ఊరుకుంటున్నాను కదా అని ప్రతీసారి నా మీద డైలాగులు వేయకు చిరాగ్గా ఉంది...
on May 10, 2025
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో ఈ శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అందులో ఫెస్టివల్ థీమ్ కావడంతో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ కలిసి మంచి మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో స్టేజి మీద మెరిశారు. అలాగే గేమ్స్ ని కూడా ఇరగదీసి ఆడారు. ఐతే ఈ షోలో రౌడీ రోహిణి ఇమ్మానుయేల్ మీద ఫుల్ ఫైర్ అయ్యింది. శ్రీముఖి రోహిణిని ఒక ప్రశ్న వేసింది "నువ్వు దీపావళి ఎలా సెలెబ్రేట్ చేసుకుంటావు" అని అడిగింది. "అందరూ చేసేవే చేస్తా. ఒక బాక్స్ లో బాంబులు తెచ్చుకుంటా..ఒక్కోటి వెలిగించి దొబ్బుతా" అంది రోహిణి.
దానికి ఇమ్మానుయేల్ కౌంటర్ ఇచ్చాడు. "ఒక బాక్స్ లో బాంబులు తెచ్చుకుంటుంది..ఇంకో బాక్స్ లో ఫుడ్ తెచ్చుకుంటుంది. అది తింటా ఇవి కాలుస్తా ఉంటది..నేను వాళ్ళ ఇంటికి ప్రతీ దీపావళికి వెళ్తాను, కానీ నాకేమీ పెట్టదు. " అంటూ రోహిణి పరువు తీసేసాడు. "కాదు కాదు రోహిణి పేల్చిన బాంబు వల్ల ఇలా అయ్యాడు" అని ఇమ్ము పరువు తీసేసాడు అమరదీప్. "ఈ ఎపిసోడ్ లో నా మీద డైలాగులు వేయడం ఇది మూడో సారో, నాలుగో సారో...అన్నీ ఓకే..కానీ ప్రతీ సారీ వేయకు నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను కూడా కొన్ని కొన్ని సార్లు యాక్సెప్ట్ చేస్తా కానీ ఎక్కువగా కంటిన్యుయస్ గా అలాగే జోకులేయకు" అని ఇమ్ము మీద ఫైర్ అయ్యింది రోహిణి. వెంటనే డెబ్జానీ కూడా "నన్ను కూడా లడ్డూలా ఉన్నావు" అన్నాడు ఇమ్ము అంటూ కంప్లైంట్ చేసింది. "ఇప్పుడేదో ఫన్ చేసి తర్వాతేదో నవ్వేయడంలా కాకుండా నేను నిజంగా చెప్తున్నా అన్ని సార్లు రిపీట్ చేయకుండా ఎప్పుడో ఒకసారి అంటే ఆ జోక్ తీసుకుంటా" అంది రోహిణి. దానికి ఇమ్మానుయేల్ "ఎప్పుడూ అనడం లేదు. అరగంటకుసారే అంటున్నా" అన్నాడు. అలా ఇద్దరి మధ్యా ఒక చిన్న ఫైట్ జరిగింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
