LATEST NEWS
 అన్నమయ్య జిల్లాలో  సోమవారం (ఏప్రిల్ 7) జరనిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ మరణించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్‌-2 స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మాదేవి సంఘటనా స్థలంలోనే మరణించారు. మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  రాయ‌చోటి క‌లెక్ట‌రేట్‌లో గ్రీవెన్స్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.  క్ష‌తగాత్రుల‌ను క‌లెక్ట‌ర్ శ్రీధ‌ర్ ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికైన ఎణిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు సోమవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికైన ఎనిమిది మందిలో ఏడుగురి చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.  బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు.  ఇక ఎమ్మెల్యే   కోటాలో కాంగ్రెస్‌ ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు ప్రమాణ స్వీకారం చేశారు.  కరీంనగర్‌ పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు, అలాగే ఖమ్మం టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంగెలిచిన పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.  దాసోజు శ్రవణ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నతి తెలియరాలేదు.  
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో  ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ సీఐడీని ఆదేశించింది.  తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ఏపీలో వైసీపీ హయాంలో మద్యం విక్రయాలలో  అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అరెస్టు చేసింది కూడా. అయితే ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. అయినా సరే మిథున్ రెడ్డి తనను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ముందు హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు ఎఫ్ ఐఆర్ లో పేరు లేకుండా ముందస్తు బెయిలు పిటిషన్ ఎలా ధాఖలు చేస్తారని ప్రశ్నించి, ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో  మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం సుప్రీం ను ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను మంగళవారం (ఏప్రిల్ 7) విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది.  
ఇహనో.. ఇప్పుడో వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కానున్నారా? ఆంధ్రప్రదేశ్ సీఐడీ బృందాలు ఢిల్లీలో ఉండటానికి కారణం అదేనా. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో  తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ మంగళవారం(ఏప్రిల్ 7) విచారణకు రానుంది. అయితే ఇప్పటికే ఏపీ హైకోర్టు ఇదే విషయంలో మిథున్ రెడ్డి దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఎఫ్ఐఆర్ లో పేరే లేకుండా ముందస్తు బెయిలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు ఎఫ్ ఐఆర్ లో లేదు. అయినా మిథున్ రెడ్డి సుప్రీంకు వెళ్లారు. ఆయన పిటిషన్ ను సుప్రీం మంగళవారం (ఏప్రిల్ 7) విచారించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీ చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా మిథున్ రెడ్డి అరెస్టు అవుతారా అన్న అనుమానాలనూ పెంచుతోంది.   ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కర్త, కర్మ, క్రియగా జరిగిన ఏపీ మద్యం కుంబకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని మాజీ ఎంపీ, వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఒకప్పటి నంబర్ 2 విజయసాయి మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు.  ఇలా ఉండగా సీఐడీ కూడా తన దర్యాప్తులోఏపీ మధ్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిందని అంటున్నారు.  ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. జగన్ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అధికార కేంద్రంగా వెలుగొందారు. జగన్ ఐదేళ్ల పాలనలో పెద్దిరెడ్డి ఇష్టారీతిగా వ్యవహరించారు. అప్పట్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ పెద్ద పెద్ద సవాళ్లు సైతం చేశారు.  అరాచకం సృష్టించడం, సొమ్ములు వెదజల్లడం ద్వారా కమ్మం మునిసిపాలిటీ అప్పట్లో వైసీపీ వశం కావడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర వహించారు.  జగన్ ఐదేళ్ల పాలనలో పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ చిత్తుగా పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత నుంచీ పెద్దిరెడ్డిని గత పాపాలు వెంటాడుతున్నాయి. మీడియా పెద్దిరెడ్డి అరాచకాలు, నేరాలు, కుంభకోణాలను వెలికి తీసింది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి పెద్దిరెడ్డిపై ఎటువంటి చర్యా లేదు. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన పెద్దిరెడ్డి అరెస్టు అయితే అది పెద్దిరెడ్డికి తన అరెస్టు కంటే పెద్ద శిక్షే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టైతే పెద్దరెడ్డి ప్రతిష్ఠ మరింత మసకబారుతుందనడంలో సందేహం లేదు. అంతే కాకుండా కొడుకు జైలుపాలై ఇబ్బందులు ఎదుర్కోవడం కంటే తండ్రికి పెద్ద శిక్ష ఏముంటుందని అంటున్నారు.   అంతే కాకుండా  తాజా పరిస్థితులను గమనిస్తుంటే.. ఒకప్పుడు జిల్లాను ఏలిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు అరెస్టు భయంతో వణికిపోతూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. దాదాపుగా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డ పరిస్థితి.  గత ఏడాది ఎన్నికలలో పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి ఎమ్మెల్యూగా, కుమారుడు మిథున్ రెడ్డి రాజం పేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఒక విధంగా విజయం సాధించడం అదృష్టమనే చెప్పాలి. వారి మెజారిటీలు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఎన్నికలలో వారిద్దరి విజయం ఒక విధంగా చెప్పాలంటే చావు తప్పి కన్నులొట్టపోయిన సామెత చందమే.  ముఖ్యంగా పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి విషయం తీసుకుంటే.. పుంగనూరులో పెద్దిరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై కేవలం 6, 619 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అలాగే రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి  మిథున్ రెడ్డి విజయం కూడా అదృష్టమేనని చెప్పాలి. ఒక వేళ రాజంపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసి ఉంటే మిథున్ రెడ్డి కచ్చితంగా ఓటమి పాలై ఉండేవారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం కూటమి పొత్తులో భాగంగా రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం వల్లే మిథున్ రెడ్డి విజయం సాధించారని స్థానికులు సైతం అప్పట్లో చెప్పారు.  ఇప్పుడు తండ్రీ కొడుకులిరువురూ కూడా కేసుల ఉచ్చుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. మద్యం కుంభకోణం విషయంలో అరెస్టు నుంచి రక్షణ కోసం మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పెద్దిరెడ్డి అయితే తన నివాసంలో జారి పడి చేయి విరక్కొట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. 
