థైరాయిడ్కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి
థైరాయిడ్కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి థైరాయిడ్ కొన్ని రకాల మెటబాలిక్ దిసోర్దేర్స్ లో ఒకటి. మీ శరీరంలోని మెడ వద్ద సీతాకోక చిలుక ఆకారం లో ఉండే ఒక గ్లాండ్. మీ శక్తి నిచ్చే ప్రాధాన గ్లాండ్ మీ శరీరంలో మేటాబాలిజం ను నియంత్రించే కీలక అవయవం.మీ జీన్స్ అంటే మూల కణాలను వాటి పని చేసే విధంగా పని తీరును మెరుగు పరుస్తుంది.మీకు తెలుసు థైరాయిడ్ ప్రధానం గా ఎప్పటి కప్పుడు మెకానిజం చేసే యంత్రం ల పని చేస్తుంది.మీ శరీరం లోని ప్రతి కణాన్ని థైరాయిడ్ హార్మోన్ రేసుప్టర్ గా పని చేస్తుంది. సహజంగా థైరాయిడ్ ను రెండు రకాలుగా నిర్ధారించారు .ఒకటి హైపో థైరాయిడ్, లో థైరాయిడ్ గ పనిచేస్తాయి. ఇది మన శారేరాన్ని చాలా సైలెంట్ గా ఎపిదమిక్ గా మారుస్తుంది. ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఉన్నట్లు గుర్తించారు అలా అది మన రోగ నిరోధక శక్తి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల చాలా తక్కువ స్థాయిలో ఇంఫ్లా మేషన్ తో పాటు ఆటో ఇమ్మ్యునిటీ సమస్యలకు దారి తీస్తుంది. దీనికి కారణం తక్కువ నాయతతో కూడిన ఆహారం.ఇందులో పూర్తిగా రీ ఫైండ్ చేసిన, ప్రాసెస్ చేసిన లేదా కొవ్వు పదార్ధాలు మీసెడెన్ట్రిక్ లైఫ్ లో ఒత్తిడి, వల్లథైరాయిడ్ వల్ల మరిన్ని తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ఏండో క్రినేలో గ్లంలో భాగం ఇది శరీరానికి అవసరనైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరాన్ని సమతౌల్యం లో ఉంచుతుంది. దీనిలో చాలా రకాల థైరాయిడ్ లు ఉన్నాయి. అందులో హషిమొటోస్, థైరాయిడో టిస్ వల్ల త్వరగా అలిసిపోవడం, ఒత్తిడికి గురికావడం, జలుబును తట్టుకో లేక పోవడం, బరువు పెరగడం, చర్మం,జుట్టు ఎండి పోయి నట్లుగా ఉండడం, కండరాలలో నొప్పులు, మల బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం, నిద్రలేమి, కా ళ్ళలోవాపులు, తెల్లగా పాలిపోయిన కళ్ళు, గుండె చాలా నేమ్మడిగా కొట్టు కోవడం. శరీరంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం. ఒక్కోసారి హార్ట్ ఫైల్యూర్, లేదా కోమా లోకి వెళ్లి పోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు.దీనికి మనలో ఉన్న రోగనిరోదక శక్తి మధ్యస్తంగా రెఅ ఆక్ట్ కావడం అని నిపుణులు తేల్చారు. థైరాయిడ్ నివారణ రెమిడీస్... * నిర్దేశించిన విధంగా పంచాసూత్రాలను పాటించండి. * ఒమేగా 3 కొవ్వు నిచ్చే మొక్కలనుండి తీసుకోండిఉదాహరణకు ఫ్లాక్స్ సీడ్స్ ఫాలూదా సీడ్స్ విరివిగా తీసుకోండి. * ప్రాసెస్ చేసిన తెల్లని ఉప్పుకు బదులు హిమాలయా రొక్ సాల్ట్ ను తప్పని సరిగా వాడండి. * మీ శరీరంలో విటమిన్ డి శాతాన్ని సాధారణ స్థాయిలో ఉండే విదంగా చూసుకోండి.సరైన శాతంలో విటమిన్ డి ఉండడం వల్ల మీ ఆరోగ్యం సామాన స్థాయిలో ఉంటుంది. * గ్రీన్ సలాడ్స్, వెల్లుల్లి, కూరాగాయల లో ఎక్కువ స్థాయిలో కో ఎంజయిం లు ఉంటాయి. * మీరు మీ ఆహారంలో ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను రీ ఫైండ్ నూనెలను పూర్తిగా నివారించండి. * పీచు,లేదాతౌడు ఎక్కువగా ఉన్నగోధుమ ఉత్పత్తులను నివారించండి అందుకు బదులు మిల్లెట్స్రె రెడ్ రైస్ ను లేదా బ్రౌన్ రైస్ ని వినియోగించాలని నిపుణులు సూచించారు. మీ ఆహారం లో సుప్లిమెంట్లు సంప్ర్సదాయ మూలికలు... * ఒమేగా3 కొవ్వు తో కోడిన యాసిడ్లు. * మల్టీవిటమిన్ మినరల్స్ , బి కాంప్లెక్స్. * ప్రాసెస్ చేసిన తెల్లటి ఉప్పు కంటే హిమాలయన్ రొక్ సాల్ట్ ను వాడాలి. * అశ్వగంధ, తులసి,కంచనార్ గుగ్గులు షిలాజిత్. * వేప నూనె లేదా నీం,ఆయిల్ హైపర్ థైరాయిడిశం * గ్రీన్ అండ్ హెర్బల్ టీ * రీ ఫైండ్ చేయని సాంప్రదాయ పద్దతిలో తీసినసఫ్ఫ్లోవేర్, సేసమే, కొబ్బరి నూనెలను వినియోగించండి. * ఫ్లాక్స్ సీడ్స్, ఫాలూదా ను మీరు రోజూ తీసుకునే ఆహారంలో వినియోగించండి. * మీ ఆహారం లో బెటెల్ఆకులు ఫెన్నెల్ సీడ్స్ ప్రతిరోజూ తీసుకోండి. * నట్స్, సీడ్స్, డ్రైఫ్రూట్స్ వాడాలి. * ఫ్లాక్స్ సీడ్స్ మరియు రైసిన్స్ తీసుకోవాలి. * పాలు,పాలఉత్పాతులు,నివారించండి అందుకు బదులుగా మజ్జిగా లేదా నెయ్యి నివారించండి. * మీ ఆహారంలో ప్రో బిఒటిక్ ఆహారానికి బదులు మజ్జిగను తీసుకోండి. * మిమ్మల్ని వేదించే థైరాయిడ్, థైరాయిడిటిస్ నివారణకు సూచనలు పాటించండి.
read moreఊబకాయం నివారణకు ఆహారం
ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం ఒక సమస్యగా మారింది.1950 నుంచే ఊబకాయం తీవ్రంగా అభివృద్ధి అభివృద్ధిచెందుతున్న దేశాలలో తీవ్రంగా పెరుగు తోంది. జనాభాలో ఊబకాయం చాలా సహజమని దీని ప్రభావం సామాజిక ఆర్ధిక, వాతావరణ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.మీ శరీరం లో ఉన్న బోడి మాస్ ఇండెక్స్ మీ ఎత్తు బరువు ఆధారంగా మీ శరీరంలో గుండె వ్యాధులు , ఆధిక రక్త పోటు,హై కొలస్ట్రాల్ల్ ,హై బ్లడ్ షుగర్, ఇతర అంటు వ్యాధులు వాటి వల్ల వచ్చే తీవ్ర ప్రభావాలు , ఊబకాయానికి మల్టిపుల్ సమస్యలు ఊబకాయ వ్యాధిగ్రస్తులు ఎదుర్కోక తప్పదు. ఆధునిక ఆహార విహారాలు పోషక విలువల్లేని ఆహారం. రెఫ్ఫైండ్, అధిక చక్కెర శాతం, గల ఆహారం అవసారానికి మించి ఆహారం తెసుకోవడం వల్ల ఊబకాయానికి కారకాలుగా పేర్కొన్నారు. దీనికి తోడు శారీరక వ్యాయామం లేకపోవడం, జీవన శైలిలో మార్పుల వల్ల వేళా పాళా లేని ఆహారం నిద్ర వల్ల మరిన్ని తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక వేళ మనం ఆహారం సరిగాలేకుంటే మెటాబాలిజం సరిగాలేని ఆహారం లేకపోయినా మెటాబాలిజం సరిగా లేని కారణంగా శారీరక వ్యాయామం ఊబకాయానికి కరణంగా చెప్పవచ్చు. మనం మనఆహారంలో తక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకొ నప్పుడు శరీరంలోని కణాలు మెదడులోని కణాలకు ఆకలి అన్న సంకేతాన్ని పంపిస్తుంది. ఈ రకమైన సైకిల్ మెటాబాలిజం సరిగా లేనందువల్లే మనకు ఊబాకాయం సమస్యలు వాస్తాయి. ఊబాకాయానికి నివారణ... ఊబాకాయం తగ్గించడానికి క్రాష్ దైట్స్ అంటూ చేసే డైటింగ్ చేసే వారు తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి క్రాష్ డైట్ ప్రోగ్రామ్స్ వల్ల బరువు పెర్గుతుంది. దీర్ఘకాలంగా బరువు పెరుగు తూనే ఉంటారు. మనం తీసుకునే ఆహారం క్రమపద్దతిలో లేకుంటే జీవనశైలి ఆహారం లో పూర్తి స్థాయిలో పోషక విలువలు లేకపోవడం,లేదా పైతో న్యూట్రియంట్స్, ఒమేగా 3, ఫ్యాటీ, తప్పనిసరిగా అమినో యాసిడ్స్, మినరల్స్, చాలా అవసరం. పంచసూత్ర పద్దతులు- సంప్రదాయ పద్దతిలో సప్లిమెంట్స్... *ఒమేగా -- ఫ్యాటీ యాసిడ్స్. *మల్టీ విటమీన్స్ . *వృక్షఆమ్లా /త్రిఫలా. *శతావరి. *అశ్వగంధ, ఈ మూలికలను కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేడమ్ లో ఉన్నాయి. *గ్రీన్ హెర్బల్ టీ *ప్రొసెస్ చేసిన తెల్లటి ఉప్పు దీనికి బదులు హిమాలయన్ రాక్ సోల్ట్ తప్పని సరిగా వాడండి. *సమయానికి ఆహారం తీసుకోండి. రాత్రి డిన్నర్ ను స్కిప్ చేయన్డి . పళ్ళు ఫలాలు పచ్చటి రసాలు.లేదా గ్రీన్ సలాడ్ *ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయాన్దీ. *పాలను పూర్తిగా వదలండి మజ్జిగను తీసుకోండి. *ఆయాకాళాలో వచ్చే నూనెలు రీఫైన్ద్ చేయని నూనెలు వాడండి. ఈ విధంగా చేస్తే మీరు ఎదుర్కుంటున్న ఊబకాయం సమస్యనుండి బయట పడవచ్చు.
