిలుస్తారు.బ్లడ్ కొలస్ట్రాల్,ఆహార సంబంద కొలస్ట్రాల్,అని ఫ్యాట్,అనికోవ్వు అని ఇందులోనే స్యచురేటేడ్ ఫ్యాట్ అని అన్ స్యచురేటేడ్ఫ్యాట్ అని హాయ్ డెన్సిటి లైపో ప్రోటీన్లు అని ఈరకంగా పేర్కొన్నారు. బ్లడ్ కొలస్ట్రాల్... రక్తం ద్వారా ప్రవహించే కొలస్ట్రాల్ ను బ్లడ్ కొలస్ట్రాల్ అని అంటారు. ఇది లివేర్లో ప్రవహిస్తుంది.మనం తిన్న ఆహారం నుంచి ప్రేవుల ద్వారా అరిగి రక్తంలో కలుస్తుంది. రక్తంలో ఉండాల్సిన దానికన్నా అధికంగా కొలస్ట్రాల్ ప్రవహిస్తున్నప్పుడు.అది ఇతర కొవ్వు పదార్శాలతో పాటు రక్త నాళాల లోపలి గోడమీద పేరుకు పోతుంది.కొన్ని సంవత్సరాలకు పెరికిపోయిన ఆకోలస్త్రాల్ రక్త నాళా లలో అడ్డుపడి గుండెపోటుకు దారి తీస్తుంది. మేడలు రక్త ప్రసరణకు ఆటంకం కలిగి తల తిప్పడం కళ్ళు తిరగడం లాంటివి ఏర్పడి పక్షవాతానికి దారి తీయవచ్చు. ఆహార సంబంధ కొలస్ట్రాల్... జంతువుల రక్త ప్రవాహంలో ప్రయాణించిన కొలస్ట్రాల్ వారి శరీర కణాలలో ఇరుక్కుపోయి.కొవ్వుగా ఏర్పడుతుంది.మాంసం తో పాటు కొవ్వును మనం భుజించినప్పుడు మనశరీరంలో చేరి కొవ్వుగా ఏర్పడుతుంది.దీనిని ఆహార కొలస్ట్రాల్ అని అంటారు. మనం తినే ఆహారం గుడ్లు,మాంసం మొదలైన వాటిలో ఈ రకమైన దైటరీ కొలస్ట్రాల్ ఉంటుందని వైద్యులు అంటున్నారు. కొవ్వు ఫ్యాట్ కొలస్ట్రాల్... కొవ్వు మనశరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.శరీరంలో విటమిన్లు అరగడానికి కూడా కొవ్వు దోహదం చేస్తుంది. ఇందులో శారేరానికి రెండురకాల ఫ్యాట్ ను ఇచ్చేవి ఉనాయి ఒకటి శ్యాచురేటెడ్,అన్ శ్యాచురేటేడ్ ఫ్యాట్ గా పేర్కొన్నారు. శాచురేటెడ్ ఫ్యాట్... స్యచు రేటెడ్ ఫ్యాట్ మనరక్తం లో కొలస్ట్రాల్ ను పెంచుతుంది.ఈ కొలస్ట్రాల్ మాంసం లో,చికెన్ లో,పాలు,వెన్న,లాంటి పాల ఉత్పత్తుల్లో,గుడ్లు,కొబ్బరి నూనె,పామాయిల్,వంటి వాటిలో ఉంటాయి.సాధారణంగా రెఫ్రిజిరేటర్ టెంపరేచర్లో ఇవి గడ్డ కట్టుకు పోతాయి. అన్ శాచు రేటెడ్ కొవ్వు ఫ్యాట్... అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ర్రేఫ్రిజేరేటెడ్ టెంప రేచర్లో కూడా గడ్డకట్టకుండా ద్రవ స్థితిలోనే వుంటుంది.శాచు రేటెడ్ ఫ్యాట్ కన్నా ఇది కాస్త బెటర్ దీనిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి.పోలి అన్ శాచు రేటెడ్ ఫ్యాట్,మోనో అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ గా విభజించారు. సన్ ఫ్లవర్ ఆయిల్,సా ఫ్లవర్ ఆయిల్,సోయాబీన్ ఆయిల్,పోలి అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుందని నిపుణులు తేల్చారు. వేరుసెనగ,నువ్వులనూనె,అలీవ్ ఆయిల్,,ఓడలైన వాటిలో మోనో అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. నిత్య జీవితంలో శాచు రేటెడ్ ఫ్యాట్స్ ను వాడుతూ ఉంటె మన రక్తం లో కొలస్ట్రాల్ అధికంగా ఉన్నా కూడా అది తగ్గు ముఖం పడుతుంది. లైపో ప్రోటీన్స్... ప్రోటీన్ కోటింగ్ ఉన్న ప్యాకేజీలు మన రక్తం లో కొలస్ట్రాల్ ని నోసుకుంటూ ప్రవహిస్తాయి.ఇందులో హై డేన్సిటి,లైపో ప్రోటీన్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్ అని విభజించారు. హై డెన్సిటి లైపో ప్రోటీన్ మనరక్తంలో కొలెస్ట్రాల్ ని లివరుకు పంపుతుంది దానిని శరీరం నుండి బయటికి పంపుతుంది.మీశరీరంలో హెచ్ డి ఎల్ ఎంత ఎక్కువగా ఉండే గుండె జబ్బుకు దూరంగా ఉంటారు. లో డెన్సిటి లైపో ప్రోటీన్స్ అంటే ఎల్ డిఎల్ రక్తంలో ఎక్కువగా ఉంటె రక్తంలో ని అధిక భాగాన్ని మీరే స్వయంగా మోస్తూ తీసుకు పోతాయి. అలా తీసుకు పోతున్నప్పుడు అక్కడక్కడా రక్త నాళాల్లో కొంతభాగం కొలస్ట్రాల్ ని వదిలి వేస్తాయి.అలా వదిలేసిన కొలస్ట్రాల్ ఆయా భాగాలలో రక్త ప్రవాహానికి అడ్డుపడి గుండె జబ్బులకి పక్షవాతానికి దారి తీస్తుంది.మీ శరీరంలో రక్తంలో లో డెన్సిటి ఎంత ఎక్కువగా ఉంటె అంతగా మీరు గుండె జబ్బులకు దగ్గరైనట్లు చెప్పవచ్చు.
read moreకోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హై బిపి షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి
ఫోర్టిస్ సి డాక్ సెంటర్ డయాబెటిస్,మేటాబా లిక్ డిసీజ్,సమస్యలు వస్తున్నట్లు ఎన్దొక్రేనలజీ ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి' ఈ మధ్య కాలంలో 7 నుండి 8 కేసులు చూసినట్లు వివరించారు.58 సంవత్సరాల స్త్రీలో టైప్ 2 డయాబెటిస్ వచ్చిందని ప్ర్త్కొన్నారు.కోవిడ్ 19 వ్యాక్సిన్ వల్ల అనుకోకుండా రక్తం లో బ్లడ్ షుగర్ శాతం పెరుగు తున్నట్లు గుర్తించారు. ఈ అంసాల పై మెడికల్ జర్నల్ డయాబెటిస్ లో ప్రచురించారు.కోవిడ్ 19 మొదటి వ్యాక్సిన్ కోవిషీల్డ్ మార్చ్ 4 న తీసుకున్నారు.వ్యాక్సిన్ కు మిందు వారిలో ఎటువంటి షుగర్ సమస్యలు లేవని షుగర్ లెవెల్స్ పూర్తిగా ఆడుపులోనే ఉన్నాయని రోజూ మందులు వాడుతున్నట్లు ఆత్రువాతే వ్యాక్సిన్ తరువాతే షుగర్ లెవెల్స్ ఒకే నెలలో పెరగడాన్ని గమనించి నట్లు గమనించమన్నారు.మెటః ఫామిన్ డోస్ పెంచుతున్నట్లు వీటితో పాటు యాంటిబాయిటిక్ డ్రగ్స్ ఇస్తున్నట్లుఫోర్టిస్ సిడాక్ చైర్మన్ డాక్టర్ అనూప్ మిశ్రావెల్ల డిం చారు. మరో వ్యక్తికి 64 సంవత్సరాల పురుషుడు.కాగా జనవరి 18 న కోవిషీల్డ్ నోదటి డోస్ తీసుకున్నప్పుడు బిపి పెరిగిందని 13౦ /8౦ ,16౦ /9౦ గా ఉందని గుండె నొప్పి చమట పట్టడం కొన్ని గంటల పాటు,రక్త ప్రసారంలో హెచ్చు తగ్గులు ఉన్నాయని అన్నారు. 65 సంవత్సరాల్ వృద్దునికి రక్తంలో గ్లుకోజ్ శాతం ఉందని దీనిని 15 రోజుల్లో నివారించగలిగామని అనూప్ తెలిపారు. కోవి షీల్డ్ వల్ల సహజమ్జానే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అలసట,తలనొప్పి,జ్వరం ఫ్లూ,లక్షణాలు ఉంటాయని కడుపు నొప్పి చర్మం దురద,బిపి ,షుగర్ లెవెల్స్ పెరగడం,డయాబెటిస్ నాన్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ కు ముందు ఆహారం వ్యాయామం సరిగానే ఉన్నాయని సహజంగా వ్యాక్సిన్ వల్ల బ్లడ్ షుగర్ పెరగవచ్చు అని జర్నల్ లో పేర్కొన్నారు. డాక్టర్ మిశ్రా మాట్లాడుతూ ఈ సమస్యకు పెద్దగా మార్పులు అవసర, లేదని వ్యాక్సినేషన్ తరువాత బ్లడ్ షుగర్ పెరగడం పై రోగి గత చరిత్రను చూడాల్సి ఉంటుందని మిశ్రా అభిప్రాయ పడ్డారు.