పిఠాపురంలో అసలేం జరుగుతోంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకర్గం పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని గత ఏడాది జరిగిన ఎన్నికలలో  పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ నియోజకవర్గం నుంచే జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు.  అయితే అప్పటి వరకూ ఆ నియోజకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని అంతా భావించిన ఎస్పీఎస్ఎన్ వర్మ  చంద్రబాబు చెప్పిన ఒక్క మాటకు తలొగ్గి హుందాగా తప్పుకున్నారు. అంతే కాకుండా పిఠాపురం నుంచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. జనసేనాని విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అప్పట్లో చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ వాగ్దానం చేశారు. అయితే తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ పిఠాపురంలో మాత్రం ఇరు పార్టీల క్యాడర్ మధ్యా గ్యాప్ పెరుగుతూ వచ్చింది.  నియోజకవర్గంలో వర్మకు ఉన్నపట్టు పలకుబడి జనసేన శ్రేణులలో భయాన్ని పెంచుతున్నది. వర్మ పట్టు పలుకుబడి వారిని భయపెడుతున్నది.  నియోజకవర్గంలో ఆయన అధికార కేంద్రంగా మారుతారన్న భయంతో జనసేన ఆయనను పక్కన పెట్టడం ప్రారంభించింది.  ఇక ఇప్పుడు తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్య టించారు. ఆ సందర్భంగా జనసేన, తెలుగుదేశం శ్రేణుల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా బయట పడ్డాయి. జనసేన తీరు ఏరు దాటాకా అన్న సమెతను తలపింప చేస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు మాత్రమే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. ఎందుకంటే నాగబాబు పర్యటన సంద ర్భంగా వర్మకు ఆహ్వానం అందలేదు. నాగబాబు ఈ పర్యటనలో కొన్ని ప్రారంభోత్వాలలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ తరఫున జరిగిన ఈ అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందలేదు. దీనికి నిరసనగానా అన్నట్లుగా నాగబుబు పర్యటన ఆసాంతం తెలుగుదేశం కార్యకర్తలు వర్మ అనుకూల నినాదాలు చేశారు. ప్రతిగా జనసేన కార్యకర్తలు జనసేన, పవన్ కల్యాణ్, నాగబాబు అనుకూల నినాదాలు చేశారు. ఇరువర్గాల పోటా పోటీ నినాదాలతో నాగబాబు పర్యటించిన రెండు రోజులూ పిఠాపురం దద్దరిల్లిపోయింది. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. నాగబాబు పర్యటన ముగిసిన తరువాత.. తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదౌతున్నాయి. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఒక ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఇంకో కేసు నమోదైంది.  స్థానిక జనసేన నాయకుడుమొయిళ్ల నాగబాబు ఫిర్యాదుపై  తెలుగుదేశం కార్యకర్తలపై కేసు నమోదైంది.  తెలుగుదేశం కార్యకర్తలు తనను అడ్డుకుని తన మోటార్ సైకిల్ ను ధ్వంసం చేశారని మెయిల్ల నాగబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదింది. ఇక ఇంకో కేసు  ఏఎస్ఐ జానీ బాష ఫిర్యాదు మేరకు నమోదైంది. తెలుగుదేశం కార్యకర్తలు తన విధులకు ఆటంకం క లిగించారని ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు కేసులు నమోదు చేశారు.   ఇక్కడ రెండు విషయాలను చెప్పుకోవలసి ఉంటుంది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా పోలీసులే వారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే పరిస్థితి జగన్ హయాంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎదుర్కొన్నారు.  దీనిని బట్టి చూస్తుంటే స్థానిక పోలీసులు జనసేన ఆదేశాలను అమలు చేస్తున్నారని భావించాల్సి వస్తోంది.  ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే పిఠాపురంపై దృష్టి పెట్టాలి. లేదంటే పిఠాపురం తెలుగుదేశం శ్రేణుల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుకుని పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.  అాదే జరిగితే పిఠాపురంలో నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే కాదు జనసేనే కాదు. రెండు పార్టీలతో పాటు కూటమి ఐక్యతకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.  పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఇరు పార్టీలపైనా సమానంగా ఉంటుంది. ఒంటి చేతి చప్పట్ల వళ్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని పరిశీలకులు అంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం బుచ్చిబాబు సానా(Buchibabu Sana)దర్శకత్వంలో'పెద్ది'(Peddi)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్  నిన్న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యగా అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 36 .05 మిలియన్ల  వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డుని నెలకొల్పింది.దీంతో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ జాబితాలో ఉన్న దేవర 26 .17 మిలియన్లు, పుష్ప 2 20 .45 మిలియన్ల వ్యూస్ రికార్డుని 'పెద్ది' దాటేసాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్  చేస్తున్నారు.పెద్ది గ్లింప్స్ కి వస్తున్న రెస్పాన్స్ కి తనతో పాటు చిత్ర బృందం మొత్తం ఎంతో ఆనందపడుతుందని  చరణ్  తెలిపాడు. చరణ్ సరసన జాన్వీ కపూర్ జత కడుతున్న 'పెద్ది'లో  కన్నడ స్టార్ హీరో  శివరాజ్ కుమార్(SivarajKUmar)తో పాటు జగపతిబాబు,దివ్యేంద్రు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్(Ar rehman)మ్యూజిక్ అని అందిస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది.2026 మార్చి 27 చరణ్ బర్త్ డే కానుకగా పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.      