read moreకోవిడ్ చికిత్సలో పిల్లలకు రెమిడీసివిర్ ఉపయోగించద్దు.. కేంద్రం మార్గదర్శకాలు
కోవిడ్ 19 వైరస్ విషయంలో మూడవ విడత పిల్లల పై ప్రభావం చూపిస్తుందన్న శాస్త్రజ్ఞుల, నిపుణుల సూచన మేరకు కేంద్రం తగిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు చిన్న పిల్లలకు చేసే కోవిడ్ చికిత్స విషయం లో రెమిడీ సివిర్ ను వాడరాదని తెలిపింది. కోవిడ్ మేనేజ్ మెంట్ విషయంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. హెచ్ ఆర్ సి టి ఇమేజింగ్ ను కేంద్రం సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సెర్వీసెస్ సూచనల ప్రకారాం క్రిటికల్ కేర్ అత్యవసర సమయం లో ఆసుపత్రిలో చేరిన వారికి స్టెరాయిడ్స్ మాత్రమే వాడాలని మూడవ విడత కేసులపై పర్య వేక్షణ ఉండాలని సూచనలో పేర్కొంది. సరైన సమయంలో సరైన డోసును స్టెరాయిడ్ వాడాలని సొంత వైద్యం స్టెరాయిడ్స్ ను పూర్తిగా నివారించాలని తెలిపింది. అయితే అత్యవసర సమయంలో వాడే రెమిడీ సివిర్ ను వాడరాదని. సూచింది. 18 సంవత్సరాల లోపు రెమిడీ సివిర్ సురక్షితం కాదని సి టి ,హెచ్ ఆర్ సి టి పరీక్ష ద్వారా ఊపిరి తిత్తుల లో వైరస్ లోడ్ ఏంత ఉందో నిర్ధారించాలని తేల్చి చెప్పింది. హెచ్ ఆర్ సి టి ద్వారా అదనపు సమాచారం చెస్ట్ పై ఎలాంటి ప్రభావం ఎలా ఉందో చికిత్సను నిర్ధారిస్తారు. క్లినికల్ గా వ్యాధి తీవ్రత ఫిజియ్లాలజీ ఫిజీషియన్ తప్పని సరిగా హెచ్ ఆర్ సి టి ఇమేజింగ్ ను చెస్ట్ ఎంపిక చేయాలి. కోవిడ్ 19 రోగులకు చేయాలని కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ ను నిరోధించడంలో యాంటీ మైక్రో బయల్స్ థెరఫీ ప్రోక్సీ లాసిస్ మొడ్రేట్ లేదా సీవియర్ కేసులలో యాంటీ సుస్పెషన్ సూపరేడేట్ ఇన్ఫెక్షన్ ఆసుపత్రుల యజమాన్యం ఆరోగ్య సంరక్షణ ఇన్ఫెక్షన్ ను మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గనిజమ్స్. పిల్లల్లో ఆశింతమేటిక్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. వైద్యం తప్పనిసరిగా కోవిడ్ ఎలా ప్రవర్తిస్తుందో మాస్క్ హ్యాండ్ హై జీన్, సామాజిక దూరం పాటించాలని సూచించారు. పిల్లలకు పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వాలి. కోవిడ్ తక్కువ గా ఉన్న ప్పుడు పరాసిట్ మాల్ 10- 15 ఎంజి, ప్రతి రోజు 4- నుండి 6 గంటలు ఇవ్వాలి గొంతు వాపు వేడిగా ఉండే సెలైన్ ను పిల్లలో లేదా యుక్త వయస్సులో దగ్గు గైడ్ లైన్స్ ప్రకారం ఏది ఏమైనా మొడ్రేట్ ఇన్ఫెక్షన్ లేదా ఆక్సిజన్ ధేరఫీ లేదా తప్పని సరిగా చికిత్స చేయాలి. ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సింగ్డ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.కోర్టికో స్టెరాయిడ్స్ అందరు పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొడ్రేట్ ఇల్ల్నెస్స్ వల్ల అనారోగ్యం పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉందన్న యాంటీ కొ ఆగులెంట్స్ గైడ్ లైన్స్ లో పేర్కొంది. ఒకవేళ షోక్ డవలోప్ అయితే తప్పనిసరిగా చేపట్టాలి. యాంటీ మైక్రో డ యాలసీస్ ను నిర్వహించాలి ఒక వేళ సాక్ష్యం అనుమానం తో కూడిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆర్గాన్ డిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆర్గాన్ పనిచేయనట్లైతే మరో ఆర్గాన్ సహకారం అందించాలి. రీనాల్ రిప్లకెమెంట్ థెరఫీఅవసరం. గైడ్ లైన్స్ లో 12 సంవత్సరాల పై బడిన పిల్లలలో తప్పనిసరిగా 6 నిమిషాలు నడిపించాలని పేర్కొంది. దీనివల్ల తండ్రులు సంరక్షకుల సమక్ష్యంలో పర్యవేక్షణ లో కార్డియో పుల్మనరీ ఎక్సర్ సైజెస్ మాస్క్ హై పోక్సియా పల్సీ మీటర్ ను వేలుకి అమర్చాలి పిల్లల చేత నడిపించాలి వారి రూములో నడిపించాలి.
read moreమెటబాలిజం అంటే ఏమిటి ?