read moreప్రోస్టేట్ క్యాన్సర్కు వాడే మందుతో కోవిడ్ కు చికిత్స
ప్రోస్టేట్ క్యాన్సర్కు వాడే మందు కోవిడ్ కు వడ వచ్చు అంటున్నారు శాస్త్ర వే త్తలు. ఎస్సెక్స్ విశ్వ విద్యాలయానికి చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ నిర్వహించిన పరిశోదనలో భాగంగా అందుబాటులో ఉన్న మందుల ద్వారా ఇన్న్ఫెక్షన్ ను తగ్గించవచ్చ? అన్న కోణంలో పరిశీలించారు. వైరస్ కణాలను చేరకుండా నియంత్రించ గలదా? అనే కోణంలో పరిశోదనలు నిర్వహించారు. వైరస్ ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుందా శరీరంలోకి వైరస్ రాకుండా నివారించ వచ్చా?అయితే వైరస్ సత్వరం ఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతున్న విషయాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.శాస్త్రజ్ఞులు జరిపిన పరిశీలనలో ప్రోటీన్ ద్వారా ఊపిరితిత్తులలో కి వైరస్ చేరఫ్దాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.TMPRSS2 ప్రోటీన్ లెవెల్స్ తగ్గించడం ద్వారా చికిత్స చేయవచ్చ?పురుఉశులలో ఉండే సెక్స్ హార్మోన్లు అన్ద్రోజన్స్ వల్ల TMPRSS2శాతం పెరుగుతోందనిదీనివల్లే చాలా కణాల పై ప్రభావం చూపుతోందని నిర్ధారించారు.శాస్త్రజ్ఞుల పరిశీలనలో ప్రోస్టేట్ పై పరిశోదనలు చేస్తున్న డాక్టర్ గ్రెగ్ బ్రూక్ లైఫ్ సైన్సెస్ కు చెందిన డాక్టర్ బ్రూక్ ఎంద్రోజన్ బ్లాకింగ్ డ్రగ్ ద్వారా ఎంజాలుతోమిదే అనే మందు ప్రోస్టేట్ క్యాన్సర్ లో వాడే మందు వైరస్ ను తట్టుకో గలదని పేర్కొన్నారు.TMPRSS ను తగ్గిస్తుంది.మానవులలో ఉన్న ఊపిరి తిత్తుల కణాలను యాంటి అన్ద్రోజన్ గా గణ నీయంగా తగ్గాయి.సార్క్ కోవిడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ ను న్నిరోదించింది.పరిశోధకులు మాట్లాడుతూ వారి పరిశీలన లో శరీరం పై జరుగుతున్న సజీవ సాక్ష్యంగా మని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్లినికల్ ట్రైల్స్ లో దీనిని సమర్ధ వంతంగా పని చేస్తోందని యాంటి ఆన్ద్రోజన్స్కోవిడ్19 కు ప్రభావ వంతమైన చికిత్స గాతేల్చారు.క్యాన్సర్ కు ప్రత్యామ్నాయ చికిత్స పై దృష్టి సారించారు.వారి ప్రతిభా అనుభవాణ్ణి వినియోగించినైపుణ్యంతో వైరస్ కు వ్యతిరేకంగా పోరాదగలిగే మందులు మరిన్ని ఉంటె వాటిని వినియోగించడం ద్వారా ప్రత్యామ్నాయ మందులు వినియోగించే వీలుగా పరిశోదనలు చేస్తున్నారు. అయితే కోవిడ్ వైరస్ పురుషుల పైతీవ్ర ప్రభావం చూపుతున్నదాని మరణాలు శాతం ఎక్కువగా ఉన నేపధ్యంలో పురుషుల హార్మోన్లు అన్ద్రోజన్లు క్యాన్సర్ పై కొన్ని ఏళ్లుగా చేస్తున్న పరిశోదనలు ప్రోస్టేట్ క్యాన్సర్కు వాడుతున్నామని ఇప్పుడు సార్క్ వైరస్ ఇన్ఫెక్షన్ పై ఈ మందును ప్రయోగాత్మకంగా పరిసీలించినట్లు చెప్పారు.ఈసందర్భంగా డాక్టర్ బివెన్ మాట్లాడుతూ మా పరిశోదన ఇతర మందుల వాడకం పై కూడా పరిశోదనలు చేయనున్నట్లు తెలిపారు.ఆర్మోన్లకు సంబంధించి కొన్ని ఔశాఫాలు అందుబాటులో ఉన్నాయని ఇతర దీర్ఘకాలిక సమస్యలు వాటికీ అందుబాటులో ఉన్న వైద్య పద్దతులు పై పూర్తిగా దృష్టి సారించనున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కు చేసే చికిత్స తో కోవిడ్ కు ను కట్టడి చేయవచ్చు.