  "మేము మేము బాగానే ఉంటాం" అని హీరోలు అంటూనే ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా అభిమానులు గొడవలు పడుతూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ పై అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.   అల్లు అర్జున్ హీరోగా నటించిన 'ఆర్య-2' మూవీ ఈ వారం రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రదర్శించబడుతున్న ఒక థియేటర్ వద్దకు పవన్ కళ్యాణ్ అభిమాని వచ్చి "బాబులకే బాబు కళ్యాణ్ బాబు" అని నినాదాలు చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అతనిపై దాడి చేసి క్షమాపణలు చెప్పించారు. అంతేకాదు, అతని చేత "జై బన్నీ" అని నినాదాలు చేయించడమే కాకుండా, డ్యాన్స్ చేయాలని ఒత్తిడి కూడా చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగా, అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.   చిరంజీవికి అల్లు అర్జున్ మేనల్లుడు. మెగా, అల్లు వేరువేరు కాదు.. ఒకటే అన్నట్టుగా మొన్నటివరకు అభిమానులు ఉండేవారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం నుంచి వీరి మధ్య దూరం పెరిగింది. నిజానికి మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు. అభిమానులు మాత్రం అవసరంగా గొడవలకు దిగుతున్నారు.   ఒక హీరో సినిమాకి వచ్చి, ఆ హీరో అభిమానులను రెచ్చగొట్టేలా.. వేరే హీరో పేరుతో నినాదాలు చేయడం తప్పు. అలాగే ఆ నినాదాలు చేసిన వ్యక్తిని ఒంటరిని చేసి దాడి చేయడం కూడా అంతే తప్పు. అసలు అభిమానులకు ఒకరిపై ఒకరికి ద్వేషం ఎందుకు? ఒకరిపై ఒకరు దాడి చేసుకొని ఏం సాధిస్తారు?. హీరోలు ఒకరినొకరు మాటలు అనుకోవట్లేదు, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవట్లేదు. మరి అభిమానులు ఎందుకు ఇలా రోడ్డెక్కుతున్నారు?.   మెగా, అల్లు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఒక్కటే. ఆ రెండు ఫ్యామిలీలు.. ఫంక్షన్స్, పార్టీలలో బాగానే కలుస్తుంటాయి. ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా మాట్లాడుతుంటారు. కానీ, అభిమానులకు ఏమైంది? ఎందుకు గొడవలు పడుతున్నారు?. పోనీ ఆ రెండు కుటుంబాల మధ్య ఏదో వార్ ఉందని కాసేపు అనుకుందాం. ఉంటే మాత్రం.. అభిమానులకి గానీ, వారి కుటుంబాలకు గానీ వచ్చే నష్టమేంటి?. గొడవలతో తమ జీవితాలను నాశనం చేసుకోవడం తప్ప.. అటు హీరోలకి కానీ, ఇటు అభిమానులకి కానీ ఒరిగేది ఏముంది?.   ఈ విషయంపై మెగా, అల్లు కుంటుంబ పెద్దలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. చిరంజీవి, అల్లు అరవింద్ వంటి వారు మీడియా ముందుకి వచ్చి.. అభిమానుల మధ్య గొడవలకు బ్రేక్ పడేలా చేయాలి. లేదంటే భవిష్యత్ లో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది.  
Allu Arjun has become Icon Star of Indian Cinema with Pushpa 2 The Rule. He delivered a huge blockbuster that broke many records. Now, the actor is working with a sensational director like Atlee for his next. The movie is said to be catering to global audiences with science fiction theme.  According to sources from Tamil Media, the movie will be a space travel drama with parallel universe concept being explored. While the director previously planned it as a two big star leads film, Allu Arjun did not much interest in multi-starrer it seems. Now, it will have Allu Arjun in a double role for the first time.  Also, the movie plot with space travel and parallel universe concept will be a first for Indian Cinema. There will be many iconic scenes that will be etched in Indian Cinematic history, it seems. Sun Pictures, the production house, have stated, "A Magnum Opus where mass meets Magic".  So, some are predicting that the film could contain magical elements than space travel and parallel universe. But major sources state that Atlee wants to try something unique that caters to global audiences and not just Indian audiences with commerical template intact.  The director tried sports drama in commerical mass formula with Bigil and a social message film with magician as one of the leads with Mersal. So, it would be interesting to see if he would really attempt such high end sci-fi elements in this big budget film. The official confirmation about the film and concept will be revealed on Allu Arjun's birthday, tomorrow, 8th April. 