మెటాబాలిజం అంటే శరీరంలో రసాయనాల మార్పు-మూలకణాలు అవయవాల పనితీరు లో మార్పులు వస్తాయి.శరీరంలో వచ్చిచేరే ఎంజాయింల వల్ల కొన్ని చ్ర్యలు జరిగి ఆర్గన్లు పెరగడం,లేదా పునరుత్పత్తి జరుగుతూ ఉంటాయి. వారి వారి శరీర తత్వాన్ని బట్టి శరీరంలో మార్పులు.అక్కడి వాతావరణాన్ని బట్టి శరీరంలో బయో కెమికల్ ప్రొసెస్ వల్ల శరీరం లో కొన్ని కణాలు జీవిస్తూ ఉంటాయీ.దీనివల్ల శరీరంలో హార్మోన్స్, నర్వస్ సిస్టమ్ మన మెటాబాలిజం ను నియంత్రిస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం అరుగుదల సమయంలో ఏంజయింలు బ్రేక్ డౌన్ అయ్యి కార్బోహైడ్రేడ్స్, కొవ్వు, ప్రోటీన్లు శరీరం ఉపయోగించుకుంటుంది.మెటాబాలిజం సమయంలో రెండురాకాల చర్యలు ఒకేసారి జరుగుతాయి.శరీరాన్ని పెంచడం కణాలలో శక్తిని నిల్వచేసుకుంటుంది. అనాబాలిజం, కటాబాలిజం రెండింటినీ సమన్వయం చేయడం అవసరం ఈరెండు పద్దతులు ఒకేసారి జరుగుతాయి. మెటాబాలిజం పోషకవివలకు సంబందం ఉంది. న్యూట్రియంట్స్ అందుబాటులో ఉంటాయి. బయో ఎనర్గిటిక్ , అంటే దాని ఆర్ధం బయో కెమికల్ లేదా మెటాబాలిక్ పాత్ వే కణాల వినియోగం వల్ల మరింత శక్తి పెరగడం మెటాబాలిజానికి ఒక కొంపోనెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మెటాబాలిక్ పాత్వే బయో కె మిస్ట్రీ పై ఆధార పది ఉంటుంది. మెటాబాలిజం బిఓలాజికల్ గా తప్పనిసరిగా భావించారు. ఇటీవల జరిగిన పరిశోదన లో కనుగొన్న అంశాలలో మానవులలో వస్తున్న అనారోగ్యాలకు మెటా బాలిక్ డిజార్డర్స్ ఉన్నాయని తేలింది. ఫిజియాలజీ లో టి ష్యూ సరిగా పని చేయకపోవడం. వల్లే అనారోగ్యానికి కరణంగా తేల్చారు. ఆయుర్వేదం లో మెటాబాలిజానికి పెద్దపీట వేశారు ఆదిక ప్రాధాన్యత ఇచ్చారు.మన శరీరంలో మెటబాలిజం సరిగా లేనిపక్షంలో టోక్సిన్స్ అంటే ఆమ్లాలు చెరీ అనారోగ్యానికి కారణం కావచ్చు. ఆయుర్వేదం లో మెటబాలిజం అంశం పై అష్టాంగ హృదయ సంహితలో పెద్దపేగులు చిన్నపెగులలో వచ్చే జటరాజ్ఞి వల్ల శరీరం మంటకు గురి కావడాన్ని గమనించవచ్చు. శరీరంలో పలురకాల సమస్యలకు దారి తీస్తుంది. స్థూలంగా మెటాబాలిజం- అరుగుదల... శరీరంలో ముఖ్యంగా పొట్టలో చేరే గ్యాస్ రసాయానాలు దీనిలో ఎంజైమ్లు విడుదల కావడం వల్ల ఆహారం అరుగుదల పద్దతి కేటా బాలిక్ మెటాబాలిజం తగ్గిన వెంటనే మొలిక్యుల్స్ ఫుడ్ మ్శాలిక్యుల్స్ ఆహారంలో కలిసి రక్తంలో, ప్లాస్మా లో చిన్న పేగుల్లో కలిసి పోతాయి.నీరు మినరల్స్ తిరిగి రక్తంలో కలిసి పోతాయి.కొన్ని విటమిన్లు బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అవుతాయి. కణాలు సెల్స్ లో మెటాబాలిజం-సూక్స్మ స్థాయిలో మెటాబాలిజం... మనం తీసుకునే ఆహారం మొదటఅరుగుదల తరువాత రక్తంలోకి చేరుతుంది. ఇది శరీరంలో అన్నీ కణాలకు ఎగుమతి చేస్తుంది. దీనిద్వారా బయోకెమికల్ రసాయన చర్యజరిగి మెటాబలిజమ్ లెవెల్స్ మెటాబాలిక్ పాత్వే న్యూతృషియన్స్ నుంచి వివిధ పద్దతులలో క్రమపద్దతుల్లో ద్వారా కీలక మైన మెటాబాలిజం శరీరంలోని అవయవాలలో కొన్ని ప్రతిచర్యలు జరుగుతాయి. దీనివల్ల కాస్త శక్తి ని విడుదల చేస్తాయి.ఈ ప్రతిchaర్యను సత్వరం జరిగే విధంగా ప్రభావ వంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మెటాబాలిజం ఎందుకు ముఖ్యం... మెటాబాలిజం ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాంటిది మానవులలో ఎవరికైతే మెటబాలిజం సరిగా ఉండదో వారిలో టో క్సిన్స్ కు దారి తీస్తుంది. సహజంగా వచ్చే ఉత్పత్తి లో తక్కువ శక్తిని కలిగి ఉండడం వల్లే అనారోగ్యానికి కరణమౌతుంది.
read moreగిరిజన మహిళల ఆరోగ్యానికి మీ గళం వినిపించండి
గిరిజన ప్రాంతాలలో మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. శరీరకంగా మానసికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పౌస్టిక ఆహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు .ప్రతి రోజూ వారు తీసుకునే ఆహారంలో పోషక లోపం ఉన్న ఆహారం తీసుకోడమే కారణం.జీవన ప్రమాణం తక్కువగా ఉండడం మరోసమస్య గిరిజన ప్రాంతాలలో అత్యవసర సమయంలో పెనుసవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది .వెనుక బడిన గ్రామీణ ప్రాంతాలలో మహిళల ఆరోగ్య సమస్యలే పెద్ద సవాల్ గా మారింది. ఇందులో కొన్ని యదార్ధాలు గుర్తించారు. మహిళలకు ఆరోగ్యం పై కనీస అవగాహన లేక పోవడం కనీస విద్య లేకపోవడం . ఆర్ధికంగా, సాంఘికంగా బలహీనంగా ఉండడం. పౌష్టికాహార లోపం, కొన్ని సాంప్రదాయ మూడనమ్మకాలు తరచుగా అనారోగ్యం లో మార్పులు లైంగిక సమస్యలు ఆరోగ్య వృద్ధి సాధ్యం కావడం లేదనేది నిపుణుల ఆంచనా. ఆరోగ్యం విషయంలో స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం... స్త్రీపురుషుల ను వేరు వేరుగా చూడడం స్త్రీలలో పోష్టికాహార లోపం నేరుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారి సాంస్కృతిక కళా ప్రదర్శనల సాధనకు సాంఘిక, ఆర్ధిక ప్రభావం ఉంటుంది.పౌష్టికాహార లోపం చాలామంది మహిళలో సంతాన ఉత్పత్తి వారు వాడే ఆహారం లో బలమైన పోషకాలు లేకపోవడం తీవ్ర ఒత్తిడికి అవుతున్నారు. పోషకాహార లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల పై అధ్యయనం చేశారు సరైన సంతాన ఉత్పతికి సరైన పోషక విలువలు ఉన్న ఆహారం వారి అలవాట్లు నిర్లక్ష్యం చేయడం వల్లే స్త్రీలను సంరక్షించడం సాధ్యం కాక పోవడాన్ని గమనించారు. అదనంగా సాంస్కృతిక ఉనికి తో పాటు సంతాన లేమి సమస్యలు ఎక్కువగా ఎదుర్కుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం మారోకారణం.గర్భిణిగా ఉన్నప్పుడూ సమస్యలు ఎదుర్కుంటున్నారు. పిల్లల పుట్టుకలోను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఒక పరిశోదన ప్రకారం 1 5 -24 సంవత్సరాల మధ్య ఉన్న గ్రామీణ ప్రాంతాలలో శరీరకంగా లైంగిక అవగాహన లేనందు వల్లే 41% మండి మహిళలు పురిటి సమయంలో జన్మ నిచ్చే సమయంలో మరణిస్తున్నారు. అని అధ్యయనం వెల్లడించింది. అందుకే స్త్రీలు తప్పనిసరిగా పౌష్టిక ఆహారం, ఆరోగ్య కరమైన జీవన శైలి ముందునుంచే అలవరచుకోవాలి. సంతాన లేమి తో బాధ పడేవారు గర్భవతిగా ఉన్నప్పుడూ ప్రసవించే సమయంలో ఆరోగ్యంగా ప్రసవించడం పుట్టిన బిడ్డల సంరక్షణ అవసరం. ఇందుకు ఉదాహరణగా శ్రీనివాసన్ ట్రస్ట్ సేవలు ఒక ద్విచక్రాల వాహన కంపెనీ ఇ కామ్ ఫౌండేషన్ సంస్థ సమన్వయంతో ఆరోగ్యం గా ఎలా ఉండాలో అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు. గర్భస్థ సమయంలో ప్రసవించిన అనంతరం ప్రశవానికి ముందు ప్రసవ అనంతరం తీసుకోవాల్సిన 23 గ్రామాలలో ని స్త్రీలలో నీల గిరిజనుల స్వయం సహాయక బృందాలు, ఆశావర్కర్లు, అంగన్ వాడి, కార్యకర్తలు బాల బాలికలు యువతులకు సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు గర్భిణిగా ఉన్నసమయంలో ప్రసవ ఆనంతరం తీసుకోవాల్సిన అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజా ఆరోగ్యం కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు గిరిజన ప్రాంతాలలో అవగాహన తీసుకోవాల్సిన మందులు దీని ఫలితంగానే పలు సమస్యలు తెలుసుకోడం సాంప్రదాయ పద్దతుల నుండి బయటపడి ఇక ఆసుపత్రులకు వెళ్ళడం మొదలు పెట్టారు.అంగన్ వాడి ఐ సి డి ఎస్ ట్రస్ట్ ద్వారా వారిలో ఆర్ధికంగా, సామాజికంగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.శ్రీనివాస్ ట్రస్ట్ సేవలు గిరిజన మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత బాల బాలికలు విద్యార్ధులు సరిపడ టాయిలెట్స్ స్కూళ్ళలో లేకపోవడాన్ని మూత్ర శాలలను రిపేర్ చేశారు.ఈ యజ్ఞంలో 100 పాటశాలలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు కల్పించింది. గత సంవత్సరం గిరిజనులు, మహిళలకు, విద్య, వైద్యం, పై దృష్టి పెట్టింది . దానివల్ల నాణ్యమైన జీవన శైలి పెంచేందుకు తమిళ నాడుకు చెందిన గ్రామాలలో రాగి మాల్ట్, చృధాన్యాలు, తృణ ధాన్యాలు, సామలు, పల్లీలు, ఆయా కుటుంబ ఆరోగ్యం పై సమీక్షించారు.రక్త హీనత, సమాస్యలకు సౌకార్యాలను కల్పించి నూతన ఆహార పద్దతులు అలవారుచుకున్నారు. ఆరోగ్యం మెరుగు పడింది.స్వచ్ఛంద సంస్థలు కొర్పోరేట్లు సంస్థలు పరిశోదనా సంస్థలు గిరిజాన ఆరోగ్యం సలహా మండలి ప్రభుత్వ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం ప్రణాళిక బద్దమైన పద్దతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యం పెంచవచ్చు. దీనివల్ల జిల్లా ఆసుపత్రి కేంద్రాలకు వెళ్ళేందుకు దోహదం చేస్తుంది. దీనివల్ల ప్రత్యేక వైద్యులు నిపుణుల వైద్యం, వైద్య సేవలు ఒకటే సమాధానం కాదు. గిరిజన జనాభాలో మార్పుతో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలి. గిరిజనులు ఒక ఓటు బ్యాంకుగా చూడకండి వారికి అన్నిరంగాలలో సమాన అవకాశాలు ఇవ్వాలి గిరిజన మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టండి. అది ప్రభుత్వం బాద్యత.