read moreఅందుకే డాక్టర్ ప్రజలకు దేముడయ్యాడు
యముడు ప్రాణం తీస్తాడు డాక్టర్ ప్రాణం పోస్తాడు.అందుకే డాక్టర్ ప్రజలకు దేముడయ్యాడు అత్యవసర సమయంలో రోగికి సేవల నందించే ప్రాణ దాత లందరికీ తెలుగు వన్ హెల్త్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇక తనకు జీవితం అయిపోయిందన్న నిరాశలో ఉన్న రోగికి భరోసా ఆసరా డాక్టర్. సమస్య ఏదైనా సరే దాని మూలాన్ని కనుకుని మిణుకు,మినుకు మంటున్న ఆశాదేపాన్ని ఆరనీకుండా శరీరంలో ఎక్కడ సమస్య ఉన్న సరే సెలైన్ఇచ్చిమళ్ళి ప్రాణం పోస్తాడు. ఇక విషయా ని కి వస్తే ప్రతియేటా జూలై 1 న జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జూలై 1 డాక్టర్స్ కు ప్రత్యేకమైన రోజు అంటే డాక్టర్స్ చేసిన చేస్తున్న గుర్తింపు నివ్వడమే.ఈ రోజును బెంగాల్ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ స్మృతికి చిహ్నంగా ఈ రోజును జరుపుకోడం డాక్టర్స్ కు స్ఫూర్తినిస్తుంది. జాతీయ డాక్టర్ల దినోత్సవం ప్రాముఖ్యత తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతిదేశంలో కొన్ని కొన్ని వేరు వేరు తేదిలలో జరుపు కుంటారు.మొట్ట మొదట199౩ లో యు ఎస్ లో జాతీయ డాక్టర్ల దినోత్సవం జరుపుకున్నారు. జార్జియా,ఫైల్లిప్పిన్స్,లో మరణించిన వారి స్మారకార్ధం డాక్టర్స్ డే నిర్వహించారు.క్యూబాలో మార్చ్ ౩౦ న జరుపు కుంటారు. డాక్టర్స్ డే ను కేంద్రం 1991 లో గుర్తించింది.బిసి రాయ్ ఆరోగ్య రంగంలో చేసిన సేవలకు గాను వారి స్మారకార్ధం జరుపుకుంటారు. చిత్తరంజన్ సేవాసదన్,కమలా నెహ్రు మెమోరియల్ ఆసుపత్రి,విక్టోరియా ఇన్స్తిటూట్,చిత్తరంజన్ క్యాన్సర్ ఆసుపత్రి.చిత్తరంజన్ సేవా సదన్. స్త్రీలు పిల్లల కోసం ఏర్పాటు చేసారు. ఆరోగ్య రంగం లో ప్రజా ఆరోగ్యం కోసం తన జీవితాన్ని ఆస్థి పాస్తులను పూర్తిగా త్యాగం చేసి ప్రజా ఆరోగ్య రంగానికి జవసత్వాలు ఇచ్చిన డాక్టర్ రాయ్ చిరస్మరణీయుడు.కొన్ని అత్యవసర సమయంలో శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే ఎక్కడున్నా అప్పటికప్పుడు సర్జరీ చేసేందుకు తన సుఖాలను సైతం వదిలి ముందుకు వచ్చే డాక్టర్స్ చాలానే ఉన్నారు అటు ఇల్లు వదిలి వ్రుత్హినే పూర్తిగా నమ్ముకుని అహరహం శ్రమిస్తున్నడాక్టర్స్ కు సెల్యుట్ చేస్తుంది. డాక్టర్స్ మానవుల ఆరోగ్య సంరక్షణ-ఆహారం-వ్యాధి కరక మైన వాటిని నిర్మూలించడం ---ధామస్ ఎడిసన్ మందు వ్యాధిని నయం చేస్తుంది-డాక్టర్స్ రోగులకు నయం చేస్తారు.--ప్రపంచానికి మీరు తల మానికం ముఖ్యంగా కోవిడ్ ప్యాన్దమికి సమయంలో తమకు కోవిడ్ వస్తుందని తెలిసినా రోగులకు సేవచేస్తూనే మరణించిన డాక్టర్స్ సేవనిరాతికి వారికి తెలుగు వన్ శ్రద్దాంజలి గతిస్తూ వారి సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోడం సముచితమని భావిస్తున్నాం.కోవిడ్ తీవ్రత ముప్పు ఉందని తెలిసినా డాక్టర్స్ హెల్త్ వర్కర్స్ 24 ఘంటలు సేవలు అందిస్తు దేశానికీ సేవ చేస్తున్న చేసిన ప్రత్యేకంగా ఆరోగ్యరంగం కష్ట సమయంలో సేవలు అందించిన నర్సింగ్ సిబ్బందికి వారిని ప్రత్యేకంగా గౌరవిద్దాం,గ్రామీణ ప్రాంతాలలో మిఖ్యంగా మారుమూల ప్రాంతాలలో పేదలకు నిరుపేదలకు ఉచితంగా మందులు సేవలు అందించిన డాక్టర్స్ కు అభినందనలు అందిస్తోంది మీసేవకు విలువ కట్టేలేనిది. అయితే అందరికీ ఆరోగ్యనిధిని ఇద్దాం ధైర్యం చెపుదాం అందరూ ఆతోగ్యంగా ఉండేలా చూద్దాం. కోరోనలు ఎన్నివచ్చిన మనలను ఏమి చేయలేదన్న ఆత్మస్ఫ్ధైర్యాన్ని ఇద్దాం మనలను య్హోతివారిని కాపాడుకుందాం.డాక్టర్స్ అందరికీ పేరు పేరు నా శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్ హెల్త్ చనం టీం.
read moreఊబకాయానికి ప్రమాద కారకాలు మీకు తెలుసా?
ఊబ కాయం వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేదిస్తోంది. ఊబా కాయం పై నిర్వహించిన పరిశోదనలో ర్యాండం గా ఊబ కాయాన్ని తగ్గించేందుకు వీలున్న సప్లి మెంట్స్- ప్రత్యామ్నాయ తెరఫీ పద్ధతులపై పరిశోదనలు చేసారు.ఉన్నత ప్రమాణాలాతో కూడిన ఉత్పత్తుల పై సమీక్షించారు.సప్లి మెంట్స్ ఉత్పత్తుల రంగానికి బద్రత ఉత్పత్తులపై దాడులు మరియు ఉత్పత్తుల ప్రచారం అంశం పై సమీక్షించారు.సప్లి మెంట్స్ కొన్ని సందర్భాలలో పక్క దారి పట్టడం పై సమీక్షించారు. కౌన్సిల్ ఫర్ రేస్పొంసిబుల్ న్యూట్రిషి యన్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశ్రమకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.అసలు ఈ నూతన పరిశోదనకు ఉన్న విలువ ఏమిటి? అన్న అంశం ప్రశ్నించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆధునిక పద్దతుల ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకుంటారు. అమెరికాలో 1/3 వంతు మంది దైటేరీ సప్లి మెంట్స్ వాడినట్లు తెలిపారు.దీతో వారి లక్ష్యం పూర్తి చేసినట్లు చెపుతారు. నూతన సమీక్ష తరువాత ఉన్నత ప్రమాణాలు నాణ్యతతో కూడిన సాక్ష్యం ఆధారంగా బరువును తగ్గించేందుకు నిర్దేశించిన ఉత్పత్తులు ప్రత్యామ్నాయ తెరఫీలు లేవని తేలింది. క్లినికల్ ట్రైల్స్ లో ఒక ర్యాండం ప్రకారం నిర్వహించి గోల్డ్ స్టాండర్డ్ క్లినికల్ రీసెర్చ్ గురించిన వివరాలు ఒబేసిటీ జర్నల్ లో ప్రచురించింది. పరిశోదనలో క్లినిషి యన్స్,శాస్త్ర వేత్తలు,ఉత్పత్తి దారులు ఊబకాయం తగ్గించే ఉత్పత్తుల పై పూర్తి స్థాయిలో మూల్యాంకనం జరగాలని అన్నారు.నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ చాపెల్ హిల్ కు చెందిన ఎం డి బట్సిస్ క్లినిషియన్స్ ఇచ్చిన వివరాల ప్రకారం రోగులకు అత్యవసరమైన పక్షం లో రోగులకు సూచిస్తా మని అన్నారు.అయితే అనుమతి పొందిన తెరఫీలు లేవు.గతంలో స్థూల కాయులు అమెరికాలో లేరని ఈ మధ్య కాలం లో స్థూల కాయులు బాగా పెర్గిపోయరని పేర్కొన్నారు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2౦౦7 -2౦౦8 లో33.7%2౦15-2౦16 లో39.6%పెరిగింది.డయాబెటిస్,గుండె సమస్యలు,క్యాన్సర్ త్వరగా చనిపోవడం వంటి సమస్యలు జరుగుతున్నాయనిపరిశోదనలో తేల్చారు. తరచుగా బరువు తగ్గేందుకు తీవ్ర ప్రయాత్న్సాలు చేస్తున్నారనివీటికి చేసే చికిత్సలు ఎఫ్ డి ఏ అనుమతులు లేవని తెలిపారు. సరైన ఆరోగ్య నిపుణులు పెద్దగా లేరని యాంటీ ఒబెసిటీ థెరపీ నిపుణులు లేరని చాలా మంది ప్రజలు ప్రిస్కిప్షన్ లేకుండానే బరువు తగ్గే సహజంగా ఉండే సప్లి మెంట్స్ ను నమ్ముతారు.సహజమైన లేదా క్లినికల్ గా నిరూపితమైన ప్రొడక్ట్స్ లేవు. వినియోగ దారులు ఎఫ్ డి ఏ అనుమతించిన ఉత్పత్తులను నమ్ముతారు. వైద్య వృత్తి చేసే నిపుణుల వద్ద సరైన సమగ్ర సమాచారం ఉండదని తెరపీల పై శాస్త్రీయమైన క్లెయిమ్ లేవని ప్రచారం చేసే వారికి సైతం పూర్తిగా అవగాహన ఉండదని సమీక్షించారు. అక్యుపంక్చర్. గ్రీన్ టీ ఎఫేద్ర-కఫ్ఫే గువర్గం కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ చాక్లెట్ -కోకా చరోమ్లుం పి రు వటే మైండ్ బాడీ తెరపీస్ 315 అంశాల పై ట్రైల్స్ నిర్వహించగా అందులో 52మాత్రం తక్కువ ప్రమాదం ఉందని వాటి ప్రభావం ఆధారం గా క్లెయిమ్ చేయవచ్చు.16 సంతృప్తికరంగా బరువు తగ్గారని ౦.3నుంచి 4.93 కిగ్ర తగ్గినట్లు నిరూపించారు. సప్లిమెంట్ల పై చేసిన పరిశోదనలో చాలా తక్కువ మందికి ఊబాకయం తగ్గినట్లు గుర్తించారు. కొన్ని పౌన్లు కూడా తగ్గ లేదు.ఆరోగ్యం పై ప్రభావం చూప లేక పోయాయని అన్నారు. డైటీ సప్లిమెంట్ల పై మరిన్ని అంశాలు మూల్యాంకనం చేయాల్సి ఉంది.ఇఊబాకాయం తగ్గడానికి ప్రత్యామ్నాయ తెరఫీలు నాణ్యత లేనివని ఉత్పాదనలను సూచించ బోమని కాబ్బట్టి నాణ్యతా ప్రమాణాలు లేని సప్లిమేన్ట్లను వాడకండి.