తమిళ సూపర్ స్టార్ అజిత్ అప్ కమింగ్ మూవీ 'గుడ్ బాడ్ అగ్లీ'(Good Bad Ugly).ఏప్రిల్ 10 న తమిళ,తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ కి 'అధిక్ రవిచంద్రన్'(adhik Ravichandran)దర్శకుడు కాగా త్రిష(Trisha)ప్రభు,అర్జున్ దాస్,ప్రసన్న,సునీల్,యోగిబాబు,రెడీన్ కింగ్ స్లే,జాకీ ష్రఫ్,ప్రియాప్రకాష్ వారియర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రీసెంట్ గా 'గుడ్ బాడ్ అగ్లీ'తెలుగు ట్రైలర్ రిలీజ్ అవ్వగా 'ఏకే' అనే క్యారక్టర్ లో అజిత్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే విషయం అర్ధమవుతుంది.దమ్ము నా కోసం వదిలిపెట్టా,మందు నా వైఫ్ కోసం వదిలిపెట్టా.వయలెన్స్ నా కొడుకు కోసం వదిలిపెట్టా.కానీ నా కొడుక్కి ఆపద వస్తే వదిలింది పట్టుకోవాలిగా అని అజిత్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ లో ప్రధాన హైలెట్ గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్ తో మూవీ ఏ లక్ష్యం కోసం తెరకెక్కిందో కూడా అర్థమైపోతుంది.మూవీలోని మిగతా క్యారక్టర్ లు కూడా ఏకే గురించి రకరకాలుగా చెప్పడం,'ఐ యామ్ బాడ్ బాయ్' అని అజిత్ చెప్పడం క్యూరియాసిటీని కలిగిస్తుంది. ట్రైలర్ ఆసాంతం డైలాగులు కూడా చాలా ఆసక్తికరంగా ఉండి,అభిమానులకి,ప్రేక్షకులకి కావాల్సినంత సినీ వినోదాన్ని అందించడం పక్కా.తెలుగు అగ్ర నిర్మాతలు మైత్రి మూవీస్ అధినేతలైన రవిశంకర్,నవీన్ సుమారు 250 కోట్ల బడ్జెట్ తో అజిత్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు.జి వి ప్రకాష్ కుమార్(Gv Prakashkumar)సంగీతాన్ని అందించగా అభినందన్ రామానుజం ఫొటోగ్రఫీ అందించాడు.  
  'పుష్ప-2'తో సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ప్లేస్ లోకి అనూహ్యంగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ షూట్ ను బన్నీ త్వరలో ప్రారంభించనున్నాడు. దీంతో త్రివిక్రమ్ సినిమా సంగతి ఏంటి? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. (AA22)   అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు వచ్చాయి. 2023 జులైలో వీరి కాంబోలో నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. 'పుష్ప-2' తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదేనని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, అనుకోకుండా అట్లీ మూవీ తెరపైకి వచ్చింది. దీంతో ఏడాదికి పైగా అల్లు అర్జున్ సినిమా కోసం ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ ఏం చేస్తాడు? మరికొంత కాలం ఎదురుచూస్తాడా? లేక వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడా? అనే చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా చేసే అవకాశముందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.   బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మైథలాజికల్ ఫిల్మ్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే చాలా సమయం పడుతుంది. పక్కా ప్లానింగ్ తో షూట్ కి వెళ్లాలనే ఆలోచనలో టీం ఉందట. త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ మీద వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారట. కొద్ది నెలలు ఆలస్యంగా షూట్ స్టార్ట్ అయినా.. షూట్ తక్కువ టైంలోనే పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారట. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకోనున్నారని సమాచారం.    ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్రకారం.. త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కానున్నారనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఆయన తన పూర్తి ఫోకస్ ని అల్లు అర్జున్ సినిమాపైనే పెడుతున్నారు. త్రివిక్రమ్ కి పురాణాలపై పట్టు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీతో చేయనున్న ఈ మైథలాజికల్ ఫిల్మ్ తో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.  
ప్రియదర్శి(Priyadarsi)శివాజీ(Sivaji)హర్ష రోష్,శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం'కోర్ట్'(Court).మార్చి 14 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా,వసూళ్ల పరంగా కూడా అంచనాలకి మించి కలెక్షన్స్ ని రాబట్టింది.రామ్ నారాయణ(Ram Narayana)దర్శకత్వంలో ప్రముఖ హీరో నాచురల్ స్టార్ నాని(Nani)ప్రశాంతి తిప్పరనేని సంయుక్తంగా నిర్మించగా విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ 11 న నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారకంగా ప్రకటించడంతో ఓటిటి మూవీ లవర్స్ లో సరికొత్త సినీ జోష్ వచ్చిందని చెప్పవచ్చు.ఫోక్సో చట్టంలో ఉన్న కొన్నిలోపాల వల్ల,ఏ తప్పు చెయ్యని అమాయకపు అబ్బాయిలు ఎలా బలవుతున్నారో 'కోర్ట్' లో చాలా చక్కగా చూపించారు.ప్రియదర్శి లాయర్ గా,హర్ష రోష్,శ్రీదేవిలు ప్రేమలో పడిన యువతీ యువకులుగా ఎంతో  అత్యద్భుతంగా నటించారు.శివాజీ నటనకి అయితే ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. ఈ విధంగా మిగతా పాత్రల్లో నటించిన సాయికుమార్,హర్షవర్ధన్,రోహిణి,శుభలేఖ సుధాకర్ ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రల పరిధి మేరకు నటించి మూవీ విజయంలో బాగస్వామ్యమయ్యారు.బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 48 కోట్ల దాకా వసూలు చేసింది.  
  తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ వంటి వెపన్స్ కలిగి ఉంటే కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కొంతమంది తెలుగమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ళ ఒకరు. (Ananya Nagalla)   స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో నటిగా మారారు అనన్య నాగళ్ళ.కెరీర్ ప్రారంభంలో 'షాదీ' వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంటనే 'మల్లేశం'తో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. వెంటనే 'ప్లే బ్యాక్' అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తర్వాత  'తంత్ర', 'పొట్టేల్', 'బహిష్కరణ'(వెబ్ సిరీస్), 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు.   ఇదిలా ఉంటే.. అనన్య నాగళ్ళ ఇప్పుడు  స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. 'తంత్ర', 'పొట్టేల్', 'బహిష్కరణ' 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ ఉండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో లో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది.    అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ళ బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు అనన్య నాగళ్ళ. ఈమె మెయిన్ లీడ్ గా ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది.. అంటే ఈమె క్రేజ్, మార్కెట్ రాష్ట్రాలు దాటాయి అని అర్దం చేసుకోవచ్చు.  
తమిళ స్టార్ హీరో అజిత్(Ajith)ఈ నెల 10న 'గుడ్ బాడ్ అగ్లీ'(Good Bad Ugly)మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers)అజిత్ కెరిరీలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా అదిక్ రవిచంద్రన్(adhik Ravichandran)దర్శకత్వం వహించాడు.అజిత్ సరసన త్రిష(Trisha)జోడి కట్టగా అర్జున్ దాస్,ప్రసన్న ముఖ్య పాత్రలు పోషించారు.జీవి ప్రకాష్ కుమార్(Gv Prakashkumar)సంగీతాన్ని అందించాడు. గుడ్ బాడ్ అగ్లీ థియేటర్స్ లోకి అడుగుపెట్టడానికి మూడు రోజులే ఉండటంతో అభిమానులు నెల్లైలోని బిఎస్ఎస్ థియేటర్ లో 285 అడుగుల అజిత్ భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు.కానీ ఇనుప రాడ్లతో నిర్మించిన ఆ  కటౌట్ అభిమానులు చూస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది.దీంతో అభిమానులు భయంతో పరుగులు తీసి తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు.అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 తో పాటుప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవల 'మాడ్ స్క్వేర్'సక్సెస్ మీట్ కి హాజరైన ఎన్టీఆర్ ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు.ఆ రెండిటి తర్వాత 'దేవర 2 'కూడా ఉంటుందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తన జీవితం అభిమానులకే అంకితం అని చెప్పి అభిమానుల పట్ల తనకున్న ప్రేమ ఏ పాటిదో కూడా తెలియచేసాడు. రీసెంట్ గా ప్రముఖ అగ్ర దర్శకుడు సుకుమార్ భార్య 'తబిత' ఇనిస్టాగ్రమ్ లో సుకుమార్ భుజాలపై ఎన్టీఆర్ ప్రేమగా వాలిపోయిన పిక్ ని షేర్ చేసింది.తారక్ కి ప్రేమతో అనే క్యాప్షన్ ని జోడించి ఎన్టీఆర్ కి ట్యాగ్ చేసింది.ఈ స్క్రీన్ షాట్ ని పంచుకున్నఎన్టీఆర్ నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్ అంటు సుకుమార్ ఐడి ని ట్యాగ్ చేసాడు.దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సుకుమార్,ఎన్టీఆర్ మధ్య ఎంత అనుబంధం ఉందో ఈ ఒక్క పిక్ తో తెలిసిపోతుందంటు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటంతో పాటు,ఆ ఇద్దరి కాంబోలో మరోసారి సినిమా రావాలని కూడా కోరుకుంటున్నారు. సుకుమార్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'నాన్నకుప్రేమతో' సాధించిన ఘన విజయం  తెలిసిందే.2016 లో వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ నటనలో ఉన్న మరో కోణాన్ని తెలియచెప్పడమే కాకుండా,ఎన్టీఆర్ పై ప్రేక్షకాభిమానాన్ని మరింత పెంచేలా చేసింది.'నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్ అంటు ఎన్టీఆర్ చేసిన  క్యాప్షన్ 'నాన్నకు ప్రేమతో' మూవీలోనిదే.  