read moreజామ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు...
ఇది మామూలుగా మనం ఏ పుస్థకంలో దో కాదు ఇది ఓ డాక్టర్ గారి స్వీయ అనుభవాన్ని మీముందుకు తీసుకు వస్తున్నాం.యదార్ధ సంఘటన. ఇది ఇరవై ఐదు సంవత్సరాల నాటి మాట ఈ విషయయం ప్రముఖ ఆస్ట్రేలియన్ హెర్బల్ వైద్యనిపుణుడు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు తెలుగు వన్ తో పంచుకున్నారు. ఈ మ్నేపద్యంలో తాను తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతున్నానని. చెప్పారు ఆస్ట్రేలియాలో ఉన్న చాలా మంది ఆలోపతి వైద్యులను సంప్రదించా నని చెప్పారు. చాలా మంది పిడియో డొంట్రిక్స్ సర్జన్స్ ఆ జ్ఞాన ద్సంతాన్ని తీయాల్సిదేఅని అన్నారు. అప్పటికే నా దవడ వాచింది తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను.అన్నారు లక్ష్మణ్ రావు ఇక పంటిని పీకడం తప్ప మరోమార్గం లేదని వైద్యులు హెచ్చరించారు.ఇక చేసేది లేక సరే అన్నాను అలా ఒక సారి బయటికి వచ్చి ఒక సారి ఎవరో చెప్పినట్టుగా ఇంటి ముందు ఉన్న జామ చెట్టు ఆకు రసం చేయగలదా అనే జిజ్ఞాస కలిగించింది.ఆధునుక వైద్యం కూడా నయం చేసుకోగలిగాను. ఆ అను భవం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆధునిక వైద్యం కూడా నయం చేయలేని చిగుళ్ళ వ్యాధిని ఒక సాధారణ చెట్టు ఆకు అతి త్వరగా అతి త్వరగా తేలికగా పూర్తిగా నయం చేయగలిగింది. అలా నా సమస్యకు పరిష్కారం నన్ను హెర్బల్ మూలికా వైద్యం పైన పరిశోదన చేయడానికి దారి తీసింది అంటున్నారు ఆ స్ట్రేలియా హెర్బల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు . హెర్బల్ మెడిసిన్ పై విదేశాలలో 40 సంవత్సరాలుగా చేస్తున్నట్లు ఆయన తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు.కేవలం వృక్ష సంబంద తో నయం చేసే ఔషదాలను తాయారు చేస్తూ సహజంగా హెర్బల్ మెడిసిన్ లో ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవని దీర్ఘ కాలిక వ్యాధులను ఖచ్చితంగా నయం చేయవచ్చు అంటున్నారు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు.
read more2030 నాటికి ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం ఎలా ఉంటుంది?
2030 నాటికి అసలు ప్రపంచం లోని ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నదే ప్రశ్న? ఇప్పుడు చీనా లోని ఊహాన్ ల్యాబ్ లో పుట్టిన వైరస్ అతలా కుతలం చేస్తోంది. ఇక చీనా వరాలజీ ల్యాబ్ లో ఉన్న వైరస్ లు మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తే ప్రజల అనారోగ్యం తో పోరాడుతూ ఉండాల్సిందేనా? మనల్ని వెంటాడే వైరస్ నుండి కాపాడు కోవాలంటే ఏమి చెయ్యాలి? అప్పటికి అంటే 2030 నాటికి మన ప్రపంచ దేశాలలో జీవిస్తున్న సగటు మనిషి కి ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాయా ? అదే నేడు ప్రపంచం ముందు ఉనాసవాల్. సంవచ్చరం గడిచి పోయింది మరెన్నో ప్రశ్నలు, సందేహాలు, 2030 నాటికైనా ఆరోగ్యరంగంలో భారాత్ అభివృద్ధి చెందుతుందా? వైద్య రంగంలో అభివృద్ధి చెందిండా అన్నదే ప్రశ్న? ఒక వేళ అభివృద్ధి చెందితే మొదటి వేవ్ ప్రభావంతో అసలు మనము ఏమి నేర్చుకున్నాము? అసలు రెండవ వేవ్ వస్తోంది దీనిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక లేదు? వైరస్ ను ఎదుర్కొడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచం చెపుతోంది. అయినా ఇప్పటికే వ్యాక్సిన్ ను పంపిణీ చేసే ప్రణాళిక లేకపోవడం శోచనీయం. ఇప్పటికీ ఒకడోస్ అందిన వారికి రెండవ డోస్ ఇంకా ఇవ్వలేదు. వ్యాక్సిన్ నిల్వలు లేవని. అందుకే రెండవడోస్ ఆలస్యం అవుతోంది. మొదటి వేవ్ లో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం సన్నద్దమ్ కాలేదు. ఇక ముంచుకొస్తున్న మూడో వేవ్ లో ఎలా సన్నద్ధమౌతుంది అన్నది తేలాలి. రెండవ వేవ్ లో వచ్చిన పరిణామాల దృస్ట్యా కనీసం ఏం చేయాలని అనుకున్నారు? అసలు ఆరోగ్య వ్యవస్థ పై నియంత్రణ ఉందా? ప్రణాళిక ఉందా ? ఆరోగ్య రంగం అంటే సేవా రంగం వినియోగ దారుడి కి సేవలు అందించడం ముఖ్యం దీనికి సంబందించిన కీలక ప్రశ్నలకు 2030 నాటికి జవాబుల భిస్తుందా ? దీని ధరలు మూడింతలు పెరుగు తయా? ఈ వైద్య విధానాన్ని భరించే శక్తి సామాన్యుడికి సాధ్యమేనా? అన్నది ప్రశ్న? ప్రభుత్వం ఏమైనా మార్పులు చేయాలని చెప్పడలిచిందా ? చాలా రకాల సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుంది.సృజనాత్మకత జోడించింది. వాటిని మానిటైజ్ చేసింది. కొంత మంది ఈ రంగానికి చెందిన వాళ్ళే కాదు. ఎక్కువ పెట్టుబడి పెట్టడం భవనం, సమీకరించడం. సృజనను జోడించారు. ఈవిధంగా ఆరోగ్య రంగం పై పెత్తనం చేయడానికి సిద్ధమౌతారు.ఇక వైద్య రంగం లో ప్రభుత్వం లో పెట్టుబడుల అంశం గురించి ఆలోచిస్తే కేంద్రం ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకోడం జరుగుతుంది ఇక వైద్య సేవరంగానికి సంబందించి ప్రభుత్వ పెట్టుబడులు పెడుతుందని విశ్వసించలేము. ఇప్పటికే వైద్య రంగాన్ని పూర్తిగా చేసిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఆలవాట్లలో చేతిని శుభ్రం చేసుకోవడం పరిశుభ్రంగా ఉండడం సామాజిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి కోరోనా వల్ల హెపటైటిస్ బి లేదా అంటు వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి థైరాయిడ్, డిసెంట్రీ, షింగ్రియా, ఇన్ఫెక్షన్, ప్రాణాలు హరిస్తున్న, టి.బి, మనం ట్రెస్, ట్రీట్, పేషెంట్ ఇండెక్స్, కాంటాక్ట్స్, వల్ల వ్యాధి విస్తరణ, జరగ కుండా ప్యాండమిక్, ను నిరోధించాలీ, కొన్ని దశాబ్దాలు నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఆరోగ్యం పై నిబద్దత కట్టుబడి ఉందా ? లేదా? అన్నది ముఖ్యం? ఇందుకు భిన్నంగా ఇంటి ఆరోగ్య సంరక్షణ, అత్యవసరం, ఎప్పుడు ఆసుపత్రి అవసరం చికిత్స, చికిత్స పద్దతులు ఇంట్లోనే ఉంటూ అలవాటు చేసుకోడం అవసరం. ఇంటి ఆరోగ్య సంరక్షణ పద్దతులు తెలిమేడికిన్, హోం ల్యాబ్, హోం ఫార్మా,హోంవ్యాక్సినేషన్, హోం హెల్త్, హెల్త్ మనీట్రింగ్, అన్నీ వేళలా ఎక్కువే, హోం హెల్త్ సోల్యూషన్ కొనుగోలు దారులు ఉంటారా. అను నిత్యం జీవితంలో భాగమై ఉండవచ్చు. ఇందుకోసం డాటా అవసరం. ఆరోగ్య విధానం నూతన పద్దతి... ఈ మధ్య కాలంలో ఛైనా లో ఉన్న వైరస్ కన్నా ఇతర వైరస్ ల ప్రభావం గనక ప్రపంచాన్ని చుట్టేస్తే ప్రకృతి పరంగా వచ్చే రోగాలు మున్ముందు మరింత ఇబ్బంది పెడతాయి. సాంకేతిక జ్ఞానం మరింత ఇబ్బంది కి గురికాక తప్పదు వాస్తవానికి చాలా రకాల రోగాల పై పోరాడాల్సి ఉంది .ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగం లోని వైద్యం ద్వారా సంరక్షించ బడాలి. దీనికోసం సుదీర్ఘ సమయంలో పరిశీలించడం, వృద్ధి సాధించడం అవసరం.డిజిటల్, తెలిహేయల్త్, ట్రేస్, అండ్ ట్రీట్ పడ్డాతిలో క్లోస్ కాంటాక్ట్ ల ద్వారా వ్యాప్తి చెందకుండా ప్యాండమిక్ సమయంలో జాగ్రత్త పడ్డారు.సాంప్రదాయ వైద్యాన్ని సాధన చేయడం ప్రత్యామ్నాయ వైద్య విధానాలను సాధన చేస్తూ నాణ్యమైన సురక్షిత మైన ఆరోగ్యం అవసరం. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ వైద్య రంగంలో సమగ్రమార్పులు చేపట్టడం దీనిని ఒక అవకాశంగా స్వీకరించి 2030 నాటికి సమగ్ర ఆరోగ్య విధానం తో అందరికీ ఆరోగ్యం అందించే బాధ్యత ప్రభుత్వాలదే.