read moreమన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఆరోగ్యానికి రోగనిరోదక శక్తికి సంబంధం ఏమిటి? అసలు రోగ నిరోధక వ్యవస్థ గురించి కొన్ని కీలక అంశాలు తెలుసుకుందాం రోగ నిరోధక శక్తి తగ్గితే శరీరంలో ఏ ఏ అవయవాలు ప్రభావిత మౌతాయి? అన్న విషయం తెలుసుకుందాం. అసలు రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తిన డానికి కారణం ఏమిటి? ఏ దైనా పత్రికను తిరగేస్తూ ఉండగా పొరపాటున మధ్య పెజిలో పిన్ను మీ వేలుకు గీసుకుని గాయమతే మీరు ఏమి చేస్తారు?చివ్వుమన్న నొప్పి వస్తే అబ్బ అని వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించ కుండా మీ వేలును నోట్లో పెట్టుకుంటారు. అసలు పిన్ను గ్గుచ్చుకున్న వంటనే మీ శరీరంలో వచ్చే మార్పు ఏమిటో మీకు తెలుసా? పిన్ను గుచ్చుకోగానే చాలా సూక్ష్మ క్రిములు మీ శరీరం లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. వెంటనే మీ శరీరంలో రోగ నిరోధక యంత్రాంగం అలెర్ట్ అయి ఆ బ్యాక్టీరియాను నాశనం చేయడానికి చేసే ప్రయత్నంలో,గాయాన్ని మాన్పించే ప్రయత్నం లో తల మునక లై పోతుంది. ఆ పోరాటంలో రోగ క్రిములు నశించ వచ్చు.లేదా శరీర కణజాలమునశించ వచ్చు. గుండె ఊపిరి తిత్తులు లాగే రోగ నిరోధక వ్యవస్థను.కూడా మన శరీర మంతా వ్యాపించి ఉంటుంది. బయటి నుంచి మన శరీరం మీద దాడి చేసే మిలియన్ల కొద్ది రసాయనాలు సూక్ష్మ క్రిముల నుంచి జీవితంతాం కాపాడు తూనే ఉంటుంది. మనలోని రోగ నిరోధక వ్యవస్థను మన శరీరానికి సంబందించిన కాణా లేవో స్పష్టం గా తెలిసి ఉంటుంది. శరీరానికి సంబందించిన కణ జాలం(బ్యాక్టీరియా లాంటిది) ఏ దైనా లోపలికి ప్రవేశించి నప్పుడు.రోగనిరోదక వ్యవస్థ వెంటనే స్పందించి వాటి పైన దాడి చేస్తుంది.శరీరం లోపల యాంటీబాడీస్ ని సృష్టించుకుని బ్యాక్తీరియాతో పోరాడించ వచ్చు.లేదా బ్యాక్టీరియాతో నేరుగా పోరాడే కాణ జలాన్ని ప్రేరేపించిరోగ క్రిములను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ క్రింది అవయవాల ద్వారా పని చస్తుంది. 1)థైమస్ గ్రంది. 2)ఎముకలలోని మూలుగ 3)లీంఫ్ గ్రందులు. 4)లింఫ్ నాళాలు. 5)ప్లీహము. ఇప్పుడు వీటిలో ఒకదాని గురించి ఒకటి తెలుసు కుందాము. 1)ఛాతి ఎముకకు వెనుక వైపున వుండే గ్రంధి ఉత్పత్తి చేసే తెల్ల రక్త కణాలు టి -లింఫసైట్స్ గా పరిణతిచెంది.శరీరం లోపలి ప్రవేసించిన వైరస్ లతో పోరాడతాయి. 2)టి- సెల్స్ గా పిలవబడే ఈ కణాలకు మరి కొన్ని కణాలు తోడై అన్నీ కలిసి వైరస్ మీద మొత్తంగా పోరాటంకి దిగుతాయి. 3)టి- సెల్ల్స్ తో కూడె మిగతా కణాలు... సహాయక టి-సెల్ల్స్.... ఈ కణాలు బి-లింప సైట్ అనబడే మరో రకపు కణాలతో యాంటీ బాడీస్ వృద్ధి కావడానికి దోహదం చేస్తాయి. (ఎయిడ్స్ వ్యాధిలో ఎయిడ్స్ వైరస్ ఈ హెల్పర్ టి-సెల్స్ నే నాశనం చేసి మనిషని నిర్వీర్యం చేస్తాయి.) 4) కిల్లర్ టి సెల్స్... మన శరీరానికి సంబందించిన బయటి కాణ జాలం లోపలి ప్రవేశించి నప్పుడు ఇవి త్వరిత గతిన వరూధి చెంది వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి.మన శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లను నాశనం చేసేది ఈ కిల్లర్ టి సెల్ల్స్ అని నిపుణులు పేర్కొన్నారు. 5) సశ్రేసర్ టి -సెల్స్.... మన శరీరంలోకి ప్రవేశించిన శత్రువు ఇన్ఫెక్షన్ ఒడి పోగానే ఇక యుద్ధాన్ని ఆపమంటూ.ఈ కణాలు యుద్ధ విరమణ సూచన ను అదేసిస్తాయిసశ్రేటర్-టి సెల్ల్స్ కనుక బలహీన పడ్డ లేక పనిచేయక పోయినా రోగ నిరోధక వ్యవస్థకు చెందిన మిగతా కణాలు పోరాటాన్ని ఆపవు. అలంటి సందర్భంలో ఇన్ఫెక్షన్ అనబడే శత్రువు లేకపోతే అవి మన శరీర కణజాలం మీదే పోరాటాన్ని సాగించి రోమటైద్ ఆర్త్రైటిస్ వంటి కీళ్ళ వ్యాధులకు కారణం అవుతుంది. 6)ఎముకలలో మూలుగ... మన ఎముకలలో ఉండే మూలుగ అనే పదార్ధం తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.ఈ తెల్ల రక్త కణాలుశరీరం లోపలి ప్రవేశించిన స్సూక్ష్మ క్రిములతో పోరాడు తాయి. 7)లింఫ్ గ్రంధులు..... లింఫ్ గ్రంధులు బి-లింఫో అనబడే ఒక రకమైన తెల్ల రక్త కణాలను తయారు చేస్తాయి. ఈ బి సెల్స్ పై భాగాన ఇమ్యునో గ్లోబులిన్ అనే ఒక ప్రోటీన్ పదార్ధం ఉంటుంది.ఈ బి సెల్ల్స్ ఇన్ఫెక్షన్ తో పోరాడే యంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. 8 )లింఫ్ నాళాలు.... ఈ నాళాలు మన శరీరంలో ఇన్ఫెక్ట్ అయిన భాగాన్నుంచి సూక్ష్మ క్రిములను లింఫ్ గ్రంధుల వద్దకు చేరుస్తాయి.అక్కడ లింఫ్ గ్రంధులు తయారు చేసే యాంటీ బాడీస్ ఆ సోక్ష్మాల పైన దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. 9)ప్లీహము..... రక్త ప్రవాహము ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములుఇక్కడ తెల్ల రక్తకణాలతో ముంచెత్త బడి నాశనం చేయబడతాయి. రక్త నాళాలు.... రక్త నాళాల ద్వారా తెల్ల రక్త కణాలు,యాంటీ బాడీస్,శరీరమంతా ప్రయాణిస్తూ శరీరానికి అపకారం కలిగించే బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతూ మన ఆరోగ్యానికి పహారా కాస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ రెండు రకాలు.... 1) ఇన్నేట్ ఇమ్మ్యునిటి 2 )అడప్టివ్ ఇమ్మ్యునిటి. ఇన్నేట్ ఇమ్యునిటిలో చర్మం కొంత ప్రాముఖ్యత వహిస్త్గుంది.నోరు,గొంతు,కళ్ళు,ప్రేవులు,యోని, మూత్రనాళాలలో తయారయ్యే ఎంజైములు అనబడే పదార్దాలు మిగతా ప్రాముఖ్యత వహిస్తాయి. 2) ఇవన్నీ మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తూ ఉంటాయి.పసి పిల్లలు తల్లి గర్భంలో వుండగాతల్లి శరీరం నుంచి లభించే యాంటీ బాడీస్ ద్వారా రక్షణను పొందితే ఆ తరువాత తల్లి అందించే స్తన్యం ద్వారా రక్షణను పొందుతారు. 3)మనిషి పెరిగి పెద్ద పెద్ద అవుతూ వివిధ రకాల సూక్ష్మ క్రిములు దాడికి గురి అవుతున్నా కొద్ది అతని శరీరం తనకు తాను రోగ నిరోధక చర్యలను సంతరించుకుంటుంది.దీనిని అడప్టివ్ ఇమ్మ్యునిటీ అంటారు.