సుదీర్ఘ కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని  అలరిస్తు వస్తున్న నటి హేమ(Hema).1989 లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన హేమ సుమారు 200 సినిమాలకి పైగా నటించింది,పలుతమిళ.కన్నడ,హిందీ భాషల్లోను నటించి తన సత్తా చాటిన హేమ,గతంలో తన పరువుకి భంగం కలిగించేలా ప్రముఖ నటి కరాటే కళ్యాణి బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్ట్ తమన్నాసింహాద్రి వ్యాఖ్యానించారని ఆ ఇద్దరికి  లీగల్ నోటీసులు పంపింది.ఈ విషయంపై హేమ మాట్లాడుతు లాస్ట్ టైం నేను ఒక ఇష్యులో ఇరుకున్నప్పుడు కరాటే కళ్యాణి,తమన్నా సింహాద్రి నన్ను బ్లేమ్ చేసారు.పలు మీడియా సంస్థలతో పాటు యూట్యూబ్ ఛానెల్స్ లో కూడా కూర్చొని నా పరువుకి భంగం కలిగేలా మాట్లాడారు.నాకంటు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది.నేను ఆర్టిస్ట్ అయినంత మాత్రాన,నోరు ఉంది కదా అని నా గురించి మాట్లాడే హక్కు ఎవరకి లేదు.నిజాలు అయినా మాట్లాడకూడదు.అలాంటిది అబద్హాలు ఎలా మాట్లాతారు.సోషల్ మీడియాలో కరాటే కళ్యాణి, సింహాద్రి తమన్నా అని టైపు చెయ్యగానే నా గురించి  మాట్లాడిన వీడియోలు వస్తున్నాయి.రేపు నా బిడ్డకి పెళ్లి అవ్వాలి.మనవలు,మనవరాళ్లు వస్తారు.నా గురించి అవాస్తవాలు మాట్లాడిన వీడియోల్ని వాళ్ళు చూస్తే నన్ను ఏమనుకుంటారు.ముందు ముందు నాలా మరెవరికి ఇలాంటివి జరగకుడదనే పరువు నష్టం దావా వేసాను. ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం తమన్నా సింహాద్రి అడ్రస్ దొరకలేదు.పైగా మా లాయర్ చనిపోయాడు. దాని వాళ్ళ కూడా డిలే అయ్యింది.కోర్టులో నాకు న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   ఫెమినిస్ట్.. ఈ పదం ఎక్కడైనా కనిపించింది అంటే సమాజం దృష్టి మొత్తం అటువైపు సారిస్తుంది.  ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సరే.. మహిళల వైపు వకల్తా పుచ్చుకుని మహిళల గురించి మాట్లాడేవారిని ఫెమినిస్ట్ లు అని అంటుంటారు.  ఫెమినిస్ట్ లు ఎక్కువగా మహిళలు మగాళ్ల కంటే ఎందులోనూ తక్కువ కాదు కదా అనే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు.  ఫెమినిస్ట్ ల వల్ల చాలా వరకు మహిళల  జీవితాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.  ముఖ్యంగా వివాహ విషయంలో ఫెమినిస్ట్ ల వల్ల మహిళలకు కూడా ప్రాధాన్యత ఏర్పడింది.  ఒకప్పుడు ఆడపిల్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. అబ్బాయి ఇష్టా ఇష్టాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో అమ్మాయి ఇష్టాఇష్టాలను అదే విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. మహిళల సమానత్వం గురించి మాట్లాడే స్త్రీ వాదుల వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది  ఎందుకంటే ఇలా సమానత్వం అనే విషయం గురించి మాట్లాడటం వల్ల భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తున్నాయని కొందరు వాపోతున్నారు. దీని  గురించి తెలుసుకుంటే.. స్త్రీ వాదం.. స్త్రీ వాదం అనేది స్పష్టంగా స్త్రీని సమర్థిస్తూ,  స్త్రీ హక్కుల గురించి, స్త్రీ పురుషుల సమానత్వం గురించి మాట్లాడే విషయం.  స్త్రీ వాదంలో పేర్కొనే స్త్రీ పురుష సమానత్వ భావన  స్త్రీ కి సమాజంలోనూ,  ఇంటా,  బయటా గౌరవాన్ని, స్త్రీ గతి శీలతను మార్చి వేసింది అని చెప్పవచ్చు. స్త్రీ వాదం ఎప్పుడూ స్త్రీని వెనుకబడిన వ్యక్తిగా కాకుండా సమాజంతో పాటు అభివృద్ది సాధించే వ్యక్తిగా మారుస్తుంది.  వివాహ మార్పు.. స్త్రీ వాదం వల్ల వివాహ విషయాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికాలంలో వివాహం చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం తొందరగా విడాకులకు దారి తీస్తున్నాయి. ఇందులో స్త్రీ వాదుల ప్రమేయమే ఎక్కువ కారణం అని కొందరి వాదన. అయితే భార్యాభర్తలు ఇద్దరూ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కేవలం పురుషుడు మాత్రమే అధికుడు అనే భావనతో ఉండటం సమంజసమైన విషయం కాదు.  స్త్రీ,  పురుషులు సమానం అని అంగీకరించినప్పుడు ఆ ఇద్దరి బందం ఎంతో ఆరోగ్యకరంగా సాగుతుంది. లింగ సమానత్వం అనేది బంధాల మీద ప్రబావం చూపినా అది భార్యాభర్తలను ఒక్కటిగా ఉంచేదే. అయితే ఈ లింగ సమానత్వాన్ని అంగీకరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. బాధ్యతలు.. ఇప్పటికాలంలో ఇంటి బాధ్యతల విషయానికి వస్తే ఆర్థిక విషయాలు అయినా ఇతరాలు అయినా మగవాడితో సమానంగా ఆడవారు కూడా బాధ్యతలు మోస్తున్నారు.  లింగ సమానత్వం పరంగా చూస్తే ఆడవారు కూడా బాధ్యతలు పంచుకుంటారు. దీని వల్ల భార్యాభర్తలు ఇద్దరి మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది.  