read moreBoost your Immunity
Immunity holds lots of importance in preventing some serious contagious diseases. To keep the diseases at bay it is important to strengthen our body’s capability to resist harmful microbes from entering our bodies. It is our fortune that, there are some foods that can build up a protective-shield against the microbial diseases. Here are some immunity building foods: Yogurt is a great source of probiotics or most commonly known as ‘Good Bacteria’ which keep away diseases of gut and intestines. A 7-ounce intake of yogurt daily is as good as a popping in pills. A strain of Lactobacillus stimulate white blood cells and boost up our immunity Two cloves of Garlic a day fights off infectious bacteria and you are less likely to catch cold. Its intake is vital in lowering the risks of colorectal and stomach cancers besides building up our immunity Savoring Chicken Soup to tussle infections is an age old remedy, which was adopted by our forefathers too. It blocks the migration of inflammatory cells; the broth keeps minimal mucus just as the cough medicines do! Tea is yet another food that keeps policemen of our body all time vigilant. People who sip in tea are 10 times more capable of fighting off viruses owing to the increased virus-fighting policemen. For centuries together, people have looked upon to mushroom for healthy immune system. Recent researchers have proven that mushrooms are efficient in raising the production and activity of the white blood cells to fight off the diseases! Having good resistance to microbes is indeed a Boon! Because Prevention is always better than Cure! Stay Healthy!! Stay Forever!!
read moreThe Scary Nosebleed!!
The nosebleed or also known as epistaxis is the bleeding from the nose, and in severe case it may present as bleeding from the eyes or even mouth. The nosebleeds are rarely life-threatening, they are spontaneous and self-limiting, and however recurrent ones can be a reason for concern. Epistaxis can be divided into 2 categories, based on the site of bleeding as, anterior bleeds and posterior bleeds. Most of the nosebleeds are anterior epistaxis, which occurs from the Little’s area, wherein the External and internal carotid arteries anastomose, thus the bleeds are constant ooze rather than pulsatile bleed. Posterior bleed arise further back in the nasal cavity, are usually more profuse, and are often of arterial origin, and are even more dangerous than the anterior nosebleeds. The most probable cause of nosebleed is the mucosa is eroded by cold and dry climate, exposing and subsequently rupturing the blood vessels. Local trauma is the most common cause, followed by facial trauma, foreign bodies, nasal or sinus infections, and prolonged inhalation of dry air. Children usually present with epistaxis due to local irritation or recent upper respiratory infection. While, the systemic causes include; blood dyscrasias, arteriosclerosis, hereditary hemorrhagic telangiectasia, drug abuse and idiopathic causes. The peak incidence is seen among the children of 2-10 years mostly due to self-inflicted local trauma, and also in elderly 50-80 years due to systemic and cancerous growths. The management includes, first calm down the patient, then apply direct pressure over the soft and fleshy part of the nose hold it from about 5minutes and up to 20minutes, never hold your head back instead tilt it forward which helps decreasing the chances of nausea and airway obstruction. The nosebleed that do not subside within 20minutes require medical attention, this involves local application of vasoconstrictor or the use of silver nitrate to cauterize bleeding blood vessels. Rarely might require surgical ligation of the blood vessels. -Koya Satyasri
read moreప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31 న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పొగాకు వాడకం వల్ల వచ్చే అనార్ధాల పై అవగాహన కల్పించే ప్రక్రియను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టింది. ప్రపంచం పొగాకు రహిత సమాజంగా రూపొందించాలన్న లక్ష్యంగా డబ్ల్యూ హెచ్ ఓ ప్రయత్నం చేస్తోంది. ప్రతి యేటా పొగాకు వాడకం వల్ల 6 మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 20 30 నాటికి ఈ సంఖ్య 8 మిలియన్లు చేరే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే వైరస్ తో పోరాడు తున్న ప్రపంచ ప్రజలు అనారోగ్యం తో సత మత మౌతూ మరణిస్తున్న వేళ పొగాకు వాడకం వల్ల వచ్చే సమస్యలు తోడైతే ప్రజా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రజలు తమ ఆరోగ్యం కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని తమ ఆదాయాన్ని పూర్తిగా ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సిన పరిస్తితి ఉందని అన్నారు.సగటున సంవత్సరానికి సగటున 4 ,0 0 0 సిగరెట్లు వాడతారని పేర్కొంది. ఇంత డబ్బును సిగరెట్ల కోసం ఖర్చు చేసే బదులు ఇతర ఆహార విహారాలకు వెచ్చించ వచ్చని సూచించింది.ప్రపంచం పొగాకు రహిత సమాజంగా తీర్చి దిద్దాలన్నదే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చింది. ప్రపంచ పొగాకు వ్యతి రేక దినోత్సవం చరిత్ర ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 19 8 7 లో నే ప్రారంభించారు. పొగాకు వల్ల వచ్చే సమస్యలు తలెత్త డంతో మరణాలు అధికం కావడంతో 19 8 7 లో ప్రపంచ ఆరోగ్య సభ ఒక తీర్మానం చేసింది. పొగాకు వాడకం వల్ల ఊపిరి తిత్తులకు సంబందించిన సమస్యలు నిమోనియా, టి బి , వంటి సమస్యలు ఇతర సమస్యలు దారి తీయవచ్చు. నని 20 0 8 లో గుర్తించారు.పొగాకు వాడకం వల్ల ప్రకటనల రద్దు చేసింది. 20 14 నాటికి ప్రపంచం లో సిగరెట్ల ఉత్పత్తి రంగం లో అగ్రగామి చైనా కావడం మరో విశేషం. ప్రపంచంలో 30 % సిగరెట్ల ఉత్పత్తిలో వినియోగంలో ను చైనా ముందు వరుసలో ఉంటుంది. 20 వ శతాబ్దంలో 10 0 మిలియన్ల ప్రజలు పొగాకు తాగడం వల్లే చని పోయినట్లు అంచనా. యూఎస్ లో 16 మిలియన్ల ప్రజలు ముఖ్యంగా అడల్ట్స్ పొగతాగడం వల్ల అనారోగ్యం పాలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో మరణాలు 15 % కేవలం పొగ తాగడం వల్లే నని పేర్కొంది. 70 సంవత్సరాల వయస్సు పై బడిన వారు సగానికి సగం మరణాలు పొగాకు తాగడం వల్లే అని తేల్చింది. ప్రతి 5 గురిలో ఒక్కరు పొగాకు తాగడం అలవాటు.7 మిలియన్ల ప్రజల మరణాలలో 1.3 మండి పొగాకు వాడిన వారే ఉన్నారని తేల్చారు. 1.2 మిలియన్లలో 1.3 బిలియన్ల ప్రజలు పొగ తాగే వారిపక్క న కూర్చోడం వల్లే చని పోయారు. పొగాకు అనర్ధాలకు 5 కారణాలు 1) పొగాకులో హానికరక రసయానాలు ఉంటాయి. 2) కొన్ని రసయానాలు క్యాన్సర్ కు కారకాలుఉన్నట్లు గుర్తించారు. 3) పొగాకు నియంత్రణకు సంబంచిన చట్టాల అమలు ప్రచారం చేయాలి. 4) రానున్న ముందు తరాల పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున పొగాకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలి. 5) పొగ తాగడం వల్లే మీలోని సృజనాత్మక తను చంపేస్తుంది. పొగాకు ఉత్పత్తులు, వాటివల్ల వచ్చే అనార్ధాలను నిరోధించడానికి పార్లమెంట్ లో చేసిన చట్టాలు ఖటినంగా అమలు చేయాలని డబ్ల్యూ హెచ్ ఓ స్పస్టం చేసింది.