దీని మూలంగా శరీరం లోకి ప్రవేశించిన సూక్ష్మ క్రిములను తెల్ల రక్తకణాలను గుర్తుంచుకుని మల్లె అలాంటి క్రిములు లోపలి ప్రవేశించినప్పుడు పూర్వంలో ఉండే యాంటీ బాడీస్ తిరిగి సృష్టించి విజయాన్ని సాధిస్తాయి. ఈ సిద్దాంతం ఆధారం గానే కృత్రిమంగా టీకాలను తయారు చేసుకుని వాటితో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుచుకుని పోలియో లాంటి కొన్ని వ్యాధులను దగ్గరికి రాకుండా అడ్డుకట్ట వేయగాలిగాం అయితే అదే పద్దతిని అవలంబించ్గడం ద్వారా టీకా తోనే కోవిడ్ వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమని అనుకోవచ్చ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ఫెక్షన్ నిరోదించే ఇతర చర్యలు... ---లాలాజలం ----నోటి ద్వారా లోపలి ప్రవేసించే సూక్ష్మ క్రిములను లాలాజలం తో ఉండే ఎంజైమ్ లు నాశనం చేస్తాయి. కనీరు ----కంటిలోపలికి ప్రవేసించే సూక్ష్మ క్రిములు కన్నీటి ద్వారా బయటికి పంపడం జరుగుతుంది.ఇంకా ఎమన్నా సూక్ష్మ క్రిములు కంట్లో మిగిలి ఉంటె కన్నీటి తాలూకు ఎంజైమ్లు వాటిని నసింప చేస్తాయి. ముక్కు ---- దుమ్ము ధూళి ద్వారా ముక్కు లోకి ప్రవేసించే సూక్ష్మ క్రిములను ముక్కులోపల ఉండే కేస నాళికలుబందించి చీమిడి ద్వారా ఎమన్నా లోపలి వెళితే దగ్గటం ద్వారా మనం వాటిని మనం బయటకి నెయ్యేస్తాయి. ప్రేవులు ----- కడుపులో తయారయ్యే యాసిడ్ అక్కడికి చేరుకున్నాక సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.ప్రేవులలోకి ప్రవేశించిన సూక్ష్మ క్రిములను ప్రేవులలోనే నిలువరించే సహాయక బ్యాక్టీరియా నసింప చ్గేస్తాయి. మూత్ర నాళాలు---- మూత్రనాళాలలోని సహాయ బ్యాక్టీరియా అక్కడికి ప్రవేసించే సూక్ష్మ క్రిములను నసింప చేస్తాయి.స్త్రీలకు యోనిలో ఉంటె మ్యుకస్ లైనింగ్ కూడా అక్కడ ప్రవేసించే సూక్ష్మ క్రిములను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. చర్మం ----- చర్మ గ్రంధులలో ఉత్పత్తి అయ్యే స్వేద గ్రంధులలో ఉత్పత్తి అయ్యే నూనె స్వేదం చర్మం ద్వారా లోపలి కి ప్రవేసింపచేసే సూక్ష్మ క్రిములను నసింప చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలా మనశరీరంలోని ప్రతి భాగము బయటి నుంచి వచ్చి దాడి చేసే సూక్ష్మ క్రిములను నాశనం చేయడంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ ఉంటాయి. మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయ్యా లంటే సూత్రాలు----- విటమిన్లు ,ఖనిజలవణాలు,సమృద్ధిగా లభించే సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ శరీర వ్యాయామం చేయాలి. అయితే ఆతిగా వ్యాయామం వద్దు. ఒత్తిడులకు దూరంగా ఉండాలి.పొగ తాగడం మద్యం సేవించడం మానుకోవాలి. అప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్పై పోరాదగలం.
read moreభీమా – ధీమా
మీరు భీమా కట్టరా? అయితే మీరు ధీమా గా ఉన్నారన్న మాట. అయితే మరీ అంతా ధీమాగా ఉండకంటి, ఇందులో కూడా కొన్ని నష్టాలు కష్టాలు ఉన్నాయి అవి ఏమిటో సమస్యకు పరిష్కారానికి ప్రయత్నమే చేయడమే మా భీమా – ధీమా కార్యక్రమం. సొ వెల్కంటు భీమా ధీమా కార్యక్రమం... మొంటేజ... మనిషికి భీమా ఉంటే ధీమా ఏ వేరని అని అనుకుంటున్నారు సామాన్యులు. కొందరికి భీమా భారంగా మారిందని. ప్రతి సంవత్సరం మనం పెట్టె పెట్టుబడికి మనకు వచ్చే ఆదాయం ఎంత అన్న ప్రశ్న వేదిస్తోంది. ఇది నిజం అయితే సంవత్సరం వచ్చిందటే ఇన్సూరెన్స్ పోలసీ కోసం కంపెనీలు పడరాని పాట్లుపడతారు. మీకు 80 సి ప్రకారం ట్యాక్స్ ఎగ్జంషన్ వస్తుంది అంటూ అసలు ఒప్పంద పాత్రల చూడ కుండానే సంతకం చేసి ఇచ్చేస్తున్నారు పోలసీ దారులు. అసలు పాలసీ అంటే ఏమిటి? పాలసీ విలువ ఎంత? ఏ పాలసీ కి ఎంత కట్టాలి ? పాలసీ మెశ్చురి టీ ఎన్నాళ్లు? భీమా మధ్యలో పాలసీ దారుకు జరిగే నష్టాన్ని ఎలా లెక్క కడతారు? కాష్ లెస్ పాలసీ ఏ ఇన్సూరెన్స్ పరిధి లోకి వస్తుంది? రీ ఎంబర్స్ మెంట్ పాలసీ అంటే ఏ మిటి? ఇన్వెస్ట్ మెంట్ పాలసీ అంటే ఏమిటి ? లైఫ్ ఇన్సూరెన్స్.నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి అన సందేహాల కు మానిపుణులు ఇచ్చే సమ ధానాలు , సలహాలు సూచనలు మీకోసం అందిస్తోంది రాజ్ న్యూస్ అసలు ఇన్సూరెన్స్ లో ఉన్న నిజాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు, క్లెయిమ్ లు ఇవ్వడం లో ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం చేస్తే ఎవరిని సంప్రదించాలి? కోర్టుకు వెళ్తే సమస్య మరింతజటిలం అయ్యే అవకాశం ఉన్నదున అంబుట్స్ మెన్ కమిటీ ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అన్న సందేహాలకు సమాధానం భీమా – ధీమా . అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటో ఈ ఏ . వి చూద్దాం. ఇన్సూరెన్స్ ఈ పదం గురించి తెలియని వాళ్ళు ఈ మధ్య కాలం లో లేరంటే అతిశయోక్తి లేదు నిజానికి తెలిసో తెలియక ఎప్పుడో ఎక్కడో ఏ స్నేహితుడి ప్రోత్సాహంతోనో భీమా అస్దే ఇన్సూరెన్స్ కట్టేఉంటారు. దానిని వినియోగించుకునే ఉంటారు. లేదా మధ్యలోనే ప్రీమియం కట్ట లేక ఆపేసి ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ ఈ రోజు నిత్య అవసరంగా మారింది. ముఖ్యంగా దిగువా మధ్య త్రాగతి ప్రజలకి , ఉద్యోగులకి ఇన్సూరెన్స్ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి గా చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఊ దర కొట్టే ప్రకటనలు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ల కు భారీ కమీషన్లు ముడుతూ ఉండడం తో సంవత్సరానికి 7000/ రూపాయలు కట్టండి ఇన్సూరెన్స్ మీకు నెల రోజుల్లో ఆక్టివేట్ అవుతుంది. మీరు ఒకవేళ అనారోగ్య సంస్య వస్స్థే మీకు దగ్గరలో ఉన్న అసు పత్రి లో ఐనా చేరండి. ఇది క్యాష్ లెస్ పాలసీ అంటూ చెప్పగానే ఏజెంట్ల మాటలను నమ్మి డబ్బు కడుతున్నారు పాలసీదారులు. మీ పాలసీ కి సం అస్సుర్డ్ అమౌంట్ 50000/ ఆక్షరాలా ఐదు లక్షలు వస్తుంది అని అనగానే అయితే తీసుకుందాం డబ్బు ఉన్న రోజు ఉంటుంది లేని రోజూ ఉంటుంది. అత్యవసర సమయంలో ఆడుకునే బీమా ఉందిగా అనుకుని ధీమా గా ఉంటారు అసలు భీమలు ఎన్నిరకాలు ఏ పాలసీ పెట్టుబడి దారుకు లాభ దాయకం అన్న అంశాలు నిపుణులు చెప్తారు లెట్స్ గో ఫోర్ ఫాక్టర్స్ -.