ఇది ఆరోగ్య పరంగా అయినా,  కుటుంబ పరంగా అయినా మంచి మార్పుకు నాందిగా మారుతుంది. స్త్రీ వాదం కారణంగా బంధాల మధ్య బాధ్యతల విషయంలో ఎలాంటి సమస్యలు రావు కానీ భావోద్వేగాల విషయంలో మాత్రం మార్పులు ఉంటాయి. ప్రాధాన్యత.. స్త్రీ వాదులు లింగ సమానత్వాన్ని పేర్కొన్నప్పుడు  కుటుంబంలో మహిళలకు కూడా తమ అభిప్రాయాలు,  ఆలోచనలు వ్యక్త పరిచే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఇద్దరి మధ్య కూడా సమ ప్రాధాన్యత ఏర్పడుతుంది.  ఒకరు ఎక్కువ,  ఒకరు తక్కువ అనే భావన లేనంత వరకు ఏ బంధం అయినా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ప్రేమను,  నమ్మకాన్ని,  గౌరవాన్ని కలిగి ఉంటారు. నిర్ణయాలు.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల మీద ఇద్దరూ బాధ్యత కలిగి ఉంటారు. అలాగే ఇద్దరూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంబంధిత విషయంలో ఇద్దరూ సమత్వ భావన కలిగి ఉంటారు. ఇది భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహనను పెంచుతుంది. వివాహం,  సక్సెస్ మంత్రం.. వివాహం చేసుకోవడం తేలిక.. కానీ ఆ వివాహ బంధం సక్సెస్ కావడం కష్టం.  ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ సమత్వ భావనతో లేనప్పుడు చాలా మనస్పర్థలు, గొడవలు ఏర్పడతాయి. అదే భార్యను కూడా భర్త గౌరవిస్తే.. ఇద్దరూ సమానమే అనే భావనతో ఉంటే ఆ బంధం చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటుంది. కుటుంబ పరంగా అయినా, కెరీర్ పరంగా అయినా,  ఆర్థిక విషయాలు అయినా,  పిల్లల పెంపకం అయినా.. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సమ ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల వివాహ బంధం సక్సెస్ అవుతుంది. స్త్రీ వాదం అనేది మహిళలకు సమ ప్రాధాన్యత ఇచ్చినా, దాన్ని అంగీకరించినప్పుడు   అది వివాహ బంధాన్ని  సూపర్ సక్సెస్ చేస్తుంది.  అలా కాకుండా స్త్రీ  ని వివక్షతో చూస్తే ఆ బంధం తొందరగా బీటలు వారుతుంది.                                    *రూపశ్రీ.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
  బాబు జగ్జీవన్ రామ్ చాలా తక్కువ మందికి తెలిసిన వ్యక్తి.  విద్యార్థులను,  యువతను ప్రశ్నిస్తే ఈయన గురించి చెప్పేవారు తక్కువ. కానీ ఈయన తన జీవితాన్ని అంటరాని వారి అభ్యున్నతి కోసం అంకితం చేశారు.  అంటరానివారికి సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అయిన ఆల్-ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనకు  దోహదపడ్డారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ  తేదీన బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజును చాలా గొప్పగా జరుపుకుంటారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సెలవు దినంగా కూడా పరిగణిస్తారు.  ఈ సందర్భంగా  బాబు జగ్జీవన్ రామ్ గురించి తెలుసుకుంటే.. జగ్జీవన్ రామ్ ను బాబూజీ అని పిలుచుకుంటారు.  ఈయన  1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని 'అంటరాని' కులంలో జన్మించాడు. ఈయన జన్మించినది సామాన్య రైతు కుటుంబంలోనే. ఈయనకు ఒక అన్న,  ముగ్గురు చెల్లెళ్లు ఉండేవారు.   ఈయన తన బాల్యంలో,  విద్యాభ్యాసం కొనసాగిస్తున్న రోజుల్లో  కూడా షెడ్యూల్డ్ కులాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాలనే తన కోరికను వ్యక్తం చేసేవాడు. బాబూ జగ్జీవన్ రామ్ అడుగడుగునా వివక్షణ ఎదుర్కొన్నాడు.  అయినప్పటికీ ఆ వివక్షలను లెక్క  చేయకుండా చదువులో రాణించాడు.  1931 లో సైన్స్ లో డిగ్రీ పొందాడు.  అయినప్పటికీ ఆయనకు  సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి ఉండేది. ఎప్పుడూ అంటరాని వారికి సమానత్వం సాధించే విషయం గురించి ఆలోచించేవాడు.  ఈయనలో ఉన్న ఈ తపనను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరిశీలించాడు.  ఈ కారణంగా బాబు జగ్జీవన్ రామ్  నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించి అతన్ని రాజకీయ జీవితంలోకి ఆకర్షించేలా చేసింది. నిజానికి, బాబు జగ్జీవన్ రామ్ 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరాయంగా పార్లమెంటేరియన్‌గా ఉన్నారు.  ఇది ప్రపంచ రికార్డును  నమోదు చేసింది. బాబు జగ్జీవన్ రామ్ జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోని మొదటి క్యాబినెట్‌లో సభ్యుడు.  అంతేకాదు ఈ క్యాబినెట్ లో ఆయన  అతి పిన్న వయస్కుడైన మంత్రిగా,   భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉండేవారు. ఆయన ఉన్నత పదవులకు వెళ్లి రక్షణ మంత్రిగా (1970 - 1974),  ఉప ప్రధాన మంత్రిగా (1977 - 1979) కూడా పనిచేశారు. ఆయన 1986లో మరణించారు.  ఆయన మరణించే వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు.                                   *రూపశ్రీ.