read moreసంప్రదాయ వైద్యంతోనే ఆరోగ్యం
ఆయుర్వేదం అత్యంత శాస్త్ర్హీయ వైద్య శాస్త్రం. మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునే చికిత్స ఆయుర్వేద వైద్య విధానం ద్వారా చేసే చికిత్స అద్భుత వైద్యంగా వందల సంవత్సరాల క్రితం నిరూపిత మైంది.ఈ వైద్యంలో అనుసరిస్తున్న చికిత్స పద్దతులు మన పూ ర్వీకులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతావనిలో నే అనుసరించారని చరిత్ర చెపుతోంది.ఆయుర్వేద సంస్కృత పదం దీనిని ఇతర సాహిత్యం లోకి అనువదించి నప్పుడు. సుదీర్గ కాలం పాటు జీవించేందుకు కావల్సిన జ్ఞానం. ఆయుర్వేద నిర్వచనం ప్రచారం ఆయుర్వేదం అంటే ఆయుష్టు ను పెంచుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. రోగాన్ని మూలాల నుండి నిరోదిస్తుంది. హోలిస్టిక్ సైన్స్ గా పేర్కొన్నారు.ఆరోగ్య సంరక్షణ చేయడం తో పాటు .వ్యక్తిని ఆరోగ్యం గా ఉంచే శక్తి ఆయుర్వేదనికి ఉంది.వ్యాధి స్వరూప స్వభావాన్ని బట్టి సమస్యను గుర్తించేందుకు వాత, పిత్త, కఫం అనే విధానాన్ని అనుసరించి చికిత్స చేస్తారు.శరీరం లో వచ్చే వివిద రకాల శబ్దాలు. శరీరం లో అవయవాలు , మనస్సు.సంస్కృతంలో శరీర మనసు ఆత్మ ఇదే జీతానికి మూడు ఆధారాలు.మూడు భాగాలు సమానంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.మన పూర్వీకులు, తప్పస్సు చేసిన ఋషులు, మనకు ఆయుర్వేదం మూల సిద్దాంతలను., విధానాలను తెలిపారు ఫిజియోలజీ,మైండ్ ,బోడి, మెడిసిన్, ఆయుర్వేదానికి సంబందించి విధి విధానాలను పురాతన ఆయుర్వేద శాస్త్రం ఋగ్వేదం లో కను గొన్నారు. వైద్య శాస్త్రాని కి సంబందించి తాళ పాత్ర గ్రంధాలలో చరక సంహిత , శుస్రూతుడు, వాగ్బట వంటి వారు తమ గ్రంధాలను భారతీయులకు అందించారు. ఇంకొంత మంది సిద్ధులు రక రకాల విభాగాలు, సాధారణ వైద్యం, పీడియాట్రిక్స్, శాస్త్ర చికిత్స, టోక్షికొలోజీ , ఫెర్టిలిటీ, వంటి అంశాలని పద్దతులను సాధన ఎప్పుడైనా చేయ వచ్చని పేర్కొన్నారు. మన చుట్టూ ఉన్న ప్రపంచలో చాలా ఆరోగ్య పద్దతులు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా అదీ సూర్య రశ్మి వల్ల మరెన్నో ఆరోగ్య లా భ్హాలు ఉన్నాయని చెపుతున్నాయి ఆయుర్వేద శాస్త్రాలు. ఆయుర్వేదం లోని ప్రధాన సూత్రాలలో ఒకటి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని సమతౌల్యంగా ఉంచాలి అవ్దే శరీరం, మనస్సు, ఆత్మ , ఇందులో ఏ ఒక్కటి లోపం ఉన్నా శరీరానికి అనారోగ్యం వస్తుంది. ప్రపంచం మొత్తం లో ఆయుర్వేద శాస్త్రంలో ని ప్రధాన సూత్రాలు వాత, పిత్త, కఫం.ఆధారంగానే రోగి తత్వాన్ని గుర్తిస్తారు. ప్రపంచం పంచ బూతాలతో నిండి ఉంది అందులో గాలి, నీరు, అగ్ని,భూమి,ఆకాసం, ఈ పంచ భూతాలలో మనుషులలో మూడు దోషాలు శక్తులు అవే వాత, పిత్త,కఫ అని నిర్ధారించారు. శరీరంలో వచ్చే సమస్యను ఎదుర్కొడానికి, వీటి మధ్య సమతౌల్యాన్ని సాధించాలి.సమస్యను తొలగించాలి. మూడిటి లో సమ తౌల్యం లోపించకుండా మూల కారణాన్ని కనుగొని నివారణ సమతౌల్యాన్ని సాధించ వచ్చు. ముఖ్యంగా ఎప్పుడు జట రాజ్ఞి, పోష్టీక ఆహారం తీసుకుని పనికి రాని చెడును మొత్తంగా తీసివేస్తుంది. ఇది చాలా సులభం. ఇందులో ఏ దోషమైనా శరీరంలో ఉన్నప్పుదు ఒక పరిమిత స్థాయిలోలేనప్పుడు శరీరం గతి తప్పు తుంది.వారి వారి శరీరాలలో అన్నీ సమానంగానే ఉంటాయి. ఈ దోషాల నుండి విముక్తి పొందాలంటే వారి జీవన శైలి,ఆహార విహారాలలో పౌష్టిక ఆహారంవిధానాలను సూచించారు దీనివల్ల శరీరంలో అదనంగా పేరుకు పోయిన దోషాలను తొలగిస్తుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం గా ఉన్నాడు అనెందుకు శుశ్రుత సంహితలో ఎవరి దోషాలు అయితే సమానంగా ఉంటాయో శరీర తత్వం, పొట్ట, కణాలు సహజంగా పనిచేస్తాయో. ఎవరి మనస్సు శరీరం ఆత్మ ఆనందంగా ఉంటారో వారే ఆరోగ్య వంతుతులు. అంటారు అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని అంటున్నారు.సాంప్ర దాయ వైద్యం తోనే ఆరోగ్యం అన్న విషయం ఆర్ధ మౌతోంది.