అసలు ఇన్సూరెన్స్ భారత్ లో ఎలా పుట్టింది దానిచరిత్ర పూర్వోత్తరాలు తెలుసు కోడం అవసరం ఏమంటారు. ఇన్సూరెన్స్ ఆక్ట్ 1938 ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ ను భారత దేశంలో 19జనవరి 1956 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం అప్పటికే 245 కంపనీలు పని చేస్తున్నాయని వీటి అన్నిటి ఒక గొడుగుకిందకు తీసుకు వచ్చేందుకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ను ప్రారంభించింది. అయితే అన్నీ ప్రధాన కంపెనీలే ఇవి నాలుగు రాష్ట్రాలలో మెట్రోపాలిటన్ నగ రాలలో అంటే 19999 నాటికి ప్రైవేట్ రంగం లో ఇన్సు రెన్స్ లేదని పరిశోదనలో వెల్లడి అయ్యింది. వాటి పూర్వాపరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్,,గా కేటగిరీ లుగా విభాగించారు అయితే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ని జనరల్ ఇన్సూరెన్స్ గా పరిగణిస్తారు. ఈ రెండు ఇన్సూరెన్స్ లు ఐ ఆర్ డి ఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యు లేటరీ ఆథారిటీ అండ్ దవలప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. ఇర్ డా ఇన్సూరెన్స్ రంగాన్ని పర్య వేక్షిస్తుంది. ఇన్సూరెన్స్ కు కస్టోడియన్ గా ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్ల హక్కుల పరి రక్షణకు ఇరిడా క స్టో డియన్ అని చెప్పాలి. భారతదేశంలో 57 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 24 ఇరవై నాలుగు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు కాగా 33 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలుఉన్నాయి. అందులో కొన్ని 7 పబ్లిక్ రంగం విభాగంలో పనిచేస్తున్నాయి. గతంలో కొన్నిదశాబ్దాలుగా ఇన్సూరెన్స్ అంటే ఠక్కున గుర్తికు వచ్చేది ఎల్ ఐ సి మాత్రమే అంటే జీవిత భీమా సంస్థ, అదే పెద్ద వ్యవస్థ గా పేరెన్నిక గన్న ఏకైక సంస్థ అంటే అతిశయోక్ఠీ కాదేమో. లేదా కొన్ని పేరెన్నిక సంస్థలుగా చెప్పుకునే సంస్థలలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, మాత్రమే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా జనరల్ ఇన్సూరెన్స్, రంగం గా పేర్కొన్నారు.దీనిగురించిన మరిన్ని వివరాలు. తెలుసుకుందాం... ప్రభుత్వ రంగంలో కొనసాగిన ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో విస్తరించింది. ఇరిడా ఇన్సూరెన్స్ రెగ్యు లేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా లో ఎన్నో మార్పులు చేర్పులు చేసిన తరువాత ఇన్సూరెన్స్ రెగ్యులే టరి ఛత్రం 1999 ప్రకారం. ప్రైవేట్ రంగంలో ఎఫ్ డి ఏ అంటే ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ను ఆహ్వానించింది భారతప్రభుత్వం. అయితే చట్ట ప్రకారం ఎఫ్ డి ఐ లను 26% పరిమితి విదిస్తూ 2016 లో చట్టం తీసుకు వచ్చింది. ఇక ప్రైవేట్ రంగం లోకి ఇన్సు రెన్స్ ఎప్పుడైతే పెట్టుబడులకు ఆహ్వానం పలికిందో 2000 సంవత్సరానికి, ఇన్సూరెన్స్ రంగం రూపు రేఖలు మారిపోయాయని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపనీలు 30 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ రాగాన్ని శాశిస్తు న్నాయని నిపుణులు విశ్లేషించారు. ఇంకా మరెన్నో కంపెనీలు ఇరిడా అనుమతికోసం నిరీక్షిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ రంగంలో దూసుకు పోతున్న ఇన్సూరెన్స్ రంగం లో 19 జనరల్ ఇన్సురేయన్స్ కంపెనీలు, 5 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు , విదేశీ కంపెనీలు కలిసి ఇన్సూరెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసి నట్లు అయ్యిందని నిపుణులు తమ పరిశోధనలో వెల్లడించారు. భారత దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం కావడంతో ఎఫ్ డి ఐ ని 2000 సంవత్సరానికి 26% పరిమితి విదించింది. తరువాత 2014 లో ఎఫ్ డి ఐ ను 49% పరిమితి ని విదిస్తూ ఇరిడా ఇన్సూరెన్స్ చట్టం 2015 లో మార్పులు చేసిందని విశ్లేషకులు వివరించారు. అయితే ఇప్పటికీ ఎల్ ఐ సీ ఇన్సూరెన్స్ రంగం పై తన ఆది పత్యాన్ని కొనసాగించడం విశేషం ప్రవైట్ రంగంలో వచ్చిన హెచ్ డీ ఎఫ్ సీ, ఐ సి ఐసి ఐ , ఎస్ బి ఐ, బ్యాంకులు సైతం ఇప్పటికీ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఇన్సూరెన్స్ కంపెనీలువచ్చి చేరడం తో 2017 నాటికి ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం లో విస్తరణ గణనీయంగా పెరిగింది. ఇన్సు రెన్స్ కంపెనీలు ఆతి తక్కువ ప్రీమియం, తో పాటు, అధిక మొత్తంలో క్లైమ్ ఆఫర్ చేస్తున్నప్పుడు. సహజంగానే డోమెస్టిక్ ఎకానమీ ని నియంత్రించ గలిగింది. చదువు కున్న వాళ్ళకి సామాన్యుడికి అర్ధం కాని అంశం అసలు తాము తీసుకున్న పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా? లేక, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నా? అనే ది ఆర్ధం కాక అదేపనిగా ఇన్సూరెన్స్ సిబ్బంది ని తప్పించుకోలేక తప్పని స్థితి లో ఇన్సూరెన్స్ తీసుకున్నామని అంటారు అసలు లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, మధ్య ఉన్న తేడాను ఎలా గమనించాలి. వీటి ప్రీమియం వివరాలు నిపుణులని అడిగి తెలు సుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఒప్పందం అని నిబందనలు చెపుతున్నాయి. ఒప్పందం ప్రకారం వ్యక్తికినామినీ కి ఇస్తామన్న వాగ్దానం ప్రకారం నగదు చెల్లించడమ్ అని నిపుణులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ప్రకారం ప్రీమియం చెల్లిస్తున్నంత వరకు ఇన్సూరెన్స్ అమలులో ఉంటుంది. ఎగ్రిమెంట్ జరిగిన నాటినుంచి లేదా చెప్పిన తేదీ నుండి నిర్దేశిత