వేసవికాలం అంటే అందరికి మామిడి పండ్లు గుర్తు వస్తాయి.  మామిడి పండ్ల వాసన నుండి రుచి వరకు ప్రతిదీ ఆకర్షిస్తుంది.  పసుపు రంగులో బాగా పండిన మామిడి పండ్లను తినకపోతే వేసవికాలానికి న్యాయం చేసినట్టే అనిపించదు.  అయితే మామిడి పండ్లు ఎంత రుచిగా ఉంటాయో.. కొందరికి అంతే చేటు చేస్తాయి.  మామిడి పండ్లు మిగతా పండ్ల లాగా ఆరోగ్యానికి చాలా మంచివే అయినా.. కొందరు మామిడిపండ్లు తినడం ఎంత మాత్రం మంచిది కాదు.  పండ్లలో రాజైన మామిడి పండులో ఉండే పోషకాలు ఏంటి? మామిడి పండును ఎవరు తినాలి? ఎవరు తినకూడదు అనే విషయం తెలుసుకుంటే.. పోషకాలు.. మామిడి పండ్లలో విటమిన్-సి,  విటమిన్-ఎ,  విటమిన్-బి9,  విటమిన్-ఇ, ఫైబర్, పొటాషియం,  ఐరన్,  కాపర్,  మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు  ఉన్నాయి.  ఈ పోషకాలు శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి.  అయితే మామిడి పండ్లను అందరూ తినడం మంచిది కాదు.   మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి.  ఈ సహజ చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.  మధుమేహం ఉన్నవారు,  కుటుంబంలో మధుమేహం సమస్య ఇప్పటికే ఉన్నవారు మామిడి పండ్లను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మధుమేహం ఉన్నవారు అయితే అసలు తినకూడదు. ఇటీవల కాలంలో పొట్ట సంబంధ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి.  వాటిలో గ్యాస్,  అసిడిటీ,  మలబద్దకం మొదలైనవి ముఖ్యమైనవి.  ఇవి  పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి వస్తున్నాయి.  ఈ సమస్యలు ఉన్నవారు మామిడి  పండ్లు తినకపోవడమే మంచిది.  మామిడిపండ్లను తింటే పై సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇప్పట్లో చాలా పెరుగుతున్నాయి.  ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారు,  చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు,  జీవక్రియ చాలా బలహీనంగా ఉన్నవారు.  అంటే తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది పడేవారు మామిడి పండ్లను తినకపోవడం మంచిది.  ఎందుకంటే మామిడి పండ్లు పై సమస్యలను ఎక్కువ చేస్తాయి. లేటెక్స్ కు అలెర్జీ ఉన్నవారు మామిడి పండ్లను తినకూడదు.  ఎందుకంటే మామిడి పండ్లలో ఉండే పోషకాలు,  ప్రోటీన్లు.. లేటెక్స్ లో ఉండే ప్రోటీన్ల మాదిరిగానే ఉంటాయి.  అందుకే మామిడి పండ్లను తింటే ఈ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు మామిడి పండ్లు తినే విషయంలో చాలా జాగ్రత్త పడాలి.  ఎందుకంటే మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కరెలు ఉంటాయి.  కేలరీలు ఎక్కువ ఉంటాయి.  మామిడి పండ్లను ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వేసవి కాలం వచ్చేసరికి శరీరంలో నీటి లోపం, డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. మండే ఎండలు,  తేమతో కూడిన వేడి కారణంగా అలసట, నీరసం,  చిరాకుగా అనిపించడం సర్వసాధారణం. చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు ఎనర్జీగా వెళతారు.  తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాడిపోయిన తోటకూర కాడలా కనిపిస్తారు.  అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం  కేవలం నీళ్లు తాగితే సరిపోదు. ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తీసుకోవాలి.  ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వేసవిలో తీసుకునే  జ్యూస్‌లు  శరీరాన్ని చల్లబరచడమే కాకుండా  శక్తిని కూడా ఇస్తాయి. ఈ మండే ఎండలో శరీరాన్ని తాజాగా ఉంచే మూడు జ్యూస్‌ల గురించి తెలుసుకుంటే.. పుచ్చకాయ నీటి కొరతను తొలగిస్తుంది.. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో ఉత్తమమైన హైడ్రేటింగ్ పండుగా మారుతుంది. దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్లు,  యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని శుద్ది  చేయడమే కాకుండా హైడ్రేషన్ స్థాయిని కూడా బ్యాలెన్స్ గా ఉంచుతాయి. ఇది శరీరంలో నీటి కొరతను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆమ్లత్వం నుండి ఉపశమనం ఇస్తుంది. చర్మాన్ని తాజాగా,  ప్రకాశవంతంగా ఉంచుతుంది. పుచ్చకాయ ముక్కలను మిక్సర్‌లో వేసి, కొంత నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి బ్లెండ్ చేయాలి.  కావాలంటే దానికి నల్ల ఉప్పు,  కొద్దిగా తేనె కూడా జోడించవచ్చు. కొబ్బరి నీరు సహజమైన,  ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి.. వేసవిలో కొబ్బరి నీళ్లు అత్యంత సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి. ఇందులో ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  నిమ్మరసంతో కలిపి తాగినప్పుడు ఇది అద్భుతమైన శక్తిని పెంచే పానీయంగా మారుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వేడి,  వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ, నల్ల ఉప్పు కలిపి తాగవచ్చు. దోసకాయ తాజాదనాన్ని కాపాడుతుంది.. దోసకాయలో 96 శాతం నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి చల్లదనాన్ని అందిస్తుంది. అదే సమయంలో పుదీనా సహజ శీతలీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. దోసకాయ శరీరంలో తాజాదనాన్ని కాపాడుతుంది, శరీరం డీహైడ్రేట్ కాకుండా   నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది,  జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దోసకాయ తొక్క తీసి ముక్కలుగా కోసి, పుదీనా ఆకులు, నిమ్మరసం, కొద్దిగా నల్ల ఉప్పు వేసి బాగా బ్లెండ్ చేయాలి. దాన్ని ఫిల్టర్ చేసి చల్లబరిచి త్రాగాలి.                                  *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...