read moreధూమపానం మరణంతో సమానం
ప్రతి సిగరట్ ప్యాకేట్ మీద ఎంతో చక్కగా రాస్తారు స్మోకింగ్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్ అని,కాని అది ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బు ఖర్చు పెట్టి మరీ సిగరెట్ తో పాటు రోగాలని కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ ధూమపానం వల్ల ప్రతి 8 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారని ఒక అంచనా. ఈ రోజు No smoking day. ఈ సందర్భంగా కొంతమంది అయినా ఈ అలవాటుకి దూరమయితే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు. ఈ సిగరెట్ కాల్చేవాళ్ళకి ఎంత ముప్పు ఉందో అది కాల్చకపోయిన పక్కనే ఉండి పీల్చేవాళ్ళకి దానికి రెండింతలు ముప్పు పొంచిఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. సిగరెట్ తయారుచేయటానికి వాడే పదార్థాలలో 4000 కెమికల్స్ కలిసి ఉంటాయట. ఒకప్పుడు ఏదైనా బాధలోంచి బైటకి రాలేనివారు ఒక మత్తు పదార్ధంగా భావించి దీనికి అలవాటు పడేవారు. కాని ఈ రోజుల్లో పొగతాగటం ఒక ఫాషన్ గా మారిపోయి ప్రాణాలని తెలియకుండానే మింగేస్తోంది. సిగరెట్ లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ప్రభావం వల్ల గుండె కొట్టుకోవలసిన వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుని గుండె దడకి, గుండెపోటుకి దారితీస్తాయి. పొగతాగేవారిలో 90% మంది లంగ్ కాన్సర్ బారిన పడుతున్నారట. 70% మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారట. సిగరెట్ లో కలిపే తారు, నెయిల్ పాలిష్ రిమూవర్, క్రిమిసంహారక మందు మొదలైనవాటివల్ల ఆరోగ్యం విపరీతంగా క్షీణించటమే కాకుండా మరణానికి కూడా దారితీస్తుంది. పొగపీల్చటంవల్ల గాలిపీల్చే గొట్టాలకి కెమికల్స్ అంటుకుపోయి ఆయాసం, ఉబ్బసానికి దారి తీస్తాయి. రక్తప్రసరణకి ఆటంకం ఏర్పడటమే కాకుండా ప్రాణవాయువు సరిగా అందకుండా చేస్తుందిట ఈ సిగరెట్. మన దేశంలో 60 లక్షల మంది శ్రామికులు ఈ పొగాకు ఉత్పత్తులు సాగు చేస్తున్నారు. ఒకేసారి ఈ ఉత్పత్తుల మీద నిషేదాలు విధించకుండా, వాళ్లకి వేరే ఉపాధి అవకాశాలు చూపించి ఈ పొగాకు ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ పొతే మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా భారత్ లో సిగరెట్ రేటు 10% పెంచితే వాటి వాడకం నలుగు నుంచి ఐదు శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ధూమపానం అలవాటుకి దూరమవ్వాలనుకునేవారు ఎప్పుడైనా పొగ తాగాలనిపిస్తే నీరు ఎక్కువగా తాగటం వల్ల ఆ కోరిక తగ్గుముఖం పడుతుందిట. అలాగే పొగ తాగాలనిపించిన వెంటనే ఆ మూడ్ లోంచి బయటకి రావటానికి వాకింగ్ కి వెళ్ళటమో లేదా చూయింగ్ గమ్ లాంటిది అలవాటు చేసుకోవటమో చెయ్యాలి. అంతేకాక మెడికల్ షాపుల్లో కూడా వీటికి తగ్గ మందులు దొరుకుతున్నాయి. ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చెయ్యకూడదని ఎన్నో రకాల ఆంక్షలు విధించినా ప్రజలలో సరైన అవగాహన లోపించటంతో ఆ చట్టాలన్నీ నీరుగారిపోతున్నాయి. ప్రజలలో చైతన్యం వచ్చిన రోజు ఈ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. ..కళ్యాణి
read moreసుఖం ఎక్కువైతే..దుఖమే
సెక్స్..మానవజాతి తన గమనాన్ని కొనసాగించేందుకు సృష్టి ఇచ్చిన అద్భుతమైన వరం. కేవలం పిల్లల్నికనడానికే కాదు..రెండు శరీరాలకు సాంత్వన కలిగించే క్రియ ఇది. ఎంత ఒత్తిడిలో ఉన్నా..ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటన్నింటిని చిత్తు చేసే శక్తి సెక్స్కు ఉంది. అందుకే భారతీయులు దానికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు. లైంగిక వాంఛ అన్నది ప్రతి మనిషిలోనూ అత్యంత సహజంగా ఉండే భావన. ఇది జీవితంలోని తృప్తికీ, గాఢమైన అనుభూతికీ, మరెన్నో భావోద్వేగాలకూ కీలకమైన కేంద్రం. అందుకే మన పురాణాల్లోనూ..దేవాలయ శిల్పాలుగానూ రతి అన్నదానిని చేర్చారు మన పెద్దలు. కాలంతో పాటే ఈ ప్రక్రియలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నాలుగు గదుల మధ్యలో సాగే వ్యవహారాన్ని..నలుగురికి తెలిసేంతగా బరితెగిస్తోంది నేటీ తరం..అతి ఎక్కడైనా పనికిరాదు అన్నట్లు విచ్చలవిడి శృంగారం వల్ల చేటు తప్పదు. ఆ తప్పుకు శిక్షగా సుఖవ్యాధులు మానవాళిని కబలిస్తున్నాయి. అయితే కాలంతో పాటే సుఖవ్యాధుల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సిఫిలిస్, గనోరియా, షాంక్రాయిడ్ వంటివే ఎక్కువగా కనబడేవి. కానీ ఇటీవలి కాలంలో లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. శక్తివంతమైన యాంటీబయాటిక్స్ కనిబెట్టిన తర్వాత సుఖవ్యాధులను జయించవచ్చని మనిషి సంబరపడ్డాడు. కానీ ఇప్పుడు వైరస్ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి. ఒకప్పుడు యాంటీబయోటిక్స్కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏ మాత్రం లొంగకుండా..మొండిగా తయారవుతున్నాయి. శరీర నిర్మాణపరంగా పురుషులకంటే స్త్రీలకే సహజంగా సుఖవ్యాధులు సోకే అవకాశాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే లక్షణాలేవి కనబడకపోవచ్చు. వీటి కారణంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన రాహిత్యం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటివి ముంచుకొచ్చే ప్రమాదముంది. కొన్ని రకాల సుఖవ్యాధుల బారిన పడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దాదాపు 20 ఏళ్లకే యువతీయువకులు సెక్స్లో పాల్గొంటున్నారు. ఈ వయసులో ఆకర్షణ, ప్రేమ వంటి వ్యవహారాల వల్ల ఒకరి కంటే ఎక్కువ మందితో అసురక్షిత శృంగారంలో పాల్గొని సుఖవ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ శృంగారం అంటే సంభోగమే కాదు. ముద్దులు ఇతర లైంగిక చర్యలు కూడా శృంగారం కిందకే వస్తాయి. చాలా మంది వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ..నలుగురికీ తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతూ లోలోపల తామే కుంగిపోతున్నారు. కొందరు వైద్యుల వద్ద కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ తీవ్ర సమస్యల్లోకి జారిపోతున్నారు. ఇలాంటి వారి జీవితం నరకం కావడమే కాకుండా..వీరి ద్వారా ఇతరులకూ వ్యాపించి సమాజం మొత్తాన్ని విష వలయంలోకి నెట్టేస్తాయి. అందుకే సుఖవ్యాధులు దరిచేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించడం ఒక్కటే సరైన మార్గం. * తెలిసీ తెలియక లైంగిక ప్రయోగాలకు దిగవద్దు. * నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడం మంచింది. * అపరిచితులతో సెక్స్లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్ ధరించాలి * శృంగారంలో అసహజ పద్ధతులకు దూరంగా ఉండాలి.
read moreమహిళలకు హై బీపీ వస్తే...
మధ్య వయస్సు మహిళలకు హై బీపీ వస్తే గుండె సమస్యలు తప్పవ? హై బీపీ వస్తే గుండె సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు 40 సంవత్సరాలమధ్య వయసు ఉన్న మహిళలు బీపీ హై బీపీ సమస్యలతో బాధపడు తున్నారని ఒక పరిశోదన వెల్లడించింది. మధ్య వయస్సు లో ఉన్న మహిళలో 40 - 5 0 సంవత్సరాల లో ఉన్న పురుషులకంటే స్త్రీలలోనే గుండె దమనులు నాశనం చేస్తున్నాయని లో బీపీ అత్యంత ప్రమాద కరమని డాక్టర్ నిర్ధారించారు. హై బీపీ లో బీపీ వల్ల గుండె పోటు, శరీరానికి రక్త ప్రసారం, ఆక్సిజన్ అందడం లో సమస్యలు వచ్చి నట్లు గుర్తించారు. పాశ్చాత్య దేశాలలో అక్క్యుట్ కోరోనరీ సింగ్డ్రోమ్ వల్ల మరణాల రేటు పెరిగినట్లు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి యువతులలో ఈ సమస్య పెద్దగా లేదని నిపుణులు విశ్లేషించారు.కొన్ని దేశాలలో యువతులు మధ్య వయస్సులో ఉన్న మహిళలలో అక్క్యుట్ కోరోనరీ సింగ్డ్రోమ్ పెరుగు తున్నట్లు గుర్తించారు.ఒక పరిశోదనలో పురుషులకంటే స్త్రీలలోనే రక్త పోటు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు యువతులకు వస్తున్న ఆంశం పైన పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఒక నూతన పరిశోదన ప్రకారం 40 సంవత్సరాలకు ముందే రక్త పోటు చాలా తక్కువగా ఉంటుందని దీనిని స్టేజ్ 1 గా యు ఎస్ లో గుర్తించారు.
read moreఓట్స్ అంటే ఔషధమే!
ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో పాటుగా ఓట్స్ వాడకం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఓట్స్ అంటే తెలియనివారు ఉండరు. నిజానికి ఓట్స్ మన దేశానికి చెందిన పంట కాదు. ఐరోపా, పశ్చిమాసియా దేశాలలో వేల సంవత్సరాలుగా దీనిని పండిస్తూ వచ్చారు. అయితే దీనిని ఎక్కువగా పశువుల దాణాగానే ఉపయోగించేవారు. గుర్రాలు వేగంగా పరుగులెత్తేందుకు కావల్సిన శక్తిని అందించే ఆహారంగా దీన్ని భావించేవారు. 19వ శతాబ్దం నాటికి నిదానంగా ఓట్స్ పోషక విలువలు అర్థం కాసాగాయి. ఓట్స్తో బ్రెడ్ల తయారీ మొదలైంది. పోషకాలే పోషకాలు!: ఓట్స్ ఏడాది పొడవునా పెరిగే పంట. ఎంతటి వర్షపాతాన్నయినా తట్టుకుని పండే సత్తా దీనికి ఉంది. ఇక ఓట్స్లో ఉండే పోషక విలువల గురించి చెప్పనే అక్కర్లేదు. విటమిన్లు అందునా ‘బి’ విటమిన్లలో ఉండే అన్ని విభాగాలూ (B1, B2, B3, B5, B6, B9) ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, ఖనిజాల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అందుకే హోమియోపతిలో సైతం దీనిని ‘అవీన సటీవా’ పేరుతో విస్తృతంగా వాడుతూ ఉంటారు. నిస్సత్తువ, నరాల బలహీనతా, గుండె జబ్బులు... వంటి అనేక సమస్యలలో అవీనా సటీవా అద్భుతంగా పనిచేస్తుంని హోమియోపతి వైద్యులు నమ్ముతారు. కొవ్వుని కరిగిస్తుంది: ఊబకాయం తగ్గాలంటే ఓట్స్ గొప్ప ఆహారం అని జనం భావించడం వెనుక శాస్త్రీయత లేకపోలేదు. చాలా తక్కువ పదార్థాలలో ఉండే beta-glucan అనే పీచు పదార్థం ఓట్స్లో కనిపిస్తుంది. ఈ beta-glucan చెడు కొవ్వుని కరిగించి, అది రక్తంలో పేరుకోకుండా చేస్తుంది. పైగా ఆహారం శుభ్రంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఒక గుప్పెడు ఓట్స్ తీసుకున్నా కూడా అందులో ఉన్న beta-glucan అటు కొవ్వుని కరిగించేందుకు, ఇటు జీర్ణశక్తికి మెరుగుపరిచేందుకు సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. పైగా శరీరంలో క్రిముల వల్ల ఏర్పడే ఇన్షెక్షన్లను కూడా ఈ beta-glucan ఎదుర్కొంటుందని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. రక్తపోటుని నియంత్రిస్తుంది: ఒక 40 గ్రాముల ఓట్స్లో రోజుకి సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. దానివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు! రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. అంటే తరచూ ఓట్స్ను తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందన్నమాట. ఇతర తృణధాన్యాలు తినలేనప్పుడు: కొంతమందికి గోధుమలు, బార్లీ వంటి తృణధాన్యాలు సరిపడవు. ఇందులో ఉండే గ్లూటెన్ అనే మాంసకృత్తుల సముదాయం వల్ల వారిలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ పదార్థాలన్నింటికీ దూరంగా ఉండటం వల్ల, మనకి కావల్సిన పోషకాల నుంచి దూరమవుతాం కదా! చిత్రంగా ఓట్స్లో గ్లూటెన్ ఉన్నప్పటికీ, అది ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించడం లేదని తేలింది. ఇంతేకాదు... ఆస్తమా మొదలుకొని క్యాన్సర్ వరకూ ఓట్స్ ఎన్నోరకమైన అనారోగ్యాలు తలెత్తకుండా ఉండేందుకూ, శరీరంలో ఉన్న రుగ్మతల నుంచి స్వస్థత పొందేందుకూ ఒక ఔషధిలాగా పనిచేస్తుందని తరచూ ఏదో ఒక పరిశోధన రుజువు చేస్తోంది. మరెందుకాలస్యం. మన రోజువారీ ఆహారంలో ఓట్స్ను కూడా చేర్చేసుకుంటే సరి! - నిర్జర
read moreవైట్ ఫంగస్ అత్యంత ప్రమాదకరమా?
ఒక పక్క కరోనా వైరస్, మొన్న బ్లాక్ ఫంగస్, ఇప్పుడు వైట్ ఫంగస్ ప్రజల ను మింగేయ్య డానికి వచ్చిపడింది. వైరస్ ను కట్టడి చేయచ్చు. కానీ శరీరం లోపల పేరుకు పోయిన బూజు అదే ఫంగస్ శరీరం లోని కణ జలాన్ని తినేస్తుంది. ఒక్కో అవయవంలోకి చెరీ న ఫంగస్ లు రెండు రకాలని ఒకటి బ్లాక్ ఫంగస్,రెండవది వైట్ ఫంగస్ అని నిపుణులు తేల్చారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వైట్ ఫంగస్ రొగులు ఉన్నారని వైద్యులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాద కరమని తేల్చారు. వైట్ ఫంగస్ ఊపిరి తిత్తులు,గోళ్ళు, చర్మం, పొట్ట, కిడ్నీ, మెదడు,నోరు , వంటి భాగాలను తీవ్ర ప్రభావం చూపుతుందనిఅంటున్నారు. వైట్ ఫంగస్ లక్షణాలలో ఒకటి ఊపిరి తిత్తుల్లో నొప్పిగా ఉండడం లేదా పట్టినట్లు ఉండడం. ఊపిరి పీల్చు కోడం లో ఇబ్బంది పడడం. సహజంగా చాలా మందికి శరీరంలో ఇన్ఫెక్షన్ లు ఉంటూనే ఉంటాయి. ఉదాహరణకు, ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్. డయాబెటిస్ వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, కలుషిత ఆహారం తీసుకుంటే పొట్టలో ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఇలా ఒకటో ఏమిటి మనశరీరం అంతా ఇన్ఫెక్షన్ల పుట్ట. ఇక దీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటున్న వారికి సుదీర్ఘ కాలం పాటు అన్నీ బెడ్ మీదే సాగే రొగులు అలాగే మంచం పై ఉంటే బెడ్ సోర్స్ వల్ల శరీరం లో పుండు ఏర్పడి ఆ భాగమ్ ఇన్ఫెక్షన్ కు గురి అయి అది ఇతర అవయవాలను చెరీ తినివేయడంవల్ల ఇన్ఫెక్షన్ తొల గించడానికి తీవ్రంగా శ్రమించాలి అయినా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కిడ్నీలో చెరీ ఇబ్బంది పెడుతుంది అలాగే సకాలంలో ఇన్ఫెక్షన్ ను గుర్తించి ట్రీట్మెంట్ లో సరైన యాంటీ బాయిటిక్స్ ఐ వి ఇంటర్ వైన్ ఇస్తే ఇన్ఫెక్షన్ తగ్గి మనిషిని బతికించవచ్చు లేదా ఆ యిన్ఫెక్షన్ అన్నీ అవయవాలను తినేస్తే శరీరం చికిత్సకు స్పందించకుంటే చనిపోతారని వైద్య నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలం పాటు చికిత్సలౌన్న సర్జరీ చేసిన త్రువాత ఇన్ఫెక్షన్ లో చీము చెరీ చనిపోయిన వారిసంఖ్య చాలానే ఉంటుంది. వైట్ ఫంగస్ కన్నా ఇన్ఫెక్షన్ లే ప్రాణాలను తీసేస్తాయి. వైట్ ఫంగస్ ఇన్ఫెక్షనా కాదా కేవలం బూజు మాత్రమేనా యాంటీ బాయిటిక్స్ కు లొంగు తుందా అన్న విషయాన్ని నిపుణులు పూర్తిగా దృవీకరించాల్సి ఉంది. ఏది ఏమైనా ఫంగస్ ప్రాణాంతకం అని చెపుతున్నారు డాక్టర్స్. సొ జరబధ్రం మరి.
read moreమంచి ఆరోగ్యానికి పంచశీల సూత్రాలు
ఆరోగ్యానికి తప్పని సరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు... 1) ఆరోగ్యానికి పండ్ల రసాలు మంచివి అని మనకి తెలుసు. అయితే మందులు వేసుకున్న వెంటనే మాత్రం పండ్లరసాలు త్రాగకూడదు. అలా తాగితే మందులు పూర్తిస్థాయి ఫలితాలని ఇవ్వవు అని చెబుతున్నారు వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకులు. 2) క్యారెట్లలో ఉండే ఫాల్ కారినల్ కాన్సర్ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాలలో తేలింది. కానీ వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు ఆ పరిశోధకులు. క్యారట్ని తరిగి, ఉడకబెట్టడం వలన వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయట. క్యారట్కు ప్రత్యేకమైన తియ్యటి రుచిని ఇచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయి. కాబట్టి ఆరోగ్యం కోసం క్యారట్ తినాలంటే అలాగే తరగకుండా ఉడికించి తినాలి, లేదా పచ్చిగా తినాలి. 3) ప్రతీరోజూ పెరుగు తింటే చిగుళ్ళ వ్యాధులు రావు. పెరుగులోని లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్ళపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. దానివల్ల చిగుళ్ళు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి . 4) రోజూ వీలైతే మధ్యాహ్నం భోజనం తరవాత ఒక 45 నిముషాలు చిన్న కునుకు తీయండి. ఆ కునుకు మీ గుండెను కాపాడుతుంది అని అంటున్నారు అమెరికన్ పరిశోధకులు. రోజూ మధ్యాహ్నం 45 నిముషాలు పడుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి వలన, రాత్రిపూట గాఢంగా నిద్రపోయే సమయం తగ్గడంతో రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు పెరిగిపోయాయని, ఆ ముప్పు నుండి తప్పించుకోవాలి అంటే, పగటినిద్ర అవసరం అని సూచిస్తున్నారు వీరు. 5) సన్నగా కనిపించాలి అన్న ఆరాటంతో గంటలకి గంటలు కఠిన వ్యాయామాలు చేయడం వలన, లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసేముందు ఎంతసమయం వ్యాయామం చెయ్యాలి, ఎలా చెయ్యాలి వంటి విషయాలలో నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి అట. ఎందుకంటే అవగాహనా లేకుండా ఎక్కువ సమయం కఠిన వ్యాయామాలు చేస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదంఎక్కువంటున్నారు నిపుణులు -రమ
read more


















.jpg)