తేదీ ప్రకారం. లేదా అనుకోకుండా, మరణించినా, విరమించినా అనారోగ్యం పాలైనా పాలసీదారు ఒప్పందం ప్రకారం ప్రీమియం చెల్లింపు ఇన్సూరెన్స్ – నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన యాంకర్ 5) నానాటికీ భారీ రంగం గా ఎదుగుతున్న ఇన్సూరెన్స్ రంగం లో అసలు ఇన్సూరెన్స్ ఎన్నిరకాలు అన్న విష యం ముందుగా తెలుసు కుందాం ఒకటి లైఫ్ ఇసురేన్స్ ,రెండోది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు తేల్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ ను జీవన భీమా, అని నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సాధారణ భీమా అని పేర్కొన్నారు. అటు వ్యక్తి లేదా ఇంటి పెద్ద లేదా అయింటి పెద్ద పైనా ఆధారపడి జీవిస్తున్నకుటుంబానికి ఇచ్చే భీమా ని జీవన భీమా అని అంటారు. సాధారణ భీమా ని జనరల్ ఇన్సూరెన్స్ గా పేర్కొన్నారు వాహనము ఇల్లు, పశువులు, పంటలు, వాహనాలు, ఆరోగ్య భీమా శాతం సాధారణ భీమా పరిధి లోకి వస్తుంది. ఆవివరాలు అన్నీ పూర్తిగా స్పస్టం గా వివరంగా తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పా లంటే ప్రజలకు అత్యంత విలువైన ది ప్రాణం ,జీవన భీమా పరిధిలోకి పాలసీదారు ఏదైనా అనుకోని పరిస్థితిలో చనిపోయిన వ్యక్తికి, లేదా అతని పై ఆధార పడే వారికి భీమా కంపెనీలు కొంత నగదును పాలసీ కొనుగోలు దారు కుటుంబానికి ఇస్తారు. ఇంటి పెద్ద లేనందు వల్ల ఆ ఇంటిని నడపడం కష్ట ఆ సాధ్యం, అలాటి ఆర్ధిక సమస్యలనుండి బయట పడేందుకు జీవిత భీమా తీసుకోడం అవసరం అని ఇన్సూరెన్స్ నిపుణులు తెలియ జేస్తారు. రెండవది సాధారణ భీమా, దీనిని జనరల్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ పరిభాషలో పేర్కొన్నారు. ఈ పరిధిలో ఆ రోగ్య భీమా , చికిత్స, వాహనం, పంట లు, ఇల్లు అన్నీ ఈ పరిధిలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ముందుగా ఇంటి భీమా సాధారణ భీమా పరిధిలో ఉందని గ్రహించాలి. దీని వల్ల మీయింటిని భూకంపం, షార్ట్ సర్క్యూట్, వరద వల్ల మునిగి పోయినా, ఇన్సూరెన్స్ నుండి సంరక్షించు కోవచ్చని అలాగే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఈ పాలసీ కింద నసఃతపరిహారం పొందవచ్చని, అదీ మీరు తీసుకున్న పాలసీ విలువ పైన ఆధార పడిఉంటుందని నిపుణులు వివరించారు. సాధారణ భీమా పధకం పరిదిలో వచ్చే అంశం ఆరోగ్య భీమా అదే హెల్త్ ఇన్సూరెన్స్ నేటి కాలంలో వైద్య ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి ఆరోగ్య భీమా తీసుకోడం వల్ల భీమా కంపనీలు. ఇచ్చే వైద్య ఖర్చులనుండి కొంత మేర బయట పడవచ్చునని అంటున్నారు ఇన్సూరెన్స్ నిపుణులు. ఈ ఆరోగ్య భీమా పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ కంపనీ ఏ రకమైన వ్యాధి వచ్చినా , వైద్యానికి అయ్యే ఖర్చును ఆ కంపనీ ఇస్తుంది.అయితే మీరు తీసుకునే పాలసీ విలువపైనే మీకు ఇవ్వాల్సిన క్లైమ్ ఆధార పడిఉంటుందని, అని నిపుణులు తెలిపారు. సాధారణ భీమా పరిధిలోకి వచ్చే మరో అంశం వాహనభీమా దేశంలో ఎక్కడైనా రోడ్డు పై వాహనం నడపినా వాహనాన్ని భీమా చేయడం తప్పనిసరి ఒక వేళ మీ వాహనానికి భీమా చేయకుండా రోడ్డు పై నడిపితే ట్రాఫిక్ పోలీసు జరిమానా విధిస్తారు వాహన చట్టం నిబంధనల ప్రకారం వాహనం వల్ల మీద్వారా మరొకరికి ప్రమాదం సంభవిస్త్గే వ్యక్తి గతంగా మీరు ప్రమాదానికి గురి ఐనా పక్షం లో భీమా కంపనీ కొంత నగదు నష్ట పరిహారంగా ఇస్తుంది. ఒక వేళా మీవాహనం దొంగతనానికి గురి ఐనా, అదైనా ప్రమాదం జరిగినా మీ భీమా పాలసీ మీకు సహాయ పడుతుంది ఈ భీమా పరిధిలోకి వచ్చిన మరో పధకం ప్రయాణ భీమా ఈ భీమా ద్వారా మీరు యాత్ర చేస్తున్న సమయంలో వచ్చే నష్టం, నుంచి మిమ్మల్ల్ని కాపాడు తుంది. విహార యాత్రకు విదేశాలకు వెళ్ళి నప్పుడు ఒక వేళ ఏ దైనా ప్రమాదం జరిగితే మీ వస్తువులు చోరీకి గురి అయినప్పుడు, భీమా సంస్థ నష్ట పరిహారం చెల్లిస్తుంది. ప్రయాణ భీమా పాలసీ మీ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ప్రయాణ భీమా కు సంబందించి ఒక్క కంపనీ వీధి విధానాలను రూపొందించిందని కంప నీల షరతులకు లోబడి పలాసీ లు వేరు వేరు గా ఉంటాయని నిపుణులు తెలిపారు. సాధారణ పరిధిలోకి వచ్చే మరో ఇన్సూరెన్స్ పాలసీ పంట భీమా పధకం క్రాప్ ఇన్సూరెన్స్ పధకంగా పేర్కొన్నారు. ఈ భీమా నియమ నిబందనల ప్రకారం వ్యవసాయ రుణం తీసుకునే ప్రతి రైతు పంట భీమా తీసుకోడం తప్పనిసరి. పంట భీమా పాలసీ నిబందనల ప్రకారం పంటకు ఏ విధమైన నాష్టం కలిగినా, వ్భీమ కంపనీలు రైతుకు నష్ట పరిహారం చెల్లిస్తాయి. భీమా నిబందనల్ ప్రకారం పంట అగినికి అంటుకోవడం, పంట వరదలో చిక్కుకు పోవడం, పంటకు ఇతర తెగులు సోకి నస్గ్తపోయినా , కోతకు వచ్చిన పంట కోల్పోయినా పంట ఏ కారణం చేతైన పాడై పోయినా నష్ట పరి హరామ్ పొండా వచ్చని త్గెలియా చేస్తోంది. పంట భీమా పాలసీ లో ఖటి న మైన నియమ నిబంధనలవల్ల పాలసీ నగదు కన్నా తక్కువ నష్ట పరిహారం లభించనందు వల్ల రైతులలో పంట భీమా పట్ల ఆసక్తి చూపక పోవడం గమనించాలి. వాస్తవానికి పంటచెడిపోయి నప్పుడు, పాడై పోయి నప్పుడు నష్ట పరిహారం ఇచ్చే సమయంలో భీమా కంపేనీలు ఆపంట పొలం పరిసరాలలో దగ్గర దగ్ఫ్గర గా ఉన్న పంటల నన్నిటిని సర్వే చేస్తారు ఎక్కువ మండి రైతులు నష్ట పోయి నప్పుడు మాత్రమే ఈ భీమా ఇస్తున్నారని దీని వల్ల భీమా తీసుకున్న తమకు పెద్దగా ఉపయోగం లేదని రైతులు వాపోతున్నారు. భీమారంగాన్ని సవివరంగా ప్రజలకు తెలపాలన్న లక్ష్యంగా మేము మాపతి సోదనలో తెలిసిన మరో భీమా వ్యాపార భీమా. నిజానికి ఏ కంపనీ ఉత్పాదక లేదా అమ్మకం జరిగే పరిశ్రమలు లేదా పెద్ద మొత్తంలో చేసే వ్యాపార్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నది వాస్తవం. పెద పెద్ద పరిశ్రమలలో ఉండే యంత్ర సామగ్రి, వల్ల ఏసీడ్ వల్ల బాయిలర్లు పేలడం,ప్లాస్టిక్, రసాయన, టైర్ల పరిశ్రమ, ఇలా పెద్ద పెద్ద పర్శ్రమలలో ఆగ్ని ప్రమాదాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇన్సూరెన్స్ లేని పరిశ్రమలకు భారీ మొత్తం జరిమానాలు కట్టాల్సి వస్తుంది. చట్ట ప్రకారం జరిగే చర్యలతో పాటు అందుకు అయ్యి ఖర్చు ను సైతం అటు భీమా సంస్థ కంపనీలు చెల్లించాల్సి ఉంటుంది ఇది కూలం కషమ్ గా లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉండే భీమా లు వాటివల్ల కలిగే లాభం, నష్టం. ----- నిపులతో వీటికి సంబందించిన ఆంశాల పై చర్చ -------. యాంకర్ 6) ఇప్పుడు ఇన్సూరెన్స్ లు వాటిలో రకాలు ఏ ఇన్సూరెన్స్ ఏ పరిధిలో ఉంది నిపుణులు చెప్పిన సమాధానం చూశాంకదా ఇప్పుడు అసలు చిత్రమైనవిచిత్రమైన కదలు ఇన్సూరెన్స్ లో చోటు చేసుకున్న దుష్టాంతరాలు ఇప్పుడు చూద్దాం. అందులో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబందించిన కొన్ని వాస్తవాలని చూద్దాం. ఆసుపత్రులలో మీకు ఇన్సూరెన్స్ ఉందని అంటే రమ్మంటారు. ఆత్రువాత మనకి ఇన్సూరెన్స్ మొత్తంలో ఉన్న పూర్తి క్లెయిమ్ ను ఎలా రాబట్టాలో రాబడతారు. ఆచిత్రాలు ఒకసారి చూద్దామా. వాయిస్ ఓవర్ 6) మీకు మీకుఇన్సూరెన్స్ ఉందా అంటారు ఉందని అన్నారో మీరు బుక్ అయి పోయరన్న మాటే. అసలు ఇన్సూరెన్స్ పోలసీ ఎంత వరకు ఆంచనా వేస్తారు. దానిని బట్టి మీ సమస్య పెద్దది మీకు సర్జరీ అవసరం అంటారు. వెంటనే ఎప్పుడు జాయిన్ అవుతారు. వెంటనే జాయిన్ అవ్వాలి లేదంటే మీ సమస్య సీరియస్ ఇష్యూ ముందు అడ్మిట్ అవ్వండి టెస్ట్ చేశాక సమస్య పూర్తిగా ఇన్వెస్టిగేట్ చెయ్యాలి. అప్పుడు ట్రీట్ మెంట్ ట్ ఇవ్వాలి అంటూ రూమ్ ఆలో కేట్ చేస్తారు. సె లైన్ కామన్, టాబ్లెట్స్ కామన్, పేటెంట్ కి భోజనం మేమే పెడతాం మీరు తీసుకు రావద్దు అంటూ అమ్మో పరవాలేదు అమ్మో ఇంటినుంచి తెచ్చుకునే బదులు ఇక్కడే ఇస్తారు కదా అనుకుని భీమా కదా ధీమా గావుంటారు. తీరా చూస్తే రూమ్ రెంట్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ రెంట్, మనం వాడినా వాడక పోయినా టవల్ సబ్బులు, న్యాప్ కీన్లు, నర్సింగ్ సేవలు. ఆపరేషన్ థియేటర్ ఖర్చులు వాళ్ళు వాడిన థియేటర్ సరంజామా,సూదులు, వగైరా, టిష్యూ పేపర్ లు సైతం వాడినా వా డక పోయినా వాటి కీ బిల్లులో అసలు బిల్లు కంటే కాస్త ఎక్కువే వడ్డిస్తా రని బాదితులు వాపోతున్నారు. చివరన డిశ్చార్జ్ బిల్లు చూస్తే గుండె ఘుబెల్ మంటుంది ఆంతా మీ ఇన్సూరెన్స్ కు తగ్గట్టు గానే మొత్తం బిల్లు క్లెయిమ్ చేస్తారు అప్ప్రూవల్ కు ఇన్సూరెన్స్ కంపనీకి పంపి అప్రూవల్ రాగానే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. ఒక్కోసారి మీ ఇన్సూరెన్స్ బిల్లు కన్నా కొంత అదనం గా వచ్చిన్నా ఆశ్చర్యం లేకపోలేదు. సొ మీరు ఇలాంటి సమస్య ఎదురయ్యిందా, అయితే కాస్త జాగ్రత్తగా వినండి. మీరు పెట్టిన క్లెయిమ్ ఇవ్వక పోయినా అదనంగా వచ్చే స్మస్యలకు ఎవరు పరిష్కరిస్తారు వాళ్ళు ఎవరు అన్న సమ ధనం మానిపుణులు మీకు వివరిస్తారు. ------ఈ అం శం లోనే అసలు ఆసుపత్రుల పై వస్తున్న ఆరోపణలు వాస్తవమా కాదా ,అన్న విష యాన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యజ మన్యాల సంఘం ప్రతినిధులు చెప్పాలి---- బైట్--- సమస్య వచ్చిందంటే ఆసమయంలో ఎవరు దగ్గర లేకున్నా నిర్ణయం తీసుకోడం కష్టం దగ్గరలౌన్న నర్సింగ్ హోం కి వెళ్లలా లేక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాల అన్నదే మీమాంస ఆసమయంలో నే తక్షణం చేయాల్సిన పరిస్తితి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్తితి అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రికి వేలాడమన్నా నిర్ణయం తీసుకుంటే మాత్రం మీకు రోగం బెత్తెడు బిల్లు జా నేడు అన్నట్టుగా ఉంటుంది. అసలు సమస్య కు ట్రీట్మెంట్ ఇచ్చాం అంటారు. వాడినా వాడని వస్తువు బిల్లు నానా నెత్తి మీద రుద్ది బిల్లు తడిపి మోపెడు చేసి బిల్లీ కత్తి వెల్ల మంటూ సలహా ఇస్తార్. జర జాగ్థే రహో అంటున్నాయి స్వీయ అనుభవం వింటే మీకే ఆర్ధం అవుతుంది ఆసుపత్రుల ఇన్సూరెన్స్ మాయ. వాయిస్ ఓవర్ 7) మాయా మయా మాయా ఇదేంటి మాయ అనుకుంటున్నారు క దూ. ఒక్క సారి ఈమాయలో పడ్డారో మీకు లేనిరోగం తో పాటు అన్నీ గుర్తుకు వస్తాయి. . ఇవిగో ఇవన్నీ నగరంలో పేరెన్నిక గన్న ఆసుపత్రు లే ఇక్కడ కాళ్ళు, కీళ్ళు, తల, వెన్నెముఖ, గుండె, కిడ్నీ, పురీషనాళం, ఊపిరి తిత్తులు, ఇలా ఒకటి పన్ను ,కన్నువెన్ను, ఆన్ని టికి ప్లాంట్లు, ఇన్ ప్లాంట్లు , చేయడంలో ప్రపంచంలో పేరు ఎన్నిక గన్న డాక్టర్ లే ఉంటారు. సేవలు అందిస్తారు. ఒక డాక్టర్ కన్సల్టెన్సీ 300/ నుంచి 800/ కు తక్కువగా ఉండదు. అసలు వచ్చిన సమస్య ఏమిటి అంటే దబ్భు పెడితే ట్రీట్ మెంట్ కాస్ట్ తక్కువ, ఇన్సూరెన్స్ తో అయితే ఎక్కువ ఇదేమి లాజిక్ అని అనుకుంటున్నారు? పాలసీ దారులు. ఇంకొందరు ఏదో ఒకటి ముందు బయట పడ్డాం కదా ఈ మీమాంస అవసరమా? అని అనుకుంటున్నారు. యెస్ అవసరమే ఎందుకంటే పాలసీ దారుల రక్షణ అవసరం కనుక ఇరిడా నిర్దేశించిన ప్రమాణం ప్రకారం ఇన్సూరెన్స్ పెట్టుబడికి మనకు దక్కే లాభం ఎంత అని పెట్టుబడి దారులు అనుకుంటే పెట్టుబడి దారులు ఆలోచించేవాళ్లు. అటు ప్రైవేట్ , ఇటు ప్రభుత్వ రంగం లో పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా ఒస్తోంటే ఇంకా ప్రైవెట్ రంగంలో మరిన్ని విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తే ఆసుపత్రు లకు పండగ మాకు ఎందుకు ఇన్సూరెన్స్ దండగా అని సామాన్యుడు ఫీల్ అవుతున్నాడు. ఆడండి మనం కడుతున్న ఇన్సూరెన్స్లు మనకు కలిగే లాభం. మీ ఇన్సూరెన్స్ సంస్యలగురించి మాకు రాయండి నేరుగా మా నిపుణులతో మాట్లా డండి . ఇన్సూరెన్లు క్లైములు వాటి పరిష్కారాలు వివిధ ర కా ల కేసులు ఇన్సూరెన్స్ పరిష్కారంలో అంబుట్స్మెన్ ఇచ్చే తీర్పులు న్యాయనిపుణుల సలహా లు తదితర ఆంశాలు మరో ఎపిసోడ్ లో చర్చిద్దాం అంటిల్ దేన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.
read more











.jpg)




.